Death Note web series: వెబ్ సిరీస్ ప్రభావం.. నేను వెళ్లే సమయం ఆసన్నమైంది.. అంటూ?
- వెబ్ సిరీస్ ప్రభావం..
- 7వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య
- ఆత్మహత్య చేసుకునే ముందు డెత్ నోట్ రాసిన బాలుడు.
- నేను వెళ్లే సమయం ఆసన్నమైంది.. అంటూ..
Death Note web series: బెంగళూరులోని CK అచ్చుకట్టు ప్రాంతంలో 7వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. ప్రాథమిక దర్యాప్తులో ఈ సంఘటనకు ప్రసిద్ధ జపాన్ వెబ్ సిరీస్ ‘డెత్ నోట్’ ప్రభావం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఆత్మహత్య సంబంధించి దర్యాప్తులో.. ఆ అబ్బాయి ‘డెత్ నోట్’ సిరీస్ను తరచుగా చూసేవాడని.. అలాగే తన గదిలో ఆ సిరీస్లోని ఒక పాత్ర చిత్రాన్ని గీసి ఉంచినట్లు గుర్తించారు. ఈ విషయాలు అతనిపై సిరీస్ ప్రభావం ఉండవచ్చన్న అనుమానాలను బలపరుస్తున్నాయి. ఇక బాలుడి తల్లిదండ్రుల ప్రకారం.. అతనికి పాఠశాలలో గానీ, ఇంట్లో గానీ ఎటువంటి సమస్యలు లేవని తెలిపారు. అసలు కారణం ఇంకా స్పష్టంగా తెలియకపోవడంతో, పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. బాలుడి మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు.
CPI Narayana: కేంద్రం కటాక్షం లేకపోతే జగన్ ఇన్ని రోజులు కోర్టుకు పోకుండా ఉంటారా..?
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
మృతి చెందిన బాలుడు మ్యూజిషియన్ గణేష్, సింగర్ సవిత దంపతుల కొడుకు గంగాధర్(14). వెబ్ సిరీస్ అదేపనిగా చూస్తూ అందులో లీనమై చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య సమయంలో గంగాధర్ గదిలోకి వెళ్లి గిటార్ స్ట్రింగ్తో ఉరివేసుకున్నాడు. అయితే అతడు ఆత్మహత్య చేసుకునే ముందు ఓ డెత్ నోట్ రాశాడు. అందులో ఇక నేను వెళ్లే సమయం ఆసన్నమైంది, మీరు లేఖ చదివే సమయానికి నేను స్వర్గంలో ఉంటానని గంగాధర్ లేఖలో రాసుకొచ్చాడు. ఈ ఘటనతో తల్లితండ్రులు ఒక్కసారిగా కుమిలిపోయారు.
Rakshabandhan: బాలకృష్ణకు రాఖీ కట్టిన సోదరి పురందేశ్వరి.. వైరల్ వీడియో
ఇకపోతే ‘డెత్ నోట్’ కథలో.. ఒక హై స్కూల్ విద్యార్థి ఒక రహస్య నోట్బుక్ను కనుగొంటాడు. ఆ నోట్బుక్లో ఎవరి పేరు రాస్తే వారు మరణిస్తారు. ఈ శక్తిని ఉపయోగించి, తాను అనైతికంగా భావించే వ్యక్తులను చంపి, నేరరహిత సమాజాన్ని నిర్మించాలనుకుంటాడు. దీనిని అడ్డుకునేందుకు జపాన్ పోలీస్ టాస్క్ఫోర్స్ ప్రయత్నిస్తుంది.
తాజావార్తలు
-
Pan Masala: గుట్కా ప్రియులకు షాక్.. పాన్ మసాలా ప్యాకెట్లపై కేంద్రం సంచలన నిర్ణయం!
-
UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
-
Gayapadda Simham: స్టార్ హీరోల ఫాన్స్ గెట్ రెడీ ఫర్ బ్లాస్టింగ్ స్పూఫ్స్!
-
Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి ‘భట్టి’ భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
-
Adhir Ranjan Chowdhury: మమతా బెనర్జీ కళ్లలో భయం, ఇలా ఎప్పుడూ చూడలేదు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో