Marriage Fraud: పెళ్లి పేరుతో ఒంటరి మహిళను ట్రాప్ చేసి రూ. 28 కోట్ల మోసం..
- నాగమణికి 1992లో ఒక వ్యక్తితో వివాహం
- రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి
- అదే దిగులుతో చనిపోయిన నాగమణి భర్త
- నాగమణికి వచ్చిన కొడుకు బీమా డబ్బులు, భర్త ఆస్తులు
- మళ్లీ పెళ్లి చేసుకోవాలని భావించిన నాగమణి
- శేషాపురానికి చెందిన శివప్రసాద్ నాయుడు పరిచయం
- భార్య చనిపోయిందని, పిల్లలు లేరని శివప్రసాద్ నాయుడు
- భార్య డెత్ సర్టిఫికెట్లు కూడా చూపించాడు
- 2022లో శివప్రసాద్ నాయుడు, నాగమణి పెళ్లి
- రూ.1,700 కోట్ల లాటరీ వచ్చిందన్న శివప్రసాద్
- పన్నుల రూపంలో రూ.15 కోట్లు చెల్లించాలని బుకాయింపు
- రూ.3 కోట్లు శివప్రసాద్, అతని అన్న చక్రవర్తి
- వదిన హేమలత బ్యాంకు ఖాతాలకు బదిలీ
- మొత్తం రూ.28 కోట్లు తీసుకున్న శివప్రసాద్
- బంగారుపాళ్యానికి వెళ్లిన నాగమణికి షాక్
- శివ ప్రసాద్కు భార్యతోపాటు 8 ఏళ్ల కూతురు
ఒంటరిగా ఉన్న ఓ మహిళను నమ్మకంగా పెళ్లి చేసుకున్న ఓ ప్రబుద్ధుడు లాటరీ పేరుతో ఆమెకు టోకరా వేశాడు. రూ.15 కోట్లు పన్నులు చెల్లిస్తే రూ.1,700 కోట్లు వస్తాయని ఆశలు కల్పించాడు. చివరికి ఆమె ఆస్తులు అమ్మించి రూ.28 కోట్లు తీసుకుని పరారయ్యాడు. బాధితురాలు చిత్తూరు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఇక్కడ.. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు శివ ప్రసాద్ నాయుడు. వీడు మామూలోడు కాదు. బెంగళూరుకు చెందిన ఓ మహిళను పెళ్లి పేరుతో చీటింగ్ చేశాడు.. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని రాజుపేటకి చెందిన నాగమణికి 1992లో ఒక వ్యక్తితో వివాహమైంది. ఒక కొడుకు కూడా పుట్టాడు. కొన్నేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో కొడుకు చనిపోయాడు. అదే దిగులుతో భర్త కూడా మరణించాడు. కొడుకు బీమా డబ్బులు, భర్త ఆస్తులన్నీ నాగమణికి వారసత్వంగా వచ్చాయి..
READ MORE: Shine Tom Chacko: బహిరంగంగా క్షమాపణలు చెప్పిన ‘దసరా’ విలన్.. వివాదానికి ముగింపు!
Also Read
- IRS Officer Daughter Murder: నిందితుడి నేర చరిత్ర తెలిసి షాకైన పోలీసులు.. బ్యాగ్రౌండ్ ఎంత ఘోరమంటే..!
- Gujarat: సూరత్లో ప్రముఖ పారిశ్రామికవేత్త కోడలు ఆత్మహత్య.. 2 నెలల క్రితమే పెళ్లి
- IRS Officer Daughter Murder: ఐఆర్ఎస్ అధికారి కుమార్తె కేసులో వీడిన మిస్టరీ! వెలుగులోకి సంచలన విషయాలు
- Bank Fraud: SBI బ్యాంక్లో పక్కా ప్లాన్ చేశారు.. రూ.2.65 కోట్లను దోచేశారు.. కీపింగ్ స్టాప్, ఫొటో గ్రాఫర్తో పాటు..
ఒక్కగానొక్క కొడుకు, భర్త మృతి చెందడంతో ఎంత ఆస్తి ఉండి ఏం లాభం అనుకుంది. మళ్లీ పెళ్లి చేసుకోవాలని భావించింది. ఇందుకోసం చిత్తూరులోని ఓ పెళ్లిళ్ల మధ్యవర్తిని సంప్రదించింది. ఈ క్రమంలో బంగారుపాళ్యం మండలం శేషాపురానికి చెందిన శివప్రసాద్ నాయుడు ఆమెకు పరిచయం అయ్యాడు. తన భార్య చనిపోయిందని, పిల్లలు కూడా లేరని చెప్పాడు. పైగా భార్య డెత్ సర్టిఫికెట్లు కూడా చూపించాడు. దీంతో నాగమణి అతన్ని నమ్మింది. ఆ తర్వాత పెళ్లికి అంగీకరించింది. కుటుంబ సభ్యుల సమక్షంలో శివప్రసాద్ నాయుడిని 2022 అక్టోబర్లో కర్ణాటకలోని బంగారు తిరుపతి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అక్కడే ఇద్దరు కాపురం పెట్టారు..
READ MORE: Hyderabad: పెళ్లై రెండు నెలలైనా కాలేదు..! భర్త ఆత్మహత్య.. హుస్సేన్ సాగర్లో దూకిన భార్య
కొన్ని రోజుల తర్వాత శివ ప్రసాద్ నాయుడు అసలు కథ మొదలు పెట్టాడు. తనకు ఆర్బీఐ నుంచి రూ.1,700 కోట్ల లాటరీ తగిలిందని నాగమణికి ఓ పత్రాన్ని చూపించాడు. ఈ మొత్తం రావాలంటే పన్నుల రూపంలో రూ.15 కోట్లు చెల్లించాలని నమ్మించాడు. దీంతో ఆమె తన బ్యాంకు ఖాతాలో ఉన్న దాదాపు రూ.3 కోట్ల నగదును శివప్రసాద్, అతని అన్న చక్రవర్తి, వదిన హేమలత బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసింది. రూ.15 కోట్ల విలువ చేసే భూములు, రూ.10 కోట్ల విలువ చేసే భవనాన్ని విక్రయించి మొత్తం రూ.28 కోట్లు తీసుకున్నాడు శివప్రసాద్. ఇంత వరకు బాగానే ఉంది. అలా రోజులు గడుస్తున్నాయి. కానీ RBI నుంచి రావాల్సిన డబ్బు రావడం లేదని నాగమణి ప్రశ్నించింది. కానీ మాయమాటలు చెప్పి తప్పించుకున్నాడు. ఓసారి గట్టిగా నిలదీయడంతో చంపేస్తానని బెదిరించాడు. అంతే కాదు గతేడాది డిసెంబరులో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతడ్ని వెతుక్కుంటూ బంగారుపాళ్యానికి వెళ్లిన నాగమణికి ఊహించని షాక్ తగిలింది. శివప్రసాద్ నాయుడికి భార్యతోపాటు 8 ఏళ్ల కూతురు ఉన్నారని తెలిసి విస్తుపోయింది. దీనిపై గట్టిగా నిలదీయడంతో అందరూ కలిసి ఆమెపై దాడిచేసి, చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు… పోలీసులు ఈ కేసుపై సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. నాగమణిని మోసం చేసిన శివప్రసాద్ నాయుడును విచారిస్తున్నారు..
తాజావార్తలు
-
IPL 2026: ‘వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకో’.. ఆ ఆటగాడిపై తీవ్ర ఆగ్రహం..
-
Varanasi: అంటార్కిటికాలో బాబు వేట!
-
Islamabad in Lockdown: 10 రోజులుగా లాక్డౌన్లో ఇస్లామాబాద్.. తిట్టిపోస్తున్న పాక్ ప్రజలు..
-
Rain Alert: తెలంగాణ వాతావరణ శాఖ కీలక అలర్ట్.. ఈ జిల్లాల్లో వడగళ్ల వాన..
-
Iran Mocks Trump: ‘‘షట్ అప్, ట్రంప్’’.. హైదరాబాద్ ఇరాన్ కాన్సులేట్ సెటైర్లు..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!