Family Suicide: ఏం కష్టం వచ్చిందో.. కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నం.. ముగ్గురు మృతి, ఒకరికి సీరియస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Family Suicide: ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ.. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది.. పార్వతీపురం మన్యం జిల్లా, జియ్యమ్మవలస మండలం వనజ గ్రామంలో ఓ కుటుంబం సూసైడ్స్ కలకలం రేగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.. అయితే, ఈ ఘటనలో తల్లి, తండ్రి సహా ఒక బాలుడు మృతి చెందగా, మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనలో మధు, సత్యవతి, మెషీలు మృతి చెందగా.. ఆయుష్ పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కుటుంబ కలహాలే కారణమా? ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి.. ఇతర కారణాలు ఏమైనా ఉండొచ్చా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.. అయితే, కుటుంబ మొత్తం ఆత్మహత్యకు ప్రయత్నించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.. ముగ్గురు మృతి చెందగా.. ప్రాణాలతో మరో బాలుడు కొట్టుమిట్టాడుతున్నాడు..
Read Also: Shashi Tharoor: రాహుల్ గాంధీ మీటింగ్లో అవమానం.. కాంగ్రెస్ కీలక సమావేశానికి శశి థరూర్ డుమ్మా!
Also Read
- TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
- HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
- Tragedy : చిలకలగూడలో దారుణం.. బీటెక్ విద్యార్థిని వెంటాడి, కత్తులతో పొడిచి దారుణ హత్య.!
తాజావార్తలు
-
Virat Kohli Duck: మరోసారి విరాట్ కోహ్లీ డకౌట్.. కింగ్ను సున్నాకే పెవిలియన్కు పంపిన బౌలర్లు వీరే!
-
Lenin : అఖిల్ ‘లెనిన్’ మూవీలో స్పెషల్ రోల్ ?
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
-
Delhi Tour: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. అమిత్ షా, సీఆర్ పాటిల్తో కీలక భేటీలు!
-
Bhuvneshwar Kumar: స్వింగ్ కింగ్ ‘భూవీ’ ఈజ్ బ్యాక్.. టీమిండియాకు రీఎంట్రీ ఖాయమేనా..!