NTV Telugu Site icon

Nagpur: పెరోల్‌పై వచ్చినా బుద్ధి మారలేదు.. మహిళ, ఆమె మైనర్ కూమార్తెపై అత్యాచారం..

Maharashtra

Maharashtra

Nagpur: జైలు నుంచి పెరోల్‌పై వచ్చినా కూడా అతని బుద్ధి మారలేదు. ఒక మహిళ, ఆమె మైనర్ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో జరిగింది. ఒక హత్య కేసులో దోషిగా తేలిని వ్యక్తికి ఇటీవల పెరోల్ మంజూరైందని, ప్రస్తుతం అతడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.

Read Also: Health Tips : రోజుకు రెండు సార్లు టీ తాగుతున్నారా? అయితే మీరు డేంజర్ లో పడ్డట్లే…

నగరంలోని జరీపట్క ప్రాంతానికి చెందిన భరత్ గోస్వామి(33) 2014లో ఓ హత్య కేసులో దోషిగా తేలాడు. జనవరి 25న తనకు తెలిసిన 43 ఏళ్ల మహిళ ఇంటికి వెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన 14 ఏళ్ల కూతురుపై కూడా లైంగిక వేధింపుకు పాల్పడినట్లు, ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని నిందితుడు బెదిరించినట్లు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో, అత్యాచార చట్టాల కింద కేసు నమోదు చేసి, నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.