Special Story: తల్లికి నచ్చని కూతురి లవర్.. 25 ఏండ్లు బందీ చేసి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమ అనేది రెండు అక్షరాలు. కానీ ఈ ప్రేమలో అనేక చరిత్రలు ఉన్నాయి. ఈ ప్రేమ కోసం ఎందరో ప్రాణాలు త్యాగం చేశారు. మరొకొందరైతే ప్రాణాలు తీశారు. ఇంకొందరి ప్రేమలు మధ్యలోనే మసకబారిపోయాయి. దానికి కారణం వారి కుటుంబ సభ్యులె. పిల్లల ప్రేమను తల్లిదండ్రులు ఎవరైనా సరే చాలావరకు అంగీకరించరు. ఒకవేళ అంగీకారం తెలిపిన ఎన్నో అడ్డంకులు, ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి. వీటన్నిటిని దాటితే ఆ ప్రేమ పెళ్లి వరకు వెళుతుంది. లేదంటే మధ్యలోనే మసకబారిపోతుంది. ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులు వారి ప్రేమను అంగీకరించక పోవడం వల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు ఉన్నాయి. అయితే ప్రేమించిన పాపానికి ఓ యువతిని 25 సంవత్సరాలు గదిలో బంధించి చిత్రహింసలు పెట్టింది ఓ తల్లి. ఈ విషాద ఘటన ఏమిటో తెలుసుకుందామా..?
ప్రేమల్లో వారి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంవల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అందులోనూ ఆడపిల్లల విషయంలో అయితే మరి ఎక్కువగా నిబంధనలు పెట్టి ఉంచుతారు. అయితే ఆ యువతి ఒక వ్యక్తిని ప్రేమించినందుకు 25 సంవత్సరాలు తను ఒక రూములో బందీగా చేసింది ఆమె తల్లి. ఇది మానవ చరిత్రలోనే చాలా విషాదకరమైన ఘటనలో ఒకటిగా చెప్పవచ్చు. ఈ ఘటన గురించి వింటే నే కన్నీరు వస్తుంది. అయితే ఈ సంఘటన ఇప్పుడు జరిగింది అయితే కాదు. 19వ శతాబ్దంలో ఫ్రాన్సు దేశంలో జరిగినది..
Also Read
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
వివరాల్లోకి వెళితే 1876 లో ఫ్రాన్సు దేశంలో ప్లాన్ బ్లాంచే నియర్ అనే యువతి ఒక యువకుని ప్రేమించింది. అప్పుడు ఆమె వయసు 25 ఏళ్లు. ఆమె ప్రేమించిన టువంటి వ్యక్తి ఆమె తల్లికి నచ్చలేదు. దీంతో తన కూతురు ప్రేమను అంగీకరించలేదు. అంతే కాకుండా మరొక వ్యక్తితో ఆమెను వివాహం చేయాలనుకుంది. దీంతో సదరు యువతి నిరాకరించింది. తనకు ప్రేమించిన వ్యక్తి కావాలని తెగేసి చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైనటువంటి ఆ తల్లి తన కొడుకు సహాయముతో ఆ యువతిని చీకటి గదిలో బందీ చేసింది. గొలుసులతో కట్టింది. ఆమె చేసిన చిత్రహింసలు తట్టుకోలేక ఆ యువతి ప్రతిరోజు రోదించేది.
ఆ శబ్దాలను విన్నటువంటి బయటి వ్యక్తులు ఆమె తల్లిని ఆరా తీయగా తన కూతురుకు పిచ్చి లేసిందని చెప్పేది. దీంతో బ్లాంచే 50 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆ చీకటి గదిలో బందీగా ఉంది. ఆ యువతికి వారి ఇంట్లో ఒక పని వ్యక్తి ప్రతిరోజు ఆహారాన్ని అందించేవాడు. ఆమెను గొలుసుతో కట్టి పడేయడం వలన ఆయువతి మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేది. దీంతో ఎంతో దౌర్భాగ్యమైన జీవితాన్ని ఆయువతి అనుభవించింది.
చివరికి ఈ విషయం బయటకు రావడంతో పోలీసులు ఆమె ఇంటిపై దాడి చేశారు. ఆ యువతిని చూసి నిర్ఘంతపోయారు. చూడని పరిస్థితి, మాటలు రావడంలేదు, నడవడం లేదు. గది అంతా దుర్వాసన. లోపలికి వెళ్లడానికే పోలీసులు భయం వేసింది. గది అంతా పురుగులతో నిండిపోయి వుంది. పోలీసులు ఆయువతిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఆమె తల్లిని, సోదరుని అరెస్టు చేశారు. ఈ దారుణమైన సంఘటన ప్రపంచం మొత్తం చర్చనీయాంశంగా మారింది. దీంతో సదరు తల్లిని ప్రపంచమంతా అసహ్యించుకుంటుంది. తర్వాత సదరు యువతి 12 ఏళ్ళు బతికి మరణించింది.
Agnipath Protests: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్లపై నిజనిర్ధారణ కమిటీ
తాజావార్తలు
-
Unused Apps: మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ పర్సనల్ డేటా గోవింద..!
-
Acer TravelLite TL24-54M: భారత్ లో ఏసర్ ట్రావెల్ లైట్ TL24-54M ల్యాప్టాప్ విడుదల.. DDR5 RAM సపోర్ట్, AI ఫీచర్లు
-
Tridha: బాబీ డియోల్తో బోల్డ్ సీన్లే బ్రేకప్కు కారణమా? మాజీ ప్రియుడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన త్రిధా!
-
Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ ‘మావిగన్ వర్సెస్ అమరావతి’.. వైఎస్ జగన్ సవాల్..
-
Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..