Delhi Crime: దొంగతనానికి వెళ్లి.. శవమై తేలాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Man Beaten To Death On Suspicion Of Stealing Scrap: పాపం ఆ దొంగ.. ఏదో కొంత డబ్బు దొరుకుతుందన్న ఆశతో ఒక స్క్రాప్ షాప్లో దూరితే, శవమై తేలాడు. ఆ షాప్లో ఉండే ముగ్గురు వర్కర్లతో పాటు స్క్రాప్ డీలర్ కలిసి చితక్కొట్టడం వల్లే అతడు మృత్యువాత పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆ నలుగురిని అరెస్ట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని బుద్ధ విహార్ ప్రాంతంలో గురువారం స్థానికులకు ఒక మృతదేహం కనిపించింది. వాళ్లు పోలీసులకు సమాచారం అందించడంతో.. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. మృతుడిని దీపుగా గుర్తించారు. అతని వెనుక భాగంలో.. అలాగే చేతులు, కాళ్లపై గాయాలుండడాన్ని గమనించి, ఇది హత్యేనని పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. దీపు కుటుంబ సభ్యుల్ని కలిపి ప్రశ్నించారు. అతడు అడిక్ట్ అని, జనవరి 10వ తేదీ రాత్రి 9 గంటలకు తమకు చివరిసారిగా కనిపించాడని వాళ్లు చెప్పారు.
Priyanka Jawalkar: పవన్ కళ్యాణ్తో చచ్చినా చేయను.. ప్రియాంకా బాంబ్
Also Read
- Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- Meerpet Murder : గోనె సంచిలో ఆయా శవం.. మీర్పేట్లో దారుణ హత్య
- Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
చివరగా దీపు తన స్నేహితుడు నవీన్ని కలిసినట్టుగా గుర్తించిన పోలీసులు.. అతడ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అప్పుడు అతడు జరిగిన విషయాన్ని బయటపెట్టాడు. తామిద్దరం కలిసి జనవరి 10వ తేదీన శ్యామ్ కాలనీలోని స్క్రాప్ డీలర్ సుదీప్ గుప్తా షాప్లో దొంగతనం చేయడం కోసం వెళ్లామని పేర్కొన్నాడు. దీపు లోపలికి వెళ్లగా.. తాను బయటే పహారా కాస్తున్నానన్నాడు. అయితే.. ఉదయం ఆరు గంటలకు ఒక వర్కర్ బయట నుంచి డోర్ కొట్టగా.. తానే డోర్ కొట్టానని భావించి, దీపు డోర్ ఓపెన్ చేశాడని నవీన్ తెలిపాడు. డోర్ తీయగానే.. ఆ వర్కర్ గట్టిగా అరుపులు అరిచాడని, దీంతో షాప్లో నిద్రిస్తున్న మరో ముగ్గురు వర్కర్స్ (రాజీవ్, కౌశల్, విష్ణు) నిద్రలేచారని అన్నాడు. అప్పుడు ఆ ముగ్గురు దీపుని పట్టుకొని చితకబాదారు. వాళ్లు ఓనర్కి సమాచారం అందించగా.. అతడు కూడా వచ్చి విచక్షణారహితంగా కొట్టాడు. ఈ దెబ్బలకు దీపు అక్కడికక్కడే మృతిచెందాడని, దాంతో భయబ్రాంతులకు గురైన వాళ్లు దీపు మృతదేహాన్ని బుద్ధ విహార్లో పడేశారని పోలీసులు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.
Minister KTR : నేటి నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు.. సిద్ధమైన తెలంగాణ పెవిలియన్
తాజావార్తలు
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!