Mother Slits Throats Of Twins: ఎంత పనిచేశావ్ తల్లి.. నవజాత కవలపిల్లల గొంతు కోసి హత్య..

  • జమ్మూ కాశ్మీర్‌లో ఘోరం..
  • కవల పిల్లల గొంతుకోసి చంపిన తల్లి..
  • భర్త అనుమానించాడని దారుణ నిర్ణయం..
Crime

Crime

Mother Slits Throats Of Twins: తాను తల్లినని మరిచి ఓ మహిళ రాక్షసిలా ప్రవర్తించింది. నవజాత శిశువుల గొంతు కోసి చంపింది. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలో జరిగింది. మహిళ భర్త కవల పిల్లలకు తాను తండ్రిని కాదని చెప్పడంతో ఆమె ఈ ఘోర నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియాలో పనిచేస్తున్న మహిళ భర్త మూడు నెలల క్రితం సొంతూరికి తిరిగి వచ్చాడు. కొంత కాలం తర్వాత అతని భార్య కవలలకు జన్మనిచ్చింది. ఈ విషయంపై అతను పోలీస్ స్టేషన్‌ని ఆశ్రయించాడు. పిల్లలు ‘‘అక్రమ సంబంధం’’ జన్మించారని ఆరోపించాడు.

Read Also: Viral Video: లవ్ ఎఫైర్.. యువకుడికి సగం గుండు, చెప్పుల దండతో ఊరేగింపు..

ఈ నిందకు భయపడిన మహిళ తన నవజాత శిశువుల్ని సమీపంలోకి పొలం లోకి తీసుకెళ్లి చంపినట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు ముందుగా ఈ హత్యలను మహిళ భర్తే చేశాడని అనుమానించారు. అయితే, పోలీస్ విచారణలో భార్యను ప్రశ్నించగా నేరం ఒప్పుకుంది. ఆమెపై హత్యా నేరం మోపినట్లు పోలీసులు వెల్లడించారు. ‘‘ తల్లే తన ఇద్దరు కవల కూతుళ్లను చంపినట్లు నేరాన్ని అంగీకరించింది’’ అని పూంచ్ ఎస్పీ యోగుల్ మన్హాస్ తెలిపారు. జిల్లాలోని మెంధార్ సబ్ డివిజన్‌లోని చైజ్‌లా కయాని గ్రామంలోని ఓ ఇంటిలో ఇద్దరు ఆడ శిశువుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ముందుగా తండ్రిని విచారించినప్పటికీ, అసలు నేరస్తురాలు తల్లే అని తెలిసింది.

ఈ ఘటన స్థానికంగా ప్రజల్ని భయాందోళనకు గురిచేసింది. తల్లిని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఢిల్లీకి చెందిన వ్యక్తి తన నవజాత కుమార్తెలను చంపిన ఘటన సుల్తాన్‌పురిలో జరిగింది. వారిని చంపేసి ఇంటి సమీపంలో పాతిపెట్టిన ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాతే రోజే పూంచ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కొడుకు పుట్టడం కోసం ఎదురుచూస్తున్న తండ్రి, ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.