Site icon NTV Telugu

Karnataka: పెళ్లికి నిరాకరించిందని విద్యార్థిని గొంతు కోసి చంపిన ప్రేమోన్మాది..

Karnataka

Karnataka

Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. పెళ్లికి ఒప్పుకోలేదని ఓ ప్రేమోన్మాది యువతి గొంతు కోసి చంపాడు. ఈ ఘటన రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా సింధనూర్‌లో జరిగింది. పట్టపగలే ఈ దారుణం జరిగింది, నేరం చేసిన తర్వాత నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. మరణించిన విద్యార్థిని షిఫా(24)గా గుర్తించారు. నిందితుడు టైల్స్ దుకాణంలో పనిచేసే ముబిన్‌గా గుర్తించారు.

సింధనూర్ పట్టణంలోని ఒక ప్రైవేట్ కాలేజీలో ఎంఎస్సీ చదువుతున్న షిఫా, లింగసగురు నుంచి ప్రతీ రోజు కాలేజీకి వస్తూపోతూ ఉండేదని పోలీసులు తెలిపారు. ఆమెకు 6 ఏళ్లుగా నిందితుడితో పరిచయం ఉందని, ఆ సమయంలో నిందితుడు ఆమె పట్ల ప్రేమను పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఇటీవల షిఫాకు వేరే వ్యక్తితో వివాహం గురించి ఇంట్లో చర్చలు ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న ముబిన్ తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. షిఫా దీనికి నిరాకరించింది.

Read Also: CM Revanth Reddy : ప్రభుత్వ పాఠశాల్లో AI ఆధారిత డిజిటల్ విద్య.. సర్కార్ కీలక నిర్ణయం

పెళ్లికి నిరాకరించిందనే కోపంతో నిందితుడు లింగసగురు నుంచి ఆమెను వెంబడించి సింధనూర్ ప్రభుత్వ గ్రాడ్యుయేట్ కాలేజీ సమీపంలో ఆమెపై దాడి చేశాడు. మెడపై కత్తితో పొడిచి, ఆపై గొంతు కోసం అక్కడి నుంచి పరారయ్యాడు. హత్య చేసిన తర్వాత, షిఫాను పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి దుకాణానికి వెళ్లి గొడవపడ్డాడు. ఈ ఘటన తర్వాత నిందితుడు లింగసగురు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

గతేడాది ఏప్రిల్ నెలలో హుబ్బళ్లి నగరంలో ఎంసీఏ విద్యార్థి నేహ హిరేమత్‌ని ఫయాజ్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసి చంపాడు. ఎన్నికల ముందు ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. మే నెలలో అంజలి అంబిగేర అనే యువతిని విశ్వ అనే వ్యక్తి కొత్తితో పొడిచి చంపాడు.

Exit mobile version