Father Kills Daughter: 50 వరకు అంకెలు రాయని నాలుగేళ్ల కూతురు.. కొట్టి చంపేసిన జైస్వాల్
- ఫరీదాబాద్లో జరిగిన ఓ హృదయ విదారక ఘటన..
- నాలుగేళ్ల కూతుర్ని 1 నుంచి 50 వరకు అంకెలు రాయమని చెప్పిన తండ్రి..
- చిన్నారి ఆ పనిని పూర్తి చేయలేకపోవడంతో కోపం కూతుర్ని చంపేసిన జైస్వాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Father Kills Daughter: హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్లో జరిగిన ఓ హృదయ విదారక ఘటన అందరినీ తీవ్రంగా కలచివేస్తుంది. హోమ్ స్కూలింగ్ సెషన్ చివరికి నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు తీసిన విషాదంగా మారింది. 50 వరకు అంకెలు రాయలేకపోయిందన్న కారణంతో తండ్రే తన కూతురిని కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర జిల్లా, ఖేరతియా గ్రామానికి చెందిన కృష్ణ జైస్వాల్.. ప్రస్తుతం కుటుంబంతో కలిసి ఫరీదాబాద్లో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. అయితే, జైస్వాల్, అతని భార్య ఇద్దరూ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. తల్లి పగటిపూట పనికి వెళ్లగా, తండ్రి ఇంట్లోనే ఉండి పిల్లలను చూసుకోవడం, ముఖ్యంగా కుమార్తె చదువును పర్యవేక్షించేవాడు.
Also Read
- Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
- Karnataka: కన్న కూతురుపై తండ్రి పగ.. కాలేజీకెళ్లి కత్తి దాడి.. దేనికోసమో తెలిస్తే..!
- Bihar Crime: బట్టలూడదీసి.. నగ్నంగా...! భర్తను లవర్తో కలిసి కడతేర్చిన భార్య ఎపిసోడ్లో ట్విస్ట్
- Bihar: భోజనం ఆలస్యమైందని.. వదిన తల నరికి, ఇంటి ముందు వేలాడదీసిన వ్యక్తి..
ఇక, జనవరి 21వ తేదీన జైస్వాల్ తన నాలుగేళ్ల కుమార్తెను 1 నుంచి 50 వరకు అంకెలు రాయమని చెప్పాడు. చిన్నారి ఆ పనిని పూర్తి చేయలేకపోవడంతో అతడు కోపంతో ఆమెపై దాడి చేయగా తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి చివరకు ప్రాణాలు కోల్పోయింది. అయితే, సాయంత్రం తల్లి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, కుమార్తె అచేతనంగా పడి ఉండటాన్ని గమనించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. చిన్నారి మృతికి కారణమైన ఆమె తండ్రిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.
Read Also: Gold Rates: మగువలకు షాక్.. ఈరోజు గోల్డ్ ఎంత పెరిగిందంటే..!
ఈ సందర్భంగా ఫరీదాబాద్ పోలీస్ ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ ఘటనపై కేసు నమోదు చేశాం.. నిందితుడిని రిమాండ్కు తీసుకుని విచారణ చేపట్టాం.. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని పేర్కొన్నారు. చిన్నారిపై చదువు ఒత్తిడితో జరిగిన ఈ ఘటన సమాజాన్ని షాక్కు గురి చేస్తోంది.. పిల్లలపై తల్లిదండ్రులు చూపాల్సింది ప్రేమ, సహనం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది అన్నారు.
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!