Site icon NTV Telugu

Bhopal Student’s Death: దారుణం.. కానిస్టేబుళ్ల దాడిలో విద్యార్థి మృతి..

Untitled Design (4)

Untitled Design (4)

మధ్యప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. ట్రాఫిక్ డ్యూటీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు కొట్టడంతో 21ఏళ్ల యువకుడు మరణించాడు. ఈ ఘటనతో పోలీసులు అధికార దుర్వినియోగం చేశారంటూ ఆందోళనలు చెలరేగాయి.

Read Also: Thanjavur Horror: అసలు వీడు కన్నతండ్రేనా.. భార్య మీద కోపంతో ఏం చేశాడంటే..

పూర్తి వివరాల్లోకి వెళితే.. భోపాల్ ప్లానీలోని ఇంద్రపురిలోని ఒక తోట పక్కన ఉన్న పార్కింగ్ ప్రాంతంలో స్నేహితులతో పార్టీ చేసుకుంటుండగా, డ్యూటీలో ఉన్న ఇద్దరు పోలీసులు కొట్టడంతో శుక్రవారం తెల్లవారుజామున డీఎస్పీ బావమరిది ఉదిత్ గయాకి అనే 21 ఏళ్ల యువకుడు మరణించాడు. ఉదిత్ ఇటీవలే తన కళాశాల పత్రాలను తీసుకోవడానికి బెంగళూరు నుండి తిరిగి వచ్చాడు. గురువారం, డిగ్రీ అందుకున్న తర్వాత, రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంద్రపురిలో తన స్నేహితుడు అక్షత్ సహా ఆరుగురు స్నేహితులతో కలిసి గ్రాడ్యుయేషన్ జరుపుకుంటూ.. మద్యం తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు.

శుక్రవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో, డ్యూటీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు, సంతోష్ బామ్నియా, సౌరభ్ ఆర్య, ఆగి ఉన్న కారులో గుంపును గమనించారు. అధికారులు యువకులను దుర్భాషలాడారని ఆరోపించారు. ఉదిత్ బయటకు వచ్చి సమీపంలోని లేన్‌లోకి పరిగెత్తాడు, కానీ పోలీసులు అతన్ని వెంబడించారు.

Read Also:Dog attaked Elephant : కుక్క పిల్లకి భయపడి బొక్క బోర్లా పడ్డ ఏనుగు.. వైరలవుతున్న వీడియో..

తెల్లవారుజామున 1.30 నుంచి 1.45 గంటల మధ్య, ఉదిత్ స్నేహితులు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించగా, కానిస్టేబుళ్లు అతనిని లాఠీలతో కొట్టారు. బహిరంగ మద్యం సేవించడంపై జరిగిన ఈ సమస్యను “పరిష్కరించడానికి” అధికారులు రూ. 10,000 డిమాండ్ చేశారు. వారి స్నేహితులు మాత్రం రెండు వేల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దాడి తర్వాత, ఉదిత్ తనకు అసౌకర్యం, వాంతులు వస్తున్నాయని చాలాసార్లు ఫిర్యాదు చేశాడు. ఆనంద్ నగర్ పోలీస్ అవుట్‌పోస్ట్‌లో ఉన్న ఒక పోలీసు వ్యక్తిని కలిసేందుకు ఫ్రెండ్ తో కలిసి వెళ్లాడు. తెల్లవారుజామున 4.00 గంటల ప్రాంతంలో ఉదిత్ ఔట్ పోస్ట్ వద్ద కుప్పకూలిపోయాడు. అతన్ని మొదట ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి, తరువాత భోపాల్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు, అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు. దీంతో యువకుడి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు.

స్పందించిన పోలీస్ ఉన్నతాధికారులు శుక్రవారం ఉదయం ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. AIIMSలో ఒక ప్యానెల్ నిర్వహించిన పోస్ట్‌మార్టం నివేదికలో ప్యాంక్రియాటిక్ రక్తస్రావం మరణానికి కారణమని తెలిసింది. ఈ ఘటన విచారణ చేపడతామని పోలీసు ఉన్నతాధికారులు బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు.

Exit mobile version