Crime : మియాపూర్లో దారుణ హత్య.. తోటి వ్యాపారస్తులే..
- 'నన్ను చూసి ఏడవకురా.. అప్పు చేసి కొన్నా' అని రాసి పెట్టుకుంటారు
- పోటీ వ్యాపారులు నిఘా పెట్టవద్దని అనేది వారి అభిమతం
- వ్యాపారంలో పోటీ ఉంటేనే మంచిది అది ఆరోగ్యకరమైన పోటీగా ఉండాలి
- తోటి వ్యాపారులను శత్రువులుగానే భావిస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యాపారంలో పోటీ ఉండాలి. అది ఆరోగ్యకరమైనదిగా ఉండాలి. కానీ కొంత మంది తమ పోటీ వ్యాపారస్తులను శత్రువులుగా చూస్తున్నారు. అది ఒక స్థాయి వరకు ఉంటే ఫర్వాలేదు.. కానీ వారిని చంపేంత వరకు కక్ష పెట్టుకుంటున్నారు. సరిగ్గా ఇదే రీతిలో హైదరాబాద్ లోని మియాపూర్ లో ఓ మర్డర్ జరిగింది. ఆటోలతో ట్రాన్స్ పోర్టు వ్యాపారం చేసేవారు.. కొంత మంది తమ వాహనాల వెనుక ‘ నన్ను చూసి ఏడవకురా.. అప్పు చేసి కొన్నా’ అని రాసి పెట్టుకుని ఉంటారు.. ఇది మనం గమనించే ఉంటాం. అంటే మిగతా పోటీ వ్యాపారులు తమపై నిఘా పెట్టవద్దని అనేది వారి అభిమతంగా ఉంటుంది. నిజానికి వ్యాపారంలో పోటీ ఉంటేనే మంచిది. అది ఆరోగ్యకరమైన పోటీ అయితే.. ఎవరికీ ఇబ్బంది ఉండదు. కానీ కొంత మంది వ్యాపారులు.. తమ తోటి వ్యాపారులను శత్రువులుగానే భావిస్తున్నారు. పైగా వారితో ఆగర్భ శత్రుత్వంతో రగిలిపోతున్నారు..
కొన్నిసార్లు పోటీ వ్యాపారులను చంపేందుకు కూడా వెనుకాడడం లేదు. సరిగ్గా అలాంటి ఘటనే హైదరాబాద్ మియాపూర్ లో జరిగింది. ఇక్కడ చూడండి.. ఈ వ్యక్తి పేరు శ్రీనివాస్. వనపర్తి జిల్లా జంగమయ్యపల్లి ఆయన స్వస్థలం. హఫీజ్ పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఇంటి నిర్మాణాలకు ఉపయోగించే కట్టెల వ్యాపారం చేస్తున్నాడు. చాలా ఏళ్ల నుంచి సొంతంగా కష్టపడుతూ.. వ్యాపారాన్ని దినదినాభివృద్ధి చేసుకున్నాడు. కానీ అతని వ్యాపారంపై కొంత మంది పోటీవ్యాపారుల కన్ను పడింది..
Also Read
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
- Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- Meerpet Murder : గోనె సంచిలో ఆయా శవం.. మీర్పేట్లో దారుణ హత్య
శ్రీనివాస్ వ్యాపారం చేస్తున్న దుకాణం సమీపంలోనే సొహేల్తోపాటు మరో ముగ్గురు కూడా ఇదే కట్టెల వ్యాపారం చేస్తున్నారు. వారు శ్రీనివాస్పై కక్ష పెంచుకున్నారు. వ్యాపారంలో తమ కంటే ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నాడు అనే దుగ్ధ ఉంది. రోజూ సూటి పోటి మాటలు అనడం కూడా జరుగుతుండేది. ఇలాంటి చిన్న చిన్న వివాదాలు కాస్తా పెద్దవి అయ్యాయి. ఇదే క్రమంలో ఆదివారం కూడా గొడవ జరిగింది. మధ్యాహ్నం శ్రీనివాస్ తన షాపులో ఉండగా.. సోహేల్ తోపాటు మరో ముగ్గురు గొడవకు దిగారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నావని గొడవ పడ్డారు. అతనిపై కత్తులతో దాడి చేశారు. ఈ క్రమంలో శ్రీనివాస్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో నలుగురు దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.
అటు శ్రీనివాస్ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సోహేల్తోపాటు మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!