Crime: దక్షిణ గోవాలో సుమారు 25-30 మందికి మైనర్ బాలికపై లైంగిక దోపిడికి పాల్పడిన కేసులో బీజేపీ కార్పొరేటర్ కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 22 ఏళ్ల సోహమ్ నాయక్ను గోవా పోలీసులు అదుపులోకి తీసకున్నారు. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. నిందితుడు సోహమ్ తండ్రి సుశాంత్ నాయక్ బీజేపీ కార్పొరేటర్. ప్రాథమిక విచారణలో దాదాపుగా 3 ఏళ్ల నుంచి బాధితుల్ని వేధిస్తూ, బెదిరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
Read Also: Karnataka: క్లాస్లోనే విద్యార్థినికి ప్రొఫెసర్ ‘‘ఐ లవ్ యూ’’.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
బాలికలు తనపై ఫిర్యాదు చేయకుండా నిందితుడు వారి అశ్లీల చిత్రాలను, వీడియోలను బయటపెడతానంటూ బ్లాక్మెయిల్ చేసినట్లు తెలిసింది. దీంతో బాలికలు అఘాయిత్యాలపై ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు. ఇటీవల, నిందితుడు తన స్నేహితులతో మద్యం సేవిస్తూ, ఈ వీడియోలను చూపించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సమాచారం తెలిసిన తర్వాత, నిందితుడిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ ముందు జంన ఆందోళన చేశారు.
నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. బాధిత బాలికను గుర్తించి, వారి వాంగ్మూలాలు తీసుకోవడం, ఘటనకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, బాధిత బాలికల భద్రత, గోప్యత కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు హామీ ఇచ్చారు.