NIA Raids: పలు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ దాడులు..

Nia And Pfi

Nia And Pfi

నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ)ని లక్ష్యంగా చేసుకుని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) మంగళవారం ఉదయం నాలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి. బీహార్‌లోని 12 చోట్ల, ఉత్తరప్రదేశ్‌లోని రెండు చోట్ల, పంజాబ్‌లోని లూథియానా, గోవాలో ఒక్కో చోట NIA బృందాలు దాడులు నిర్వహించాయి.

Also Read:Truck Loses Control: పెట్రోల్ పంప్ లోకి దూసుకెళ్లిన ట్రక్కు.. తర్వాత ఏం జరిగిందంటే..
ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ముస్లిం యువకులకు ఆయుధ శిక్షణ అందించడం, తీవ్రవాద సంస్థల్లో చేరేందుకు వారిని సమూలంగా మార్చడం వంటి ఆరోపణలు పిఎఫ్‌ఐపై ఉన్నాయి. ఈ కేసులో భాగంగా గతంలో ఎన్ఐఏ అధికారులు చాలా మందికి అరెస్ట్ చేశారు. కాగా, భారతదేశంలోని అట్టడుగు వర్గాల సాధికారత కోసం పని చేస్తుందని, దళితులు, ముస్లింలు, గిరిజనుల హక్కుల కోసం పోరాడుతుందని చెబుతోంది. అయితే, పీఎఫ్ఐ రాడికల్ ఇస్లాంను ప్రోత్సహిస్తోందని, ఉగ్రవాద సంస్థలకు రిక్రూట్మెంట్ చేస్తోందని నిఘావర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా చాలా సార్లు దాడులు నిర్వహించింది.