Delhi Airport: ఎయిర్పోర్ట్లో మహిళపై అనుమానం… తనిఖీ చేసిన సిబ్బంది షాక్…
- లోదుస్తులో దాచిన ఆరు బంగారం బిస్కెట్లు
- దాదాపు ఒక కిలో గ్రామ్ బరువున్న బంగారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అనుమానస్పదంగా కనిపించిన ఓ మహిళను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. తనిఖీ చేసిన అధికారులు షాకయ్యారు. ఎందుకంటే ఆ మహిళ దాదాపు.. 997.5 గ్రాముల బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడాన్ని వారు గుర్తించారు. శుక్రవారం అర్థరాత్రి జరిపిన ఆపరేషన్లో లక్షల విలువైన బంగారాన్ని కనుగొన్నారు.
Read Also: Ind vs Aus 3rd ODI: ఆసీస్ను కంగారు పెట్టిన టీమిండియా బౌలర్లు.. ఆస్ట్రేలియా స్కోర్ ఎంతంటే..?
Also Read
- Drugs Party : మాదాపూర్లో అర్ధరాత్రి డ్రగ్స్ పార్టీపై దాడి.. బెజవాడ కనెక్షన్ బట్టబయలు
- Maharashtra: ఫుట్బాల్ కోచ్ దారుణం.. మూడేళ్లుగా మైనర్ బాలికపై అత్యాచారం..
- Hyderabad: వనస్థలిపురంలో అక్రమ 'లింగ నిర్ధారణ' రాకెట్ భగ్నం.!
- Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
కస్టమ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ యాంగోన్ నుండి విమానం నంబర్ 8M 620 ద్వారా ఢిల్లీలో దిగింది. అక్రమంగా బంగారం దాచిపెట్టి… ప్రయాణీకులకు రిజర్వ్ చేయబడిన గ్రీన్ ఛానల్ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే.. ఆమె అనుమానస్పదంగా ప్రవర్తించడంతో.. అధికారులు ఆమెను గుర్తించి పట్టుకున్నారు. ఆమె లోదుస్తులలో దాచిపెట్టిన ఆరు బంగారు బిస్కెట్లను అధికారులు కనుగొన్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం మొత్తం బరువు దాదాపు ఒక కిలోగ్రాము ఉన్నట్లు గుర్తించారు. . కస్టమ్స్ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకుని.. ఆమెపై పలు కేసులు నమోదు చేశారు. కస్టమ్స్ చట్టం ప్రకారం, బంగారం లేదా ఇతర విలువైన వస్తువులను ప్రకటించని విధంగా కలిగి ఉండటం లేదా సరిహద్దు దాటి రవాణా చేయడం తీవ్రమైన నేరమని అధికారులు తెలిపారు. ఆ మహిళ పెద్ద స్మగ్లింగ్ నెట్వర్క్లో భాగమైందా లేదా అని నిర్ధారించడానికి ఇప్పుడు దర్యాప్తు జరుగుతోంది.
Read Also:Elderly Man Beaten: అసలు వీడు.. మనిషా.. మృగమా… పెద్దమనిషని చూడకుండా…
ఢిల్లీ కస్టమ్స్ స్వాధీనం చేసుకున్న విషయాన్ని ధృవీకరిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది.. తిరిగి వచ్చే ప్రయాణికులు వచ్చిన తర్వాత విలువైన లోహాలు లేదా అధిక విలువైన వస్తువులను ప్రకటించాలని అధికారులు కోరారు. వాటిని పాటించడంలో విఫలమైతే చట్టపరమైన జరిమానాలు విధించబడతాయని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Drugs Party : మాదాపూర్లో అర్ధరాత్రి డ్రగ్స్ పార్టీపై దాడి.. బెజవాడ కనెక్షన్ బట్టబయలు
-
CM Revanth Reddy :ఇక ప్రభుత్వ స్కూల్ పిల్లలూ కార్పొరేట్ స్టైల్లో.. కొత్త కిట్లు రెడీ.!
-
MP Raghunandan Rao : సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్ రావు సవాల్
-
Venkata Satish Kilaru: 60% మేకింగ్.. 40% రెమ్యూనరేషన్.. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా బడ్జెట్ లెక్కలివే!
-
INDW Vs PAKW: రీచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్.. పాకిస్థాన్ ముందు భారత్ టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!