Gujarat: 90 ఏళ్ల వృద్ధుడు డిజిటల్ అరెస్ట్.. రూ.కోటి నగదు మాయం
- 90 ఏళ్ల వృద్ధుడు డిజిటల్ అరెస్ట్
- రూ.కోటి నగదు మాయం
- గుజరాత్లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో సైబర్ స్కామ్లు పెరిగిపోతున్నాయి. అమాయకులను లక్ష్యంగా చేసుకుని కేటుగాళ్లు నగదు దొంగిలిస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ చేసి కోట్లు కొల్లగొడుతున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే గుజరాత్లో చోటుచేసుకుంది.

Also Read
- Selling Racket: తల్లి ఒడిలో ఉండాల్సిన పసికందుకు ధర..
- Extramarital affairs: అలా వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు.. చివరికిలా..!
- Fake Experience Certificates & CVs: ఫేక్ CV, ఫేక్ సాలరీ స్లిప్లతో జాబ్ కొట్టేశారా?.. తర్వాత ఎదురయ్యే చట్టపరమైన చిక్కులు తెలుసా?
- Bengaluru Murder: మృతదేహాన్ని బెడ్షీట్లో చుట్టి.. ఇంట్లోనే వదిలేసి తాళం వేశాడు..బెంగళూరులో ప్రకంపనలు రేపుతోన్న వివాహిత మరణం!
గుజరాత్కు చెందిన 90 ఏళ్ల వృద్ధుడిని చైనాలో ఓ ముఠాతో కలిసి రాకెట్ నడిపిస్తున్న గ్యాంగ్ డిజిటల్ అరెస్ట్ చేసి రూ.కోటి నొక్కేశారు. సీబీఐ అధికారులుగా నటిస్తూ 15 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్లో ఉంచారు. పార్శిల్లో డ్రగ్స్ దొరికాయని బెదిరింపులకు దిగారు. మీ పేరు మీద ముంబై నుంచి చైనాకు కొరియర్ పంపినట్లు హడలెత్తించారు. అతని బ్యాంకు ఖాతా నుంచి ముఠా సభ్యులు రూ. 1,15,00,000 బదిలీ చేసుకున్నారు. సంఘటన గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు సూరత్ సైబర్ పోలీసులకు అక్టోబర 29న ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఐదుగురు సభ్యులను అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారి పార్థ్ గోపాని కోసం గాలిస్తున్నారు. పార్థ్ గోపానీ కంబోడియాలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వృద్ధుడు సంపాదించిన కోటి రూపాయులు కేటుగాళ్లు నొక్కేయడంతో లబోదిబో అంటున్నాడు.
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) భవేష్ రోజియా మాట్లాడుతూ.. స్టాక్ మార్కెట్లో వ్యాపారం చేసే సీనియర్ సిటిజన్కు స్కామ్స్టర్లలో ఒకరి నుంచి వాట్సాప్ కాల్ వచ్చిందని, అతను తనను తాను సీబీఐ అధికారిగా పరిచయం చేసుకున్నాడని తెలిపారు. ముంబయి నుంచి చైనాకు సీనియర్ సిటిజన్ పేరుతో కొరియర్లో పంపిన పార్శిల్లో 400 గ్రాముల ఎండీ డ్రగ్స్ లభించినట్లు బెదిరించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తామని బెదిరించారు. విచారణ పేరుతో 15 రోజులు ఏడిపించారు. మొత్తానికి రూ.కోటికిపైగా నగదు నొక్కేశారు. అరెస్టయిన వారి నుంచి వివిధ బ్యాంకులకు చెందిన 46 డెబిట్ కార్డులు, 23 బ్యాంక్ చెక్ బుక్లు, ఒక వాహనం, నాలుగు వేర్వేరు సంస్థల రబ్బర్ స్టాంపులు, 9 మొబైల్ ఫోన్లు, 28 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు రమేష్ సురానా, ఉమేష్ జింజాలా, నరేష్ సురానా, రాజేష్ దేవరా, గౌరంగ్ రఖోలియా ఉన్నారు.

తాజావార్తలు
-
Food Delivery: జొమాటో, స్విగ్గీలకు ఊహించని షాక్.. ఫుడ్ డెలివరీ రేసులోకి అడుగుపెట్టిన ‘షాపింగ్’ కింగ్..
-
AI Effect : AI దెబ్బకు ఉద్యోగాలే మాయం.. చైనాలో మొదలైన ఉపాధి సంక్షోభం.!
-
Elon Musk : నెలలోనే రూ.57 లక్షల కోట్ల ఆవిరి.. ఎలాన్ మస్క్కు భారీ దెబ్బ.!
-
Yuvraj Singh: యువరాజ్ ‘యువి’ పేరు వాడుతున్నారా..? ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు..
-
Yellamma First Look: సంగీత దర్శకుడు కాదు.. ఇప్పుడు హీరో డీఎస్పీ!.. అదిరిపోయిన ‘ఎల్లమ్మ’ ఫస్ట్ లుక్
ట్రెండింగ్
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?