Man Falls Moving Train: జర్ర ఉంటే సచ్చిపోతుంటిరా… రైలు నుంచి కింద పడిన యువకుడు
- జనరల్ బోగి ఎక్కబోయి.. ఏసీ ఫస్ట్ క్లాస్ ఎక్కిన యువకుడు
- రైలు మూవ్ అవుతుండగా కిందకు దిగిన యువకుడు
- రెప్పపాటులో యువకుడి ప్రాణాలు కాపాడిన రైల్వే సిబ్బంది
కాచిగూడ రైల్వే స్టేషన్ లో .. రైలు దిగుతూ.. కాలు జారి ఓ యువకుడు కిందపడిపోయాడు. బెంగుళూరు వెళ్లేందుకు కాచిగూడ స్టేషన్ చేరుకున్న అతడు రైలు దిగుతూ కిందపడిపోయాడు. వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది అతడిని కాపాడారు. కొంచెం అటు ఇటు అయితే.. యువకుడి ప్రాణాలు పోయేవని అధికారులు వెల్లడించారు.
Read Also:BJP MLA: రీల్స్ చేస్తూ… కాలుజారి నదిలో పడిపోయిన ఎమ్మెల్యే…
Also Read
- Drugs Seize: డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. రూ. 1,745 కోట్ల విలువైన కొకైన్ సీజ్.!
- Student Suicide: నిండు ప్రాణాన్ని బలితీసుకున్న నిరుద్యోగం.. కలల కొలువు దక్కకపోవడంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
- Shocking: 55 ఏళ్ల గ్రామపెద్దతో లేచిపోయిన 22 ఏళ్ల భార్య..
- Instagram Star Murder: భర్త చేతితో ఇన్స్టా స్టార్ దారుణ హత్య.. ట్విస్ట్ ఏంటంటే..?
పూర్తి వివరాల్లోకి వెళితే.. వరంగల్ కు చెందిన మణిదీప్ అనే యువకుడు బెంగళూరుకు వెళ్లేందుకు కాచిగూడ రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. సాధారణ టికెట్ తీసుకున్న అతడు, రైలు వచ్చేసరికి.. అనుకోకుండా ఏసీ ఫస్ట్ క్లాస్ బోగిలో ఎక్కేశాడు. కొద్ది సేపటికి రైలు కదులుతుండగా కిందకు దిగేశాడు. దీంతో అతడి కాలు జారి రైలు కింద పడిపోయేవాడు. అక్కడే విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ గోవింద రావు, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సుస్మిత.. అతడిని పక్కకు లాగి కాపాడారు. ప్రమాదాన్ని పసిగట్టి వెంటనే స్పందించిన రైల్వే ఉద్యోగులను స్థానికులు, రైల్వే అధికారులు అభినందించారు.
Read Also:Suspended: రెస్టారెంట్లో అన్నచెల్లెళ్లిని వేధించిన పోలీస్ అధికారి.. తర్వాత ఏమైందంటే..
ప్రయాణికుల భద్రత కోసం రైల్వే అధికారులు తరచుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, ఇంకా కొందరు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని ఆర్పీఎఫ్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. రైలు ఎక్కే ముందు అన్ని వివరాలు చూసుకున్న తర్వాతనే సరైన ట్రైన్ ఎక్కాలని పాసింజర్లకు రైల్వే అధికారులు సూచిస్తున్నారు. రైల్లో ప్రయాణించేటప్పుడు సైతం జాగ్రత్తలు పాటించాలని వివరించారు.
రైల్వే స్టేషన్ లో ప్రయాణికుడికి తృటిలో తప్పిన ప్రమాదం
కాచిగూడ రైల్వే స్టేషన్ లో రాంగ్ ట్రైన్ ఎక్కి దిగేందుకు యత్నించిన మణిదీప్ అనే యువకుడు
దిగే క్రమంలో ట్రైన్మ్ కింద పడబోయిన ప్రయాణికుడు
అప్రమత్తమై మణిదీప్ ని కాపాడిన రైల్వే సిబ్బంది, తోటి ప్రయాణికులు pic.twitter.com/C1raSNZL21— ChotaNews App (@ChotaNewsApp) October 28, 2025
తాజావార్తలు
-
PBKS Income: 2008 నుంచి ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కొట్టని పంజాబ్కు డబ్బులే డబ్బులు.. ఎలా అంటే..
-
AP Mobile Alert: మొబైల్లో అలర్ట్ షాక్.? రేపు ఎన్నిగంటలకంటే..!
-
Himanta Sarma: హిమంత వ్యాఖ్యలతో బంగ్లాదేశ్లో కలకలం..
-
Palakura Ullikaram Recipe : పాలకూర ఉల్లికారం.. అన్నం, చపాతీల్లోకి అదిరిపోయే రుచి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
RR Vs DC: యశస్వి జైస్వాల్ చేసిన పరుగులు 6.. అయినా మరో ప్రపంచ రికార్డు బద్దలు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!