Student Suicide: నిండు ప్రాణాన్ని బలితీసుకున్న నిరుద్యోగం.. కలల కొలువు దక్కకపోవడంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Student Suicide: చదివిన చదువుకు తగిన గుర్తింపు లభించలేదన్న ఆవేదన ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఎన్ని పరీక్షలు రాసినా ఉద్యోగం రావడం లేదన్న మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వైఎస్సార్ జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. మైలవరం మండలం దొమ్మర నంద్యాల గ్రామానికి చెందిన లావణ్య (28) అనే యువతి బీటెక్ పూర్తి చేసింది. ఉన్నత చదువు చదివిన తనకు మంచి ఉద్యోగం వస్తుందని, కుటుంబాన్ని ఆదుకోవచ్చని ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలోనే రైల్వేతో పాటు పలు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంది. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన ఫలితం మాత్రం ఆమెకు దక్కలేదు.
పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని..
చదువు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా నిరుద్యోగిగానే ఉండిపోవడంతో లావణ్య గత కొంతకాలంగా తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే జీవితంపై విరక్తి చెంది, నిన్న మధ్యాహ్నం రోడ్డు పక్కన పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే తీవ్ర గాయాలవ్వడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఒక చదువుకున్న యువతి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో దొమ్మర నంద్యాల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!