Site icon NTV Telugu

Double Murder: అనంతపురంలో జంట హత్యల కలకలం.. తల్లి, కొడుకు దారుణ హత్య

Double Murder

Double Murder

Double Murder: అనంతపురం జిల్లాలో జంట హత్యలు కలకలం సృష్టించాయి.. జిల్లాలోని శింగనమల మండలం తరిమెల గ్రామం ఎస్సీ కాలనీలో మంగళవారం తల్లి, కొడుకు దారుణ హత్యకు గురయ్యారు. గ్రామానికి చెందిన ఎల్లమ్మ (38) అనే అంగన్వాడీ టీచర్‌, ఆమె కుమారుడు చిన్న (22)ను హత్య చేశారు. ఈ ఘటన వెనుక కుటుంబ ఆస్తి వివాదమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గ్రామానికి చెందిన నల్లప్ప అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. నల్లప్ప మృతి అనంతరం రెండు కుటుంబాల మధ్య ఆస్తి విషయంలో తీవ్ర వివాదం నెలకొంది. ఈ క్రమంలో మొదటి భార్యకు చెందిన కుమారులు, రెండో భార్య ఎల్లమ్మతో పాటు ఆమె కుమారుడు చిన్నను హత్య చేసినట్లు సమాచారం. ఇక, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Read Also: Vizag Fleet Review 2026: విశాఖ తీరంలో నౌకాదళ విన్యాసాలు.. ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రత్యేక ఆకర్షణ.!

Exit mobile version