Site icon NTV Telugu

Gang R*pe: ఛీ.. ఛీ.. అసలు తల్లేనా..? మైనర్‌ కూతురిపై 8 సార్లు గ్యాంగ్‌ రేప్‌ చేయించి..!

Uprape

Uprape

Gang R*pe: ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడల్సిన తల్లే కూతురిపట్ల రాక్షసంగా వ్యవహరించింది. తన లవర్ తోపాటు ఇంకొందరితో పదమూడేళ్ల కూతురిపై సామూహిక అత్యాచారం చేయించింది. ఈ దారుణానికి ఒడిగట్టింది మామూలు మహిళకాదు.. బీజేపీ మహిళమోర్చా నాయకురాలు. ఈ కేసు సంచలనం సృష్టించడంతో ఈమెని పార్టీనుంచి సస్పెండ్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హరిద్వార్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలు అనామిక కొన్నాళ్లక్రితం భర్తతో విడిపోయింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె తల్లితో.. కుమారుడు తండ్రితో ఉంటున్నాడు. కుమార్తెను తీసుకుని అనామిక.. తన లవర్ సుమిత్ పట్వాల్‌తో టూర్‌కు వెళ్లింది. అక్కడ అనామిక అనుమతితో ప్రియుడు సుమిత్, అతని ఫ్రెండ్ శుభం బాలికపై గ్యాంగ్ రేప్ చేశారు.

Read Also: 2025 Suzuki V-Strom 800DE: అడ్వెంచర్ టూరర్ బైక్.. సుజుకి V-స్ట్రోమ్ విడుదల.. ధర ఎంతంటే?

ఈ ఏడాది జ‌నవ‌రిలో ఈ దారుణం జరిగిందని బాధితురాలు వాంగూల్మం ఇచ్చింది. హ‌రిద్వార్, ఆగ్రా, బృందావ‌న్ స‌హా ఇలా ప‌లు హోట‌ళ్లలో తనపై ఎనిమిది సార్లు సామూహిక లైంగికదాడి చేశారని తెలిపింది. విష‌యం తండ్రికి చెబితే త‌న త‌ల్లి చంపేస్తాన‌ని బెదిరించారని ఆరోపించింది. అంతేకాదు, ప్రతీసారి బాలికను లిక్కర్‌ తాగించి.. అఘాయిత్యానికి ఒడిగట్టినట్టుగా ఆరోపణలు ఉన్నాయి.. బాధితురాలు నెల పాటు తన తండ్రి దగ్గర ఉండటానికి వెళ్లినప్పుడు ఈ దారుణం బయటపడింది. కూతురిని పోలీస్‌ స్టేషన్ కు తీసుకెళ్లి కంప్లయింట్ చేయించాడు తండ్రి. బాధితురాలి ఫిర్యాదుతో నిందితులపై అత్యాచారం, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితులకు 14రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు. ఈ కేసు సంచలనం సృష్టించండతో అనమికాను పార్టీ నుంచి బీజేపీ సస్పెండ్ చేసింది.

Exit mobile version