Crime News: ప్రియుడు కాదు.. ఆమె పాలిట యముడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: ప్రేమించి.. సహజీవనం చేస్తున్న యువతిని డబ్బు కోసం వ్యభిచార రొంపిలోకి దించాలని ప్రయత్నించాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో దారుణంగా పొడిచి హత్య చేశాడు. కోనసీమ జిల్లాలో జరిగిన యువతి హత్య కలకలం సృష్టించింది. ఇక్కడ ఈ ఫోటోలో ఉన్న యువతి పేరు ఓలేటి పుష్ప. ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లా రాజోలు మండలం మెరకపాలెం స్వస్థలం. ఈమెను ప్రియుడు షేక్ షమ్మ దారుణంగా హత్య చేశాడు.
నిజానికి పుష్పకు 4 ఏళ్ల క్రితం దగ్గరి బంధువుతో వివాహం జరిపించారు తల్లిదండ్రులు. కానీ వివాహం జరిగిన నాలుగు నెలలకే భర్తతో వ్యక్తిగత వివాదాలతో విడిపోయింది. ఈ క్రమంలో ఆమెకు షేక్ షమ్మ అనే కార్ ఏసీ మెకానిక్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. ఆ తర్వాత ఇద్దరూ వివాహేతర బంధం పెట్టుకున్నారు. కొంతకాలంగా బి. సావరం సిద్ధార్థ నగర్లో ఇల్లు అద్దెకి తీసుకొని ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. ఈ మధ్య ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. గంజాయి, చెడు వ్యసనాలకు బానిసగా మారిన షేక్ షమ్మ.. నిత్యం పుష్పను వేధించేవాడు. డబ్బుల కోసం రోజూ కొడుతుండేవాడు. దీంతో అతని వేధింపులు తాళలేక ఇంటికి తిరిగి వచ్చేసింది.
Also Read
- Uttar Pradesh Crime: నిద్రమాత్రల మత్తులోకి నెట్టేసి, చీరతో గొంతు బిగించి చంపింది.. భర్తలకు రక్షణ లేదా?
- Selling Racket: తల్లి ఒడిలో ఉండాల్సిన పసికందుకు ధర..
- Extramarital affairs: అలా వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు.. చివరికిలా..!
- Fake Experience Certificates & CVs: ఫేక్ CV, ఫేక్ సాలరీ స్లిప్లతో జాబ్ కొట్టేశారా?.. తర్వాత ఎదురయ్యే చట్టపరమైన చిక్కులు తెలుసా?
Vaishnavi Murder: యువతి వైష్ణవి మర్డర్ మిస్టరీ.. ప్రియుడే చంపేశాడా..? ఈ 2 గంటల్లో ఏం జరిగింది?
పుష్ప కోసం రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చిన షేక్ షమ్మ… అర్జంటుగా డబ్బులు కావాలని గొడవ పెట్టుకున్నాడు. కానీ తన దగ్గర లేవని చెప్పింది పుష్ప. దీంతో ఆమెపై చేయి చేసుకున్నాడు. పైగా వ్యభిచారం చేసి డబ్బులు ఇవ్వాలని చెప్పాడు. ప్రియుడి నోట వ్యభిచారం మాట రావడంతో ఒక్కసారిగా షాకైంది పుష్ప. అంతేకాదు అలాంటి నీచమైన తాను చేయనని తెగేసి చెప్పేసింది. దీంతో ఇరువురి మధ్య గొడవ ముదిరింది. ఈ క్రమంలో వెంట తెచ్చుకున్న చాకుతో ఆమెపై దాడి చేశాడు షేక్ షమ్మ. ఎడమ రొమ్ముపై దారుణంగా పొడిచేశాడు. అదే సమయంలో కత్తి దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన పుష్ప సోదరుడు, ఆమె తల్లిని కూడా గాయపరిచాడు.
షేక్ షమ్మ దాడిలో తీవ్రంగా గాయపడ్డ పుష్ప.. అక్కడికక్కడే మృతి చెందింది. పుష్ప మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన రాజోలు మండలంలో కలకలం రేపుతోంది. తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని కాదనుకున్న పుష్ప.. చివరికి ఓ ఉన్నాది చేతికి చిక్కింది. తనకు తాను తన భవిష్యత్తును నాశనం చేసుకుంది. ప్రేమించే ముందు అవతలి వ్యక్తి ఎలాంటి వారో తెలుసుకోని పక్షంలో ఇలాంటి దారుణాలే జరుగుతాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Uttar Pradesh Crime: నిద్రమాత్రల మత్తులోకి నెట్టేసి, చీరతో గొంతు బిగించి చంపింది.. భర్తలకు రక్షణ లేదా?
-
Nutrition Tips : అన్నంలో నెయ్యి.. ఆరోగ్య రహస్యం.!
-
IND Vs PAK: పాకిస్థాన్పై భారత్ ఘన విజయం.. ధావన్ హాఫ్ సెంచరీతో మెరుపులు..
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
New Smart Phone: 9020mAH బ్యాటర్, 12GB RAM, AMOLED డిస్ప్లే.. విడుదలకు ముందే లీకైన ఫీచర్స్..
ట్రెండింగ్
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?