ఉత్తరప్రదేశ్ లో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహ వేడుకల్లో వంట చేస్తున్న యువకుడు.. రోటీలు తయారు చేస్తూ.. వాటిపై ఉమ్మేశాడు. ఈ విషయం తీవ్ర వివాదానికి దారి తీసింది. అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. వీడియో వైరల్ కావడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also: Breakup: ఆన్ లైన్ లో కుదిరిన సంబంధం.. ఆఫ్ లైన్ లో రద్దైన పెళ్లి..
ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లో జరిగిన ఒక వివాహ వేడుకలో రోటీలపై ఉమ్మి వేసిన కేసు నమోదైంది. పెళ్లిలో వంట చేస్తున్న యువకుడు రోటీలు తయారు చేస్తుండగా వాటిపై ఉమ్మి వేశాడు. రోటీలపై ఉమ్మి వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు పఠాన్ తోలా ప్రాంతానికి చెందిన డానిష్ గా పోలీసులు గుర్తించారు.
Read Also: Runway: ఫ్లైట్ డోర్ తీసేందుకు ప్రయత్నించిన వ్యక్తి.. కిందికి దింపేసిన సిబ్బంది..
నవంబర్ 2న పహాసు పోలీస్ స్టేషన్లో డానిష్పై కేసు నమోదు చేసి జైలుకు పంపినట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ తేజ్వీర్ సింగ్ తెలిపారు. రోటీలపై ఉమ్మివేయడం ఇది మొదటిసారి కాదని .. నిందితుడిపై ఘజియాబాద్, బులంద్షహర్ , మీరట్ ఇతర జిల్లాలలో కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. గత నెలలో, జాగరణ సమయంలో రోటీలపై ఉమ్మి వేసిన కేసు నమోదైందన్నారు. ఈ సంఘటన యొక్క వీడియో వైరల్ అయింది. తరువాత పోలీసులు నిందితుడైన యువకుడిని అరెస్టు చేశారు.
यूपी–
बुलंदशहर जिले में दानिश पर आरोप है कि वो शादी समारोह में थूककर रोटियां बना रहा था। लोगों ने पकड़कर पुलिस को सौंप दिया। pic.twitter.com/dYW6hV1TCp— Sachin Gupta (@SachinGuptaUP) November 4, 2025
