Anantapur Mystery Case: వీడిన హత్య మిస్టరీ.. రోడ్డుకు అడ్డుగా ఉన్నాడని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anantapur 3 Town Police Chase A Mystery Case: మనం దారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు.. ఎవరైనా మార్గమధ్యంలో అడ్డుగా వస్తే ఏం చేస్తాం? హార్న్ కొట్టి, పక్కకు తప్పుకోవాలని సూచిస్తాం. కానీ.. అనంతపురంలో ఇద్దరు వ్యక్తులు మాత్రం ఒక వ్యక్తిని కిరాతకంగా చంపేశారు. పోలీసులకు పెద్ద సవాలుగా మారిన ఈ కేసుని ఎట్టకేలకు వారం రోజుల తర్వాత చేధించారు. రోడ్డుకి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో.. ఓ వ్యక్తిని ఇద్దరు యువకులు చంపారని పోలీసులు తేల్చారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. అక్టోబర్ 28వ తేదీన సీసీ సురేష్ తన సహచర ఉద్యోగితో కలిసి ఒక కాఫీ క్లబ్కి వెళ్లారు. అక్కడ కాఫీ తాగిన తర్వాత.. రాజీవ్కాలనీకి వెళ్లే సర్వీసురోడ్డులో సురేష్ తన ద్విచక్ర వాహనాన్ని నిలిపి ఫోన్లో మాట్లాడుతున్నారు.
సరిగ్గా అదే సమయంలో.. సోములదొడ్డి వైపు నుంచి బి.సాయికిరణ్, కె.రేణుకుమార్ అనే ఇద్దరు వ్యక్తులు తమ ద్విచక్ర వాహనంలో అటుగా వచ్చారు. రోడ్డుకి అడ్డంగా ద్విచక్ర వాహనం పెట్టాడని.. వాళ్లు సురేష్తో వాగ్వాదానికి దిగారు. అది చినికి చినికి గాలివానగా మారి, ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి చేరుకుంది. అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఆవేశంతో.. సురేష్ బండిపై ఉన్న హెల్మెట్ తీసుకొని, అతని తలపై పలుమార్లు బాదారు. తల వెనుక భాగంలో బలమైన గాయాలు అవ్వడంతో.. సురేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో.. నిందితులిద్దరు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. చాలా కోణాల్లో విచారించారు కానీ, నిందితుల జాడ కనిపించలేదు.
Also Read
- Wife Kills Husband: ఇన్స్ట్రాగ్రామ్ ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య..
- Vijayawada: రౌడీషీటర్ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన సెల్ఫీ వీడియో
- Black Magic: చేతబడి అనుమానం.. పనిమనిషిని దారుణంగా చంపిన డాక్టర్..
- Dowry Harassment: తల్లికి ఫోన్.. తర్వాత గదిలో ఉరి.. పెళ్లయిన 45రోజులకే భార్య ఆత్మహత్య!
ఎలాగైనా ఈ కేసుని చేధించాలనుకున్న పోలీసులు.. ఒక ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. ఎట్టకేలకు ఈ కేసుని చేధించారు. నిందితులకి, హతుడికి ఎలాంటి సంబంధం లేదని.. కేవలం ఆ గొడవ సమయంలో క్షణికావేశానికి గురై వాళ్లు హత్య చేసినట్టు పోలీసులు తమ విచారణలో తేల్చారు. సాయికిరణ్, రేణుకుమార్లను అరెస్ట్ చేసి.. వారి నుంచి ద్విచక్ర వాహనంతో పాటు హత్యకు ఉపయోగించిన హెల్మెట్ను స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Jio IPO: వేల కోట్లు కొల్లగొట్టడానికి రెడీ అయిన జియో.. ఐపీఓపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన ముఖేష్ అంబానీ!
-
The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
-
JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
-
Nagadurga: సుకుమార్ – బన్నీ వాస్ బ్యానర్లలో క్రేజీ ప్రాజెక్ట్.. ప్రియదర్శి జోడీగా రంగంలోకి దిగిన ఫోక్ స్టార్!
-
Afghan: పాక్ గడ్డపై ఆఫ్ఘన్ డ్రోన్ల పంజా.. గురితప్పని దాడి, కుప్పకూలిన ఐసిస్ అడ్డాలు!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?