NTV Telugu Site icon

Karnataka: భార్య ఎదుటే మహిళపై అత్యాచారం.. మతం మార్చుకోవాలని బ్లాక్‌మెయిల్..

Crime

Crime

Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. ఒక మహిళ మతాన్ని మార్చేందుకు ఓ జంట ఘోరంగా వ్యవహరించింది. అంతే కాకుండా మహిళపై తన భార్య ముందే సదరు వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో మొత్తం ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. తన అసభ్యకరమైన ఫోటోలను ఉపయోగించి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, బలవంతంగా మతమార్పిడి చేశారని బాధిత మహిళ ఆరోపించింది. అతని భార్య ముందే తనపై అత్యాచారం చేశాడని, బుర్ఖా ధరించి నుదుటిపై కుంకుమ ధరించకుండా చేశాడని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.

Read Also: Wife Kills Husband: ప్రియుడి సాయంతో భర్తను చంపిన భార్య.. రోడ్డు ప్రమాదమని నాటకం..

రఫిక్ అనే నిందితుడు 28 ఏళ్ల మహిళను లోబరుచుకుని, ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారాలని, తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను చూపించి బ్లాక్‌మెయిల్ చేశాడు. రఫిక్, అతని భార్య సదరు బాధిత మహిళను బెలగావిలోని తమ ఇంట్లోకి మార్చారు, వారు చెప్పిదానికి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారని పోలీసులు వెల్లడించారు. రఫిక్ తన భార్య ఎదుటే తమపై అత్యాచారం చేశాడని మహిళ ఆరోపించినట్లు బెళగావి ఎస్పీ భీమశంకర్ గులేడ తెలిపారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో నిందితులు తనను బొట్టు పెట్టుకోవద్దని, బుర్ఖా ధరించి రోజుకు 5 సార్లు నమాజ్ చేయాలని బలవంతం చేసినట్లు, తనపై కులం ఆధారంగా దూషణలు చేశారని, తక్కువ కులానికి చెందినందున వేరే మతంలోకి మారాలని నిందితులు బలవంతం చేశారని మహిళ ఆరోపించింది. తన భర్తకు విడాకులు ఇవ్వాలని రఫిక్ కోరాడని, తన డిమాండ్లు అంగీకరించకుంటే తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటపెడతానని బెదిరించినట్లు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. మతం మార్చుకోకుంటే చంపేస్తామని నిందితులైన జంట బెదిరించినట్లు తెలిపింది. మహిళ ఫిర్యాదు ఆధారంగా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.