Father Kills Daughter: 50 వరకు అంకెలు రాయని నాలుగేళ్ల కూతురు.. కొట్టి చంపేసిన జైస్వాల్
- ఫరీదాబాద్లో జరిగిన ఓ హృదయ విదారక ఘటన..
- నాలుగేళ్ల కూతుర్ని 1 నుంచి 50 వరకు అంకెలు రాయమని చెప్పిన తండ్రి..
- చిన్నారి ఆ పనిని పూర్తి చేయలేకపోవడంతో కోపం కూతుర్ని చంపేసిన జైస్వాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Father Kills Daughter: హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్లో జరిగిన ఓ హృదయ విదారక ఘటన అందరినీ తీవ్రంగా కలచివేస్తుంది. హోమ్ స్కూలింగ్ సెషన్ చివరికి నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు తీసిన విషాదంగా మారింది. 50 వరకు అంకెలు రాయలేకపోయిందన్న కారణంతో తండ్రే తన కూతురిని కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర జిల్లా, ఖేరతియా గ్రామానికి చెందిన కృష్ణ జైస్వాల్.. ప్రస్తుతం కుటుంబంతో కలిసి ఫరీదాబాద్లో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. అయితే, జైస్వాల్, అతని భార్య ఇద్దరూ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. తల్లి పగటిపూట పనికి వెళ్లగా, తండ్రి ఇంట్లోనే ఉండి పిల్లలను చూసుకోవడం, ముఖ్యంగా కుమార్తె చదువును పర్యవేక్షించేవాడు.
Also Read
- Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
- Moizuddin Murder : రూ.25 లక్షల సుపారీ.. హిట్ అండ్ రన్గా న్యాయవాది హత్య స్కెచ్.!
- TV Serial Scam: హీరోయిన్ ఛాన్స్ పేరుతో సైబర్ మోసం.. విశాఖలో రూ.60 లక్షల దోపిడీ!
- Hyderabad: న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య వెనుక మిస్టరీ ఇంతుందా?
ఇక, జనవరి 21వ తేదీన జైస్వాల్ తన నాలుగేళ్ల కుమార్తెను 1 నుంచి 50 వరకు అంకెలు రాయమని చెప్పాడు. చిన్నారి ఆ పనిని పూర్తి చేయలేకపోవడంతో అతడు కోపంతో ఆమెపై దాడి చేయగా తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి చివరకు ప్రాణాలు కోల్పోయింది. అయితే, సాయంత్రం తల్లి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, కుమార్తె అచేతనంగా పడి ఉండటాన్ని గమనించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. చిన్నారి మృతికి కారణమైన ఆమె తండ్రిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.
Read Also: Gold Rates: మగువలకు షాక్.. ఈరోజు గోల్డ్ ఎంత పెరిగిందంటే..!
ఈ సందర్భంగా ఫరీదాబాద్ పోలీస్ ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ ఘటనపై కేసు నమోదు చేశాం.. నిందితుడిని రిమాండ్కు తీసుకుని విచారణ చేపట్టాం.. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని పేర్కొన్నారు. చిన్నారిపై చదువు ఒత్తిడితో జరిగిన ఈ ఘటన సమాజాన్ని షాక్కు గురి చేస్తోంది.. పిల్లలపై తల్లిదండ్రులు చూపాల్సింది ప్రేమ, సహనం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది అన్నారు.
తాజావార్తలు
-
IMD Warning: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో వర్షాలు
-
CM Yogi Adityanath: దేశానికి “ధర్మ హింస” అవసరమే.. యోగి సంచలన వ్యాఖ్యలు
-
NFHS: దేశంలో పెరుగుతున్న సీ-సెక్షన్ కేసులు.. ఈ రాష్ట్రంలో 90% ప్రసవాలు సిజేరియన్ ద్వారానే.. NFHS సంచలన రిపోర్ట్
-
DK Shivakumar: జూన్ 3న కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం.. ఆ రోజే ఎందుకంటే?
-
Rajasthan: రాజస్థాన్లో ఇసుక తుఫాన్ బీభత్సం.. బెంబేలెత్తిపోయిన ప్రజలు
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..