NTV Telugu Site icon

Crime News : బీమా సొమ్ము కోసం బావమరిది హత్య..

Murder

Murder

Crime News : ఈమధ్య కాలంలో ఆస్తి తగదాలకు సంబంధించిన అనేక సంఘటనలు ఎక్కువయ్యాయి. దీంతో దేశంలో క్రైమ్ రేట్ మరింతగా పెరిగిపోతోంది. తాజాగా కడప జిల్లాలోని చెన్నూరు మండలలో భీమా సొమ్ము కోసం సంబంధించి ఓ దారుణ హత్య జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..

Ganja Smuggling: గంజాయి, డ్రగ్స్ కట్టడికి యాక్షనులోకి దిగిన సీఎం..

జిల్లాలోని చెన్నూరు మండలానికి చెందిన నారాయణరెడ్డి పేరున అతని సోదరి భర్త బాల గురు ప్రసాద్ రెడ్డి 12.5 లక్షలకు బీమా చేయించాడు. ఈ బీమా పత్రంలో నామినీగా మృతుని సోదరి పేరు నమోదు చేయించారు. ఈ నేపథ్యంలో బీమా సొమ్ము పై బలగూరు ప్రసాద్ రెడ్డి అతని భార్య కన్నేశారు. దీంతో బీమా సొమ్ము కోసం బాలగురు ప్రసాద్ రెడ్డి.. నారాయణరెడ్డికి మద్యం ఫుల్ గా తాగించాడు. దాంతో మద్యం మత్తులో ఉన్న ఆయనను ఓ బండరాయితో బాది చంపేశాడు. దీంతో నారాయణరెడ్డి అక్కడికక్కడే మరణించాడు.

Hyderabad Hijras: హిజ్రాల ఆగడాలపై పోలీసులు కొరడా.. బలవంతపు వసూళ్లపై కఠిన చర్యలు

విషయాన్ని తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విషయంలో భాగంగా నిందితుడని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చపబడుతున్నారు.