Site icon NTV Telugu

కుటుంబ కలహాలు.. నడిరోడ్డుపై భార్య, కూతురిపై దారుణం

crime news

crime news

భార్యాభర్తలు అన్నాక గొడవలు పడడం సహజం.. వాటన్నింటిని సర్దుకొని కాపురం చేస్తేనే కుటుంబం నిలబడుతుంది. కానీ .. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎక్కువమంది కుటుంబ కలహాల వలన నేరాలకు పాల్పడుతున్నారు. ఆ బాధలను భరించలేక వారు మృతి చెందడమో, లేక కట్టుకున్నవారిని కడతేర్చడమో చేస్తున్నారు. తాజాగా ఒకభర్త, భార్య గొడవపడి వెళ్లిపోయిందని ఆమెపై నడిరోడ్డుపై యాసిడ్ దాడి చేశాడు.. పక్కనే ఉన్న కూతురుపై కూడా అతి కిరాతకంగా యాసిడ్ పోసి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన కేరళలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.. కేరళలో నివాసముండే సనాల్ , నిజిత దంపతులకు అలకనంద అనే కూతురు ఉంది. అయితే భార్యాభర్తల మధ్య గత కొన్నిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భర్త వేధింపులు తాళలేక నెల రోజుల క్రితం కన్నూరులోని కొట్టియూర్ నుంచి నిజిత, ఆమె కూతురు అంబలవాయల్ వచ్చి విడిగా ఉంటుంది. ఇక ఈ క్రమంలో నిన్న మధ్యాహ్నం కూతురుతో పాటు నిజిత బయటికి వెళ్లగా.. బైక్ పై వచ్చిన సనాల్ భార్యపై యాసిడ్ పోశాడు , కన్నకూతురని కూడా లేకుండా ఆమెపై కూడా యాసిడ్ పోసి పరారయ్యాడు. ఈ ఘటనలో తల్లీకూతుళ్లు ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలుపుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Exit mobile version