Delhi Firing: రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణ.. 52 ఏళ్ల వ్యక్తిపై కాల్పులు
- బుల్లెట్ గాయాలతో తీవ్రంగా గాయపడి చనిపోయిన 52 ఏళ్ల వ్యక్తి
- కారులో వచ్చి రత్తన్ పై కాల్పులు జరిపిన దుండగులు
- మృతుడి శరీరం నుంచి 69 బుల్లెట్లు తీసిన వైద్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర స్థాయికి చేరడంతో 52 ఏళ్ల వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపి హత్య చేసిన ఘటన దక్షిణ ఢిల్లీలో కలకలం రేపింది. అయా నగర్ ప్రాంతంలో నవంబర్ 30 తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో రత్తన్ లోహియా అనే వ్యక్తి బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాధితుడి శరీరం నుంచి మొత్తం 69 బుల్లెట్లు వెలికితీసినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల సమాచారం ప్రకారం, నవంబర్ 30 ఉదయం రత్తన్ లోహియా తన పనికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అదే సమయంలో ముందుగా అక్కడే వేచి ఉన్న దుండగులు కారులో వచ్చి అతన్ని చుట్టుముట్టి వరుసగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో రత్తన్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనేక ఖాళీ బుల్లెట్ షెల్స్తో పాటు మూడు లైవ్ కార్ట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- Pune Murder Twist: ప్రతీ సీనూ క్లైమాక్స్..కేతన్ అగర్వాల్ మరణంలో ట్విస్టుల మీద ట్విస్టులు!
- Tragedy: ఫోటోలకు పోజులిస్తూ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు..
- Aditya Ram Shankar: శారీరక సంబంధం.. పెళ్లి పేరుతో మోసం.! సింగర్ పై కేసు నమోదు..
- Ketan Agarwal Case: అమ్మో ‘సియా’.. సోనమ్ కంటే జిత్తులమారి.. నవ్వుతో చక్కబెట్టేసింది
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో ముగ్గురు దుండగులు అయా నగర్లో రత్తన్ కోసం కారులో వేచి ఉన్నట్లు వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కారుకు నంబర్ ప్లేట్లు ఉద్దేశపూర్వకంగా తొలగించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ హత్యకు భారతదేశం వెలుపల ఉన్న గ్యాంగ్స్టర్ల ద్వారా కాంట్రాక్ట్ ఇచ్చి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, రత్తన్ లోహియా కుటుంబ సభ్యులు ఈ హత్య వెనుక రాంబీర్ లోహియా మరియు అతని బంధువుల పాత్ర ఉందని ఆరోపిస్తున్నారు. రాంబీర్ కుమారుడు అరుణ్ హత్యకు ప్రతీకారంగానే ఈ ఘటన జరిగిందని వారు పేర్కొంటున్నారు. గత మే 15న అరుణ్ తన కారులో ఇంటికి వెళ్తుండగా, మోటార్ సైకిల్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపి హత్య చేశారు. ఆ కేసులో రత్తన్ లోహియా పెద్ద కుమారుడు దీపక్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు హత్యలు పరస్పర ప్రతీకార చర్యలుగా జరిగి ఉండవచ్చని పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!