Blackmail: సోషల్ మీడియాలో స్నేహం.. బ్లాక్ మెయిల్ చేస్తూ ఏడాదిన్నరగా యువతిపై అత్యాచారం
- సోషల్ మీడియాలో స్నేహం
- బ్లాక్ మెయిల్ చేస్తూ ఏడాదిన్నరగా యువతిపై అత్యాచారం
- మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లాలో ఘటన
- అత్యాచారం దాడి సహా పలు సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లాలో 20 ఏళ్ల యువతిపై ఏడాదిన్నరగా అత్యాచారం చేసిన ఉదంతం వెలుగు చూసింది. అంతేకాకుండా.. అత్యాచారం వీడియో తీసినట్లు బాధితురాలు చెబుతోంది. నిందితుడు తనకు సోషల్ మీడియాలో పరిచయమయ్యాడని తెలిపింది. ఈ క్రమంలో తనను బెదిరించి అనేకసార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపిస్తుంది. అతని వేధింపుల వల్ల ఏడాదిన్నరలో మూడు ఇళ్లను మార్చింది. అయితే నిందితుడిపై ఆగడాలు తట్టుకోలేక హిందూ జాగరణ్ మంచ్ కార్యకర్తలతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లి కేసు పెట్టింది. అత్యాచారం, దాడి సహా పలు సెక్షన్ల కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
యువతి తెలిపిన వివరాల ప్రకారం.. తాను బామోరి నుండి వచ్చి ఇక్కడ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపింది. తన నాన్న మానసిక అనారోగ్యంతో ఉన్నారని.. అతను మంచం మీద నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్నాడని పేర్కొంది. తమ్ముడు చదువుకుంటున్నాడు.. ఇంటి ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని వాపోయింది. ఈ క్రమంలో.. రెండున్నరేళ్ల క్రితం గుణ వచ్చినట్లు పోలీసులకు చెప్పింది. తాను చేసే ఉద్యోగం డబ్బులతో ఇంటికి పంపించేదాన్ని అని తెలిపింది. అయితే.. 2022 సంవత్సరంలో తాను ఇన్స్టాగ్రామ్లో ఒక యువకుడితో స్నేహం చేశానని.. తన పేరు భయ్యూ అని చెప్పింది.
Also Read
- Mysuru Horror: ఘోర విషాదం.. భార్య, ఇద్దరు కుమార్తెలను హత్య చేసి భర్త ఆత్మహత్య
- Kelly Hottle: సినీ పరిశ్రమలో విషాదం.. గాడ్జిల్లా vs కాంగ్ ఫేమ్ నటి 18 ఏళ్లకే మృతి..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్య కేసులో ట్విస్ట్.. మొదటి ప్లాన్ హత్య కాదట.!
- Tripura DGP Anurag Dhankar: పోలీసు శాఖలో తీవ్ర విషాదం.. డీజీపీ అనురాగ్ ధన్ఖడ్ ఆత్మహత్య!
Read Also: Anushka Shetty: అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి.. సూడోబుల్బార్ ఎఫెక్ట్ ఏంటో తెలుసా?
క్రమంగా యువతి అతనితో మాట్లాడటం ప్రారంభించింది. అంతేకాకుండా.. తరచుగా కలుసుకునేవాళ్లమని యువతి చెప్పింది. ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు చాలా ఉన్నాయని.. అయితే ఒకరోజు తాను ఓ గదిలో అద్దెకు ఉంటున్నానని తెలిసి.. అక్కడికి వచ్చాడని తెలిపింది. ఈ క్రమంలో.. తనపై బలవంతంగా అత్యాచారం చేశాడని, అంతేకాకుండా.. వీడియో కూడా తీశాడని చెప్పింది. ఇక అప్పటి నుంచి తనపై చిత్రహింసలు మొదలయ్యాయని.. తన ఫోటో-వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు పేర్కొంది.
అంతేకాకుండా.. నిందితుడు తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చేవాడని చెప్పింది. అందుకోసం.. మత మార్పిడి ఒత్తిడి చేయడం కూడా ప్రారంభించాడని తెలిపింది. నిందితుడు ఫోన్ చేసి చిత్రహింసలు పెట్టేవాడని, ఈ క్రమంలో రెండుసార్లు రూమ్ మారినట్లు యువతి చెప్పింది. గత ఏడాదిన్నరగా నిందితుడు అర్షద్ తనను చాలా చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తోంది. ఈ క్రమంలో.. యువతి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు కొత్వాలి పోలీస్స్టేషన్ ఇన్ఛార్జ్ అనూప్ భార్గవ తెలిపారు.
తాజావార్తలు
-
NEET Abolition: నీట్పై ‘దళపతి’ సంచలన డిమాండ్.. అసలు నీట్ పరీక్షను రాష్ట్రాలు రద్దు చేయగలవా?
-
Bhatti Vikramarka: రాహుల్ గాంధీ అరెస్టు.. రాజ్యాంగాన్ని అవమానించడమే..!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
VW 24 inch QLED TV: VW 24 ఇంచెస్ HD Ready QLED TV.. రూ.5 వేలలోనే బెస్ట్ బడ్జెట్ టీవీ!
-
Pawan Kalyan: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం.. జల్ జీవన్ మిషన్పై పవన్ కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!