Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో ఉన్నత స్థానంలో నిలబెట్టాల్సిన ఒక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్.. విద్యార్థిని పట్ల కీచకుడిగా మారిన వైనం లక్నో యూనివర్సిటీలో తీవ్ర కలకలం రేపింది. పరీక్షా పత్రాలను లీక్ చేస్తాననే నెపంతో, ఒక బీఎస్సీ విద్యార్థినిని లైంగికంగా లొంగదీసుకోవడానికి ప్రయత్నించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాధితురాలు ధైర్యంగా ప్రొఫెసర్ బాగోతాన్ని ఆడియో రికార్డింగుల రూపంలో బయటపెట్టడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
ఘోరానికి ఒడిగట్టిన ప్రొఫెసర్..
లక్నో యూనివర్సిటీ జువాలజీ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పరంజిత్ సింగ్, ఒక విద్యార్థినిని మానసికంగా, లైంగికంగా వేధించాడు. “నీ కోసం రెండు క్వశ్చన్ పేపర్లు తెచ్చాను, నన్ను కలవడానికి ఎప్పుడు వస్తావు?” అంటూ సదరు ప్రొఫెసర్ ఫోన్ లో వేధించడం ఆ ఆడియోలో స్పష్టమైంది. దానికి ఆ విద్యార్థిని “నేను సిలబస్ అంతా చదివేసాను సర్.. అవి నాకు అనవసరం లేదు” అని చెప్పినా వినకుండా, పరీక్షలకు వారం రోజుల ముందే తనను ఒంటరిగా కలవాలని సదరు ప్రొఫెసర్ తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. గతంలో కూడా తనను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడని, కేవలం తనను శారీరకంగా వేధించడానికే ప్రొఫెసర్ పిలుస్తున్నాడని ఆ విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది.
Also Read
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్పై కేసు, ఉద్యోగానికి గుడ్బై.!
ధైర్యం చేసిన బాధితురాలు ఆడియో క్లిప్లను యూనివర్సిటీ అధికారులకు సమర్పించడంతో, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రొఫెసర్ పరంజిత్ సింగ్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే వర్సిటీ అంతర్గత రాజకీయాల వల్లే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ప్రొఫెసర్ బుకాయించాడు.
మరోవైపు ఈ ఘటనపై అఖిల భారత విద్యార్థి పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడిపై కఠిన చట్టాల కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ క్యాంపస్లో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. స్పందించిన వైస్ ఛాన్సలర్ జేపీ సైనీ.. అంతర్గత కమిటీని ఏర్పాటు చేసి 24 గంటల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే ఇలాంటి చర్యలను ఎంతమాత్రం సహించేది లేదని వర్సిటీ స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
-
Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!