CYBER FRAUDS DEATH PENALTY: దటీజ్ చైనా.. సైబరాసులకు ఉరిశిక్ష..
- మయన్మార్- థాయ్లాండ్ మధ్య ప్రాంతం సైబర్ నేరాలకు అడ్డా
- సైబర్ నేరగాళ్లకు చిక్కి 14 మంది చైనా పౌరులు మృతి
- 11 మంది ముఠాకు మరణశిక్ష విధించిన చైనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CYBER FRAUDS DEATH PENALTY: మయన్మార్- థాయ్లాండ్ మధ్య ప్రాంతం.. ఇది సైబర్ నేరాలకు అడ్డాగా ఉంది. ఇక్కడి నుంచే సైబర్ కేటుగాళ్లు.. ప్రపంచవ్యాప్తంగా దోపిడీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో చైనాలోనూ పలువురు పౌరులు సైబర్ నేరగాళ్లకు చిక్కి మోసపోయారు. అందులో 14 మంది చైనా పౌరులు ఆత్మహత్య చేసుకోవడం లేదా.. ఒత్తిడి తట్టుకోలేక మృతి చెందిన ఘటనలు నమోదయ్యాయి. దీన్ని సీరియస్గా తీసుకున్న చైనా సర్కారు.. మయన్మార్ వేదికగా అంతర్జాతీయ స్థాయిలో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ఒక భారీ నేర ముఠా ఆట కట్టించింది. బిలియన్ డాలర్ల స్కామ్ చేస్తున్న ఆ ముఠాలోని 11 మంది సభ్యులను అరెస్ట్ చేశారు చైనా పోలీసులు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు. వారిని కోర్టులో ప్రవేశ పెట్టారు చైనా పోలీసులు. దీంతో 14 మంది చైనా పౌరుల మరణానికి కారణమైన ఆ 11 మంది ముఠాకు మరణ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఈ శిక్షను చైనా అధికారులు అమలు చేశారు.
Read Also: HYD STEROIDS ARREST: కండలు కాదు, బుడగలు.. స్టెరాయిడ్ మాఫియా గుట్టురట్టు..
Also Read
- Uttar Pradesh: నా భార్య, ఆమె ప్రియుడు నన్ను చంపేస్తారు.. ప్రేమ పెళ్లి, ఇప్పుడు ప్రాణభయం..
- Mysuru Horror: ఘోర విషాదం.. భార్య, ఇద్దరు కుమార్తెలను హత్య చేసి భర్త ఆత్మహత్య
- Kelly Hottle: సినీ పరిశ్రమలో విషాదం.. గాడ్జిల్లా vs కాంగ్ ఫేమ్ నటి 18 ఏళ్లకే మృతి..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్య కేసులో ట్విస్ట్.. మొదటి ప్లాన్ హత్య కాదట.!
మయన్మార్ కేంద్రంగా ఈ ముఠా సాగించిన నేర సామ్రాజ్యం సామాన్యమైనది కాదు. 2015 నుంచి మయన్మార్ ఉత్తర ప్రాంతంలోని కోకాంగ్ ఏరియాలో అనేక ‘స్కామ్ కేంద్రాలను’ ఏర్పాటు చేసి, ప్రపంచవ్యాప్తంగా అమాయకులను దోచుకున్నారు. టెలికాం మోసాలు, ఆన్లైన్ జూదం, హనీ ట్రాప్ ద్వారా వీరు సుమారు 1.4 బిలియన్ డాలర్లు దోచేశారు. భారత కరెన్సీలో దాదాపు రూ. 12,000 కోట్లకు పైగా అక్రమంగా సంపాదించినట్లు కోర్టు విచారణలో తేలింది. ఈ ముఠా కేవలం డబ్బులు దోచుకోవడమే కాకుండా, అత్యంత క్రూరంగా వ్యవహరించేది. డిజిటల్ అరెస్ట్ పేరుతో మనుషులను అక్రమంగా నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేసేవారు. వీరి ఆగడాల వల్ల 14 మంది చైనీయులు ప్రాణాలు కోల్పోగా.. వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణాలను గమనించిన వెన్జౌ కోర్టు, గతేడాది సెప్టెంబర్లోనే ముఠా నాయకులతో సహా 11 మందికి మరణశిక్ష విధించింది. నిందితులు పైకోర్టులో అప్పీల్ చేసుకున్నప్పటికీ న్యాయస్థానం వారి అభ్యర్థనను తిరస్కరించింది.
Read Also: DELHI WIFE MURDER: కమాండోకు కట్నం కాటు.. డంబెల్తో దాడి చేసి హత్య..
చైనా సుప్రీం పీపుల్స్ కోర్టు ఈ ఉరిశిక్షలను ఆమోదించిన తర్వాత.. నిందితులకు చట్టప్రకారం ఒక అవకాశం కల్పించారు. శిక్ష అమలు చేయడానికి కొద్దిసేపటి ముందు వారు తమ కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అధికారులు అనుమతించారు. ఆ తర్వాత గురువారం ఉదయం జెజియాంగ్ ప్రావిన్స్లోని జైలులో ఉరిశిక్షను అమలు చేశారు. ఈ చర్య ద్వారా విదేశాల్లో ఉండి చైనా పౌరులను మోసం చేసే ఎవరినైనా వదిలిపెట్టబోమని చైనా ప్రభుత్వం హెచ్చరించినట్లయింది. చైనాలో అమలు చేసిన ఈ ఉరిశిక్షలు అంతర్జాతీయ నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి. విదేశీ గడ్డపై ఉండి నేరాలు చేసినా, చైనా ప్రభుత్వం వారిని పట్టుకుని మరీ కఠిన శిక్షలు విధిస్తుందని ఈ ఘటన నిరూపించింది. సైబర్ మోసాలు, ఆన్లైన్ స్కామ్ల పట్ల చైనా ప్రభుత్వం ఎంత కఠినంగా ఉందో ఈ తీర్పు స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం మయన్మార్, కంబోడియా, లావోస్ వంటి ప్రాంతాలు డిజిటల్ స్కామ్ కేంద్రాలుగా మారిపోయాయి. మనుషులను అక్రమంగా తరలించి వారిని బలవంతంగా ఇలాంటి స్కామ్ సెంటర్లలో ఉంచి ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ మోసాలు చేయిస్తున్నారు. ఇలాంటి నెట్వర్క్లను తుదముట్టించడానికి చైనాతో పాటు అమెరికా వంటి దేశాలు కూడా ఆయా దేశాల ప్రభుత్వాలపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాయి.
తాజావార్తలు
-
Rice Procurement : తెలంగాణ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. బియ్యం కోటా భారీ పెంపు.!
-
Sanae Takaichi: రోజుకి 3 గంటలే నిద్రపోతా.. దుమారం రేపుతోన్న జపాన్ ప్రధాని వ్యాఖ్యలు
-
Posani Krishna Murali: ఒక రోజుకు పోసాని కృష్ణమురళి తీసుకునే రెమునరేషన్ ఇదేనట!
-
Bhatti Vikramarka : కేటీఆర్కు ‘ఎల్ నినో’పై కనీస అవగాహన లేదు
-
Delhi Police: సీజేపీపై 10 ఎఫ్ఐఆర్లు.. తగ్గేది లేదంటున్న ఢిల్లీ పోలీసులు..
ట్రెండింగ్
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!