Lucky Draw Fraud: లక్కీ డ్రా పేరుతో భారీ మోసం.. 72 లక్షలు స్వాహా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lucky Draw Lottery Fraud In Nizamabad: మధ్య తరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అందరికీ తెలుసు. చాలీచాలని జీతంతో కుటుంబం బాధ్యతలు మోస్తూ.. చాలా కష్టంగా తమ జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. వీళ్లందరూ తమ తలరాతను మార్చే అదృష్ట ఘడియల కోసం ఎల్లప్పుడూ వేచి చూస్తుంటారు. వాళ్ల ఈ అవసరాన్నే కొందరు దుండగులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశచూపి.. భారీ మోసాలకు పాల్పడుతున్నారు. వారిని నిండా దోచేసి, డబ్బులతో ఉడాయిస్తున్నారు. ఇప్పుడు ఓ ప్రబుద్ధుడు కూడా అలాంటి మోసానికే పాల్పడ్డాడు. మధ్య తరగతి వారిని టార్గెట్ చేసి, లక్కీ డ్రా ఆశ చూపి, ఏకంగా రూ. 72 లక్షలు దోచేసుకున్నాడు. మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. రెండేళ్లు గడిచినా, పోలీసులు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Nama Nageswara Rao: ఇది రైతు వ్యతిరేక బడ్జెట్.. పార్లమెంట్లో దీన్ని వ్యతిరేకిస్తాం
Also Read
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
కొన్నేళ్ల క్రితం ఫిరోజ్ అనే వ్యక్తి షైన్ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఒక సంస్థని ప్రారంభించాడు. ఇది ఒక లక్కీ డ్రా అని, నెలకు రూ.1000 చొప్పున డబ్బులు కడితే.. లక్కీ డ్రా వచ్చిన వాళ్లు భారీ డబ్బులు అందుకోవచ్చని ఆశ చూపించాడు. ఇదేదో బాగుంది కదా అని మధ్య తరగతి వారు అతడు చెప్పినట్టుగానే నెలకు రూ.1000 చొప్పున కట్టారు. ఇలా మొత్తం 350 మంది 20 నెలల పాటు లక్కీ లాటరీకి డబ్బులు కట్టారు. ఈ విధంగా అందరి వద్ద నుంచి రూ.72 లక్షలకు పైగా డబ్బులను వసూలు చేశాడు. సరైన సమయం కోసం వేచి చూసిన ఫిరోజ్.. అందరికీ శఠగోపం తొడిగించి, ఆ డబ్బులతో ఉడాయించాడు. ఎక్కడా అతని జాడ కనిపించకపోవడం, ఫోన్లు కూడా స్విచ్చాఫ్ రావడంతో.. ఫిరోజ్ తమని మోసం చేశాడని బాధితులు గ్రహించి, పోలీసుల్ని ఆశ్రయించారు. నిజామాబాద్, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్ ప్రాంతాల్లో ఇతని బాధితులు ఉన్నారు. రెండు సంవత్సరాల నుంచి న్యాయం చేయాలని వీళ్లు పోలీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయితే.. ఇప్పటికీ బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడంతో, బాధితులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Uttam Kumar Reddy: కేంద్ర బడ్జెట్పై ఉత్తమ్ ఫైర్.. ఆ విషయంలో కేసీఆర్ ఫెయిల్
తాజావార్తలు
-
IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
-
Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
-
West Bengal: టీఎంసీ ఆఫీస్లో వందలాది ఆధార్ కార్డులు.. బెంగాల్లో సంచలనం!
-
Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
-
KamalHaasan : నాకు రజనీకాంత్కు మధ్య పోటీ మాత్రమే ఉంది.. విజయ్ నుండి ఎక్కువ ఆశించకూడదు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..