Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Chittoor Gd Nellore Burnt Body Mystery Tirupati Student Jaswanth Reddy Missing Case

Mister Death: మిస్టర్ డెత్.. గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహం..

Published Date :March 26, 2026 , 9:30 pm
By Burugadda Veerababu
  • తిరుపతిలో ఓ ఇంటర్ విద్యార్థి అదృశ్యం..
  • జశ్వంత్ రెడ్డి అనే విద్యార్థి ఎక్కడికి వెళ్లాడు..?
  • 6 రోజులుగా ఆ కుర్రాడి ఆచూకీ ఎందుకు దొరకడం లేదు..?
  • హాస్టల్ నుంచి మాయమవ్వడం వెనుక ఏదైనా కుట్ర ఉందా?
Mister Death: మిస్టర్ డెత్.. గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహం..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

చిత్తూరు జిల్లా జీడి నెల్లూరులో గుర్తుపట్టలేని స్థితిలో లభించిన ఓ మృతదేహం తీవ్ర కలకలం రేపుతోంది. మృతి చెందిన వ్యక్తి వయసు 17 నుంచి 20 ఏళ్లలోపు ఉండడం, అదే సమయంలో తిరుపతిలో ఓ విద్యార్థి గత ఐదు రోజులుగా అదృశ్యం అవడంతో, అసలు చనిపోయిన వ్యక్తికి, అదృశ్యమైన విద్యార్థికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. చనిపోయిన వ్యక్తి ఎవరు? అదృశ్యమైన విద్యార్థి ఎక్కడున్నారు? అని ఇటు చిత్తూరు పోలీసులు, అటు తిరుపతి పోలీసులు పెద్ద ఎత్తున కేసును దర్యాప్తు చేస్తున్నారు.

చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు మండలంలోని కొమరగుంట పంచాయతీ మేకలబండ సమీపంలో కాలిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఓ యువకుడి మృతదేహం కలకలం రేపింది. బందార్లపల్లె, పూలవారికండ్రిగ గ్రామానికి వెళ్లే దారిలో మేకలబండపై ఉన్న మూతపడ్డ కంకర క్వారీ సమీపంలో కాలిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉన్న మృతదేహాన్ని పశువుల కాపర్లు గుర్తించారు.

Also Read

  • Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
  • TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్‌కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
  • HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!
  • Tragedy : హైదరాబాద్‌లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
Add as a preferred
source on google

విషయం తెలుసుకున్న కార్వేటినగరం పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహం నుంచి సేకరించిన ప్రాథమిక ఆధారాలతో మృతుడు 17 నుంచి 20 ఏళ్లలోపు వయసు కలిగిన యువకుడని నిర్ధారణకు వచ్చారు. గుర్తు తెలియని యువకుడిని ఎక్కడో హత్య చేసి ఇక్కడికి తీసుకువచ్చి రబ్బరు టైర్లు వేసి తగులబెట్టారా? లేక ఇక్కడే హత్య చేసి తగులబెట్టారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. శవపంచనామా అనంతరం మృతదేహాన్ని ఖననం చేశారు.

Also Read:Land Registrations: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ.. పని వేళలు పొడిగింపు..

ఇదే సమయంలో తిరుపతిలో ఓ ఇంటర్ విద్యార్థి అదృశ్యం ఉదంతం సంచలనంగా మారింది. జశ్వంత్ రెడ్డి అనే విద్యార్థి ఎక్కడికి వెళ్ళాడు? 6 రోజులుగా ఆ కుర్రాడి ఆచూకీ ఎందుకు దొరకడం లేదు? తంబళ్లపల్లె నుంచి తిరుపతి అగ్రహారంలోని గీతం కాలేజీకి చదువుకోసం వచ్చిన జశ్వంత్ హాస్టల్ నుంచి బయటకు వెళ్లి మాయమవ్వడం వెనుక ఏదైనా కుట్ర ఉందా? అన్న కోణంలో ఇప్పుడు చర్చ సాగుతోంది. మార్చి 11న వెళ్లిన జశ్వంత్ కనీసం ఫైనల్ ఎగ్జామ్ రాయడానికైనా వస్తాడని భావించిన పోలీసులు, కుటుంబ సభ్యులకు నిరాశే ఎదురైంది. పరీక్షకు కూడా జశ్వంత్ గైర్హాజరు కావడంతో ఈ మిస్టరీ మరింతగా ముదిరింది.

మరోవైపు వెదురుకుప్పం మండలం బంధార్లపల్లి సమీపంలోని మేకల బండ పైన గుర్తు తెలియని శవం కాల్చివేతపై పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తే 16 నుంచి 18 సంవత్సరాల బాలుడి శవంగా గుర్తించారు. గుర్తించలేని స్థితిలో కాల్చి చంపిన బాలుడి శవం వద్ద, శవం కాలిన ప్రదేశంలో నల్లటి పూసలు 10, ఎర్రటి పూసలు ఉన్నాయి. అవి చేతికి ధరించే బ్యాండ్‌గా గుర్తించారు. వీటి ఆధారంగా ఎవరైనా వాటిని గుర్తుపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పత్రికా ప్రకటన విడుదల చేశారు. అయితే ఇప్పటివరకు జీడీ నెల్లూరు హత్య విషయంపై కానీ, తిరుచానూరులో మిస్సింగ్ అయిన యువకుడు కేసు విషయంలో కానీ దర్యాప్తులో ఎలాంటి ముందడుగు పడకపోవడంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh Crime Mystery
  • Chittoor Crime News
  • Chittoor Police Investigation
  • GD Nellore Burnt Body
  • Geetham College Student Missing

తాజావార్తలు

  • Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!

  • Kriti Sanon: మేమూ సమానంగా కష్టపడుతున్నాం.. హీరోలపై కృతి సనన్ ఫైర్!

  • SRH vs GT: ప్లేఆఫ్స్ హీట్‌.. హై వోల్టేజ్ ఫైట్.. హైదరాబాద్, గుజరాత్‌కు కీలక సమరం!

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Dowry Harassment: పెళ్లై రెండు నెలలు తిరగకముందే.. వరకట్న వేధింపులకు నవ వధువు బలి!

ట్రెండింగ్‌

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions