Father Kills Daughter: 50 వరకు అంకెలు రాయని నాలుగేళ్ల కూతురు.. కొట్టి చంపేసిన జైస్వాల్
- ఫరీదాబాద్లో జరిగిన ఓ హృదయ విదారక ఘటన..
- నాలుగేళ్ల కూతుర్ని 1 నుంచి 50 వరకు అంకెలు రాయమని చెప్పిన తండ్రి..
- చిన్నారి ఆ పనిని పూర్తి చేయలేకపోవడంతో కోపం కూతుర్ని చంపేసిన జైస్వాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Father Kills Daughter: హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్లో జరిగిన ఓ హృదయ విదారక ఘటన అందరినీ తీవ్రంగా కలచివేస్తుంది. హోమ్ స్కూలింగ్ సెషన్ చివరికి నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు తీసిన విషాదంగా మారింది. 50 వరకు అంకెలు రాయలేకపోయిందన్న కారణంతో తండ్రే తన కూతురిని కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర జిల్లా, ఖేరతియా గ్రామానికి చెందిన కృష్ణ జైస్వాల్.. ప్రస్తుతం కుటుంబంతో కలిసి ఫరీదాబాద్లో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. అయితే, జైస్వాల్, అతని భార్య ఇద్దరూ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. తల్లి పగటిపూట పనికి వెళ్లగా, తండ్రి ఇంట్లోనే ఉండి పిల్లలను చూసుకోవడం, ముఖ్యంగా కుమార్తె చదువును పర్యవేక్షించేవాడు.
Also Read
- Lucknow Crime: భార్యను చంపి.. వాట్సాప్ స్టేటస్లో షాకింగ్ మెసేజ్! ఆ తర్వాత గంటల్లోనే మరో దారుణం, చివరికి సూసైడ్..
- Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
- Kerala: తాత హత్యకు 13 ఏళ్ల బాలిక కుట్ర.. వీడియో కాల్లో హత్యను చూస్తూ!
- Kolkata Hotel Fire: హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. తొమ్మిది మంది మృతి
ఇక, జనవరి 21వ తేదీన జైస్వాల్ తన నాలుగేళ్ల కుమార్తెను 1 నుంచి 50 వరకు అంకెలు రాయమని చెప్పాడు. చిన్నారి ఆ పనిని పూర్తి చేయలేకపోవడంతో అతడు కోపంతో ఆమెపై దాడి చేయగా తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి చివరకు ప్రాణాలు కోల్పోయింది. అయితే, సాయంత్రం తల్లి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, కుమార్తె అచేతనంగా పడి ఉండటాన్ని గమనించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. చిన్నారి మృతికి కారణమైన ఆమె తండ్రిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.
Read Also: Gold Rates: మగువలకు షాక్.. ఈరోజు గోల్డ్ ఎంత పెరిగిందంటే..!
ఈ సందర్భంగా ఫరీదాబాద్ పోలీస్ ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ ఘటనపై కేసు నమోదు చేశాం.. నిందితుడిని రిమాండ్కు తీసుకుని విచారణ చేపట్టాం.. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని పేర్కొన్నారు. చిన్నారిపై చదువు ఒత్తిడితో జరిగిన ఈ ఘటన సమాజాన్ని షాక్కు గురి చేస్తోంది.. పిల్లలపై తల్లిదండ్రులు చూపాల్సింది ప్రేమ, సహనం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది అన్నారు.
తాజావార్తలు
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేటి నుంచి ఆగస్టు 28 వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
-
IRUMUDI : ఇరుముడి ఓవర్సీస్ రివ్యూ.. రవితేజ మాస్ కంబ్యాక్ ‘బ్లాక్ బస్టర్’
-
Friday Horoscope: శ్రావణ శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారు జాగ్రత్త సుమీ!
-
Joe Root: సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసిన జో రూట్.. టాప్ రన్ స్కోరర్గా మరో రికార్డు..
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?