Brother Murders Sister: దారుణం.. లవర్ తో కనిపించడంతో.. సొంత చెల్లెలినే..
- చెల్లెలిని కాలువలో ముంచి చంపిన అన్న
- అనంతరం స్టేషన్ లో లొంగిపోయిన నిందితుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర ప్రదేశ్ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తన సొంత చెల్లెలిని కాలువలో ముంచి చంపాడు అన్న. తన చెల్లెలి ప్రేమ వ్యవహారంతోనే ఈ హత్యజరిగినట్లు సమాచారం. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.
Read Also:Shocking Video: మరీ ఇలా తయారయ్యారేంటమ్మా.. అత్తపై కోడలు దాడి
Also Read
- Pune Woman and Lover Arrested: కేతన్ అగర్వాల్ హత్య కేసు.. నిందితులు సియా, చేతన్లకు 7 రోజుల పోలీసు కస్టడీ!
- Pune Trekker Case: హత్యకు 4 రోజుల ముందే ‘స్నేక్’ డ్రామా.. పూణెలో సోనమ్ వారసురాలు ఏం మర్డర్ ప్లాన్
- Pune Trekker Case: పెళ్లికి రూ.17 కోట్ల ప్యాలెస్.. 2 విమానాలు.. సంచలనంగా మారిన పూణె ట్రెక్కర్ హత్య
- ATM Cash Van : ఏటీఎంలో డబ్బులు పెట్టాల్సినోడు.. తన జేబులో వేసుకుని జంప్.!
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లా కాంపియర్గంజ్లోని భౌరబారి గ్రామంలో ఆదిత్య యాదవ్ అనే యువకుడు తన సొంత చెల్లె అయిన నిత్య యాదవ్ ను నీటిలో ముంచి హత్య చేశాడో అన్న. తన చెల్లెలు ఒక అబ్బాయితో ప్రేమ వ్యవహారం నడపడమే ప్రధాన కారణమని పోలీసులు తెలిపారు. గతంలో సోదరికి ఎన్నో సార్లు చెప్పి చూసిన వినక పోవడంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు ఆదిత్య.
Read Also:Tragedy: మొదటి భర్త యాసిడ్ పోశాడు.. రెండో భర్త రోడ్డుపై వదిలేశాడు..
నిందితుడు ఆదిత్య యాదవ్ సోమవారం తన 19 ఏళ్ల సోదరి నిత్య యాదవ్ను హత్య చేశాడు. నిత్య ఇంటర్మీడియట్ విద్యార్థిని. గత మూడు సంవత్సరాలుగా ఒక వ్యక్తితో ప్రేమలో ఉంది. ఈ విషయం కాస్త ఆదిత్య యాదవ్ కు తెలియడంతో.. నిత్య యాదవ్ నచ్చచెప్పేందుకు ప్రయత్నించాడు. కానీ ఆమె తన మాట వినలేదు. ఆదివారం నిత్య యాదవ్ ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. రాత్రి అయినప్పటికి తను ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కలా అంతా వెతికారు. సోమవారం ఉదయం ఆమె ఓ యువకుడితో రెస్టారెంట్ లో కనిపించింది.
మొదట ఆదిత్య తన చెల్లెలిని ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆమె మాత్రం యువకుడిని వదిలి రానని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఆమెను మాట్లాడదామని ఓ ఏకాంత ప్రదేశానికి తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆమెను కొట్టి.. అనంతరం కాలువలో ముంచి చంపేశాడు. హత్యానంతరం.. ఆదిత్య మృతదేహం ముందు దాదాపు గంటన్నరకు పైగా కూర్చున్నాడు. తర్వాత పీఎస్ కు వెళ్లి.. తాను తన చెల్లెలిని హత్య చేశానని చెప్పి లొంగిపోయాడు.
Read Also:Delhi: విదేశీ కోచ్లపై వీధికుక్కల దాడి.. ఇది దేశ ప్రతిష్టకు మచ్చ-బీజేపీ లీడర్
నిందితుడు నేరం అంగీకరించాడని స్టేషన్ హౌస్ ఆఫీసర్ రోషన్ సింగ్ తెలిపారు. తన తండ్రి మరణం తర్వాత, తన సోదరీమణులు. తమ్ముడిని చూసుకుంటూ, కూలీగా పనిచేస్తున్నానని ఆదిత్య తెలిపాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం పరీక్ష కోసం బిఆర్డి మెడికల్ కాలేజీకి పంపారు .. అనంతరం కేసు నమోదు చేసుకున్నపోలీసులు విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
160cc Bikes: మంచి మైలేజ్ కోసం చూస్తున్నారా?.. 160cc సెగ్మెంట్లో బెస్ట్ బైక్లు ఇవే..!
-
Vaibhav sooryavanshi: వైభవ్ జపం.! భారత్లోనే కాదు.. పాకిస్థాన్లోనూ బుడ్డోడి క్రేజ్ మాములుగా లేదుగా..
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!
-
Pant LSG Journey: ఎఫ్ వర్డ్, విమర్శలు, అసంతృప్తి, లీడర్షిప్ రీసెట్.. ఎల్ఎస్జీలో పంత్ ప్రయాణం సాగిందిలా!
-
Rajinikanth173 : సూపర్ స్టార్ 173 టైటిల్ ‘ధర్మన్’ ది డెడ్లీ డాక్టర్.. దర్శకుడు ఎవరంటే?
ట్రెండింగ్
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
-
Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!
-
AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!