Crime : మియాపూర్లో దారుణ హత్య.. తోటి వ్యాపారస్తులే..
- 'నన్ను చూసి ఏడవకురా.. అప్పు చేసి కొన్నా' అని రాసి పెట్టుకుంటారు
- పోటీ వ్యాపారులు నిఘా పెట్టవద్దని అనేది వారి అభిమతం
- వ్యాపారంలో పోటీ ఉంటేనే మంచిది అది ఆరోగ్యకరమైన పోటీగా ఉండాలి
- తోటి వ్యాపారులను శత్రువులుగానే భావిస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యాపారంలో పోటీ ఉండాలి. అది ఆరోగ్యకరమైనదిగా ఉండాలి. కానీ కొంత మంది తమ పోటీ వ్యాపారస్తులను శత్రువులుగా చూస్తున్నారు. అది ఒక స్థాయి వరకు ఉంటే ఫర్వాలేదు.. కానీ వారిని చంపేంత వరకు కక్ష పెట్టుకుంటున్నారు. సరిగ్గా ఇదే రీతిలో హైదరాబాద్ లోని మియాపూర్ లో ఓ మర్డర్ జరిగింది. ఆటోలతో ట్రాన్స్ పోర్టు వ్యాపారం చేసేవారు.. కొంత మంది తమ వాహనాల వెనుక ‘ నన్ను చూసి ఏడవకురా.. అప్పు చేసి కొన్నా’ అని రాసి పెట్టుకుని ఉంటారు.. ఇది మనం గమనించే ఉంటాం. అంటే మిగతా పోటీ వ్యాపారులు తమపై నిఘా పెట్టవద్దని అనేది వారి అభిమతంగా ఉంటుంది. నిజానికి వ్యాపారంలో పోటీ ఉంటేనే మంచిది. అది ఆరోగ్యకరమైన పోటీ అయితే.. ఎవరికీ ఇబ్బంది ఉండదు. కానీ కొంత మంది వ్యాపారులు.. తమ తోటి వ్యాపారులను శత్రువులుగానే భావిస్తున్నారు. పైగా వారితో ఆగర్భ శత్రుత్వంతో రగిలిపోతున్నారు..
కొన్నిసార్లు పోటీ వ్యాపారులను చంపేందుకు కూడా వెనుకాడడం లేదు. సరిగ్గా అలాంటి ఘటనే హైదరాబాద్ మియాపూర్ లో జరిగింది. ఇక్కడ చూడండి.. ఈ వ్యక్తి పేరు శ్రీనివాస్. వనపర్తి జిల్లా జంగమయ్యపల్లి ఆయన స్వస్థలం. హఫీజ్ పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఇంటి నిర్మాణాలకు ఉపయోగించే కట్టెల వ్యాపారం చేస్తున్నాడు. చాలా ఏళ్ల నుంచి సొంతంగా కష్టపడుతూ.. వ్యాపారాన్ని దినదినాభివృద్ధి చేసుకున్నాడు. కానీ అతని వ్యాపారంపై కొంత మంది పోటీవ్యాపారుల కన్ను పడింది..
Also Read
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
- Hospital Fire: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
శ్రీనివాస్ వ్యాపారం చేస్తున్న దుకాణం సమీపంలోనే సొహేల్తోపాటు మరో ముగ్గురు కూడా ఇదే కట్టెల వ్యాపారం చేస్తున్నారు. వారు శ్రీనివాస్పై కక్ష పెంచుకున్నారు. వ్యాపారంలో తమ కంటే ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నాడు అనే దుగ్ధ ఉంది. రోజూ సూటి పోటి మాటలు అనడం కూడా జరుగుతుండేది. ఇలాంటి చిన్న చిన్న వివాదాలు కాస్తా పెద్దవి అయ్యాయి. ఇదే క్రమంలో ఆదివారం కూడా గొడవ జరిగింది. మధ్యాహ్నం శ్రీనివాస్ తన షాపులో ఉండగా.. సోహేల్ తోపాటు మరో ముగ్గురు గొడవకు దిగారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నావని గొడవ పడ్డారు. అతనిపై కత్తులతో దాడి చేశారు. ఈ క్రమంలో శ్రీనివాస్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో నలుగురు దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.
అటు శ్రీనివాస్ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సోహేల్తోపాటు మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే, పండగే ఇవాళ!
-
Eng vs NZ: లార్డ్స్ టెస్టులో బౌలర్ల హవా.. తొలి రోజే 16 వికెట్లు డౌన్.. అసలేమవుతోంది.?
-
Vladimir Putin: “మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు”.. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
-
Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
-
Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!