AI CHANDRA BABU: సైబర్ వలలో పడ్డ ఖమ్మం టీడీపీ కార్యకర్తలు
- టీడీపీ కార్యకర్తలకు ఓ వ్యక్తి వీడియో కాల్
- దేవినేని ఉమ పీఏగా పరిచయం చేసుకున్న వ్యక్తి
- స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు, బీఫామ్లను ఇప్పిస్తానని హామీ
- నిందితుడి 35 వేల రూపాయలు పంపిన బాధితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం జిల్లాలో కొంత మంది టీడీపీ కార్యకర్తలు సైబర్ వలలో పడ్డారు. సత్తుపల్లి నియోజకవర్గం చెందిన కాకర్లపల్లికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలకు ఓ వ్యక్తి వీడియో కాల్ చేశాడు. తనను తాను మాజీ మంత్రి దేవినేని ఉమ పీఏగా పరిచయం చేసుకున్నాడు. తాను దేవినేని ఉమాతో మాట్లాడి.. చంద్రబాబు వద్దకు తీసుకుని వెళ్తామని చెప్పుకొచ్చాడు. ఆయా టీడీపీ కార్యకర్తలకు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లను, బీఫామ్లను ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. కానీ తమ ఖర్చుల కోసం డబ్బులు పంపించమని కోరాడు. దీంతో అంతా నిజమే అనుకుని నమ్మారు ఆ టీడీపీ కార్యకర్తలు. అతనికి 35 వేల రూపాయలు పంపించారు… స్పాట్..
ఇక ఆ వ్యక్తి అందరినీ విజయవాడలోని ఓ హటల్కు రమ్మన్నాడు. హోటల్లో రూమ్, భోజనాలు ఖర్చు అంతా తమదేనని చెప్పుకొచ్చాడు. అంతా బాగానే ఉంది.. కానీ చిన్న లిటిగేషన్ పెట్టాడు. చంద్రబాబు వద్దకు తీసుకు వెళ్లాలంటే తలా 10 వేల రూపాయలు ఇవ్వాలని షరతు పెట్టాడు. దానికి ఒప్పుకున్న 10 మంది టీడీపీ కార్యకర్తలు హోటల్కు వెళ్లారు. చంద్రబాబు వద్దకు తీసుకు వెళ్తానన్న వ్యక్తి కూడా హోటల్కు వచ్చాడు. కానీ ఆయన బిజీగా ఉన్నారని.. కాసేపట్లో వీడియో కాల్ చేసి మాట్లాడుతారని చెప్పుకొచ్చాడు. దీంతో టీడీపీ కార్యకర్తలు కూడా ఓకే అన్నారు. చివరకు ఆ వ్యక్తి.. ఫోన్ చేయించినట్లుగా చెప్పి.. చంద్రబాబుతో వీడియో కాల్ మాట్లాడించాడు..
Also Read
- Drugs Party : మాదాపూర్లో అర్ధరాత్రి డ్రగ్స్ పార్టీపై దాడి.. బెజవాడ కనెక్షన్ బట్టబయలు
- Maharashtra: ఫుట్బాల్ కోచ్ దారుణం.. మూడేళ్లుగా మైనర్ బాలికపై అత్యాచారం..
- Hyderabad: వనస్థలిపురంలో అక్రమ 'లింగ నిర్ధారణ' రాకెట్ భగ్నం.!
- Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
సరిగ్గా ఇక్కడే ఓ టీడీపీ కార్యకర్తకు అనుమానం వచ్చింది. అది AI కాల్గా గుర్తించాడు. దానిపై అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో అక్కడ ఉన్న వ్యక్తి మెల్లగా జారుకున్నాడు. చివరకు మోసపోయామని గ్రహించిన బాధితులు.. హోటల్ బిల్లు చెల్లించి ఖమ్మం తిరుగు పయనమయ్యారు. నిజానికి చంద్రబాబు.. ఫోన్లో మాట్లాడడం.. కొంత మందితో వీడియో కాల్స్ మాట్లాడడం పరిపాటే. అలాగే తమతోనూ చంద్రబాబు ఫోన్ కాల్ మాట్లాడతారని అంతా భావించారు. కానీ చివరికి సైబర్ నేరగాళ్ల పని అని తెలిసి షాక్ అయ్యారు.
మరోవైపు సైబర్ నేరగాళ్లు తమ వద్ద NTR ట్రస్ట్ కోసం కూడా డబ్బులు వసూలు చేసేందుకు స్కెచ్ వేశారని టీడీపీ కార్యకర్తలు తెలిపారు. చివరకు లక్షల్లో కాకుండా.. కేవలం 35 వేల రూపాయలతోనే తప్పించుకున్నామని కాస్తంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐతే సైబర్ నేరగాళ్లను పట్టుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు..
తాజావార్తలు
-
Women’s T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
-
Donald Trump: ఓ వైపు డీల్, మరోవైపు ఇజ్రాయిల్ దాడులు.. ట్రంప్ తీవ్ర అసంతృప్తి..
-
CM Chandrababu : కృష్ణానది పడవ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం.. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటన
-
Nag Ashwin: ‘మాయాబజార్’ సెట్స్ చూసిన మహానుభావుడితో సినిమా.. ఎమోషనల్ అయిన స్టార్ ప్రొడ్యూసర్!
-
TMC Crisis: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!