Delhi: విషాదం.. హాస్టల్లో ఇద్దరు పీజీ విద్యార్థుల మృతి
- దేశ రాజధాని ఢిల్లీలో విషాదం
- హాస్టల్లో ఇద్దరు పీజీ విద్యార్థుల మృతి
- ప్రమాదమా? హత్యా? అన్న కోణంలో దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పీజీ విద్యార్థులు మృతిచెందడం తీవ్ర కలకలం రేపుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదమా? హత్యా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తు్న్నారు.
ఢిల్లీలోని రోహిణి అనే ప్రాంతంలోని ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ దగ్గర పీజీ భవనం ఉంది. ఆ భవనం నాలుగో అంతస్తు నుంచి పడి ఇద్దరు పీజీ విద్యార్థులు దుర్మరణం చెందారు. మరణించిన వారిలో ఒకరు రాజస్థాన్లోని భరత్పూర్ వాసిగా.. మరొకరు ఢిల్లీలోని పాలెం కాలనీకి చెందిన నివాసిగా గుర్తించారు. ఇద్దరూ కూడా బీబీఏ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులు ఈషాన్, హర్ష్ వర్మగా కనుగొన్నారు.
Also Read
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్పై కేసు, ఉద్యోగానికి గుడ్బై.!
పోలీసుల సమాచారం ప్రకారం.. మృతులిద్దరూ నాలుగో అంతస్తులోని కిటికీ దగ్గర కూర్చుని ఉన్నారని.. మంచం మీద కూర్చుని మాట్లాడుకుంటున్నట్లు అధికారి తెలిపారు. అయితే పెద్ద శబ్ధంతో పాటు అరుపులు వినిపించినట్లుగా సహచర విద్యార్థులు తెలిపినట్లు పేర్కొన్నారు. అనంతరం ఇద్దరు విద్యార్థులు రక్తపు మడుగులో ఉన్నట్లు సహచరులు గుర్తించారన్నారు. పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనాస్థలికి వచ్చి పరిశీలించినట్లు అధికారి తెలిపారు. వెంటనే ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఒకరు చనిపోయారని.. ఇంకొకరు చికిత్స పొందుతూ చనిపోయినట్లు అధికారి తెలిపారు. అయితే ప్రమాదవశాత్తు చనిపోయారా? లేదంటే ఏదైనా గొడవ కారణంగా చనిపోయారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా హాస్టల్లో ఉన్న మిగతా విద్యార్థులందరినీ విచారిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు విద్యార్థుల మరణవార్తను కుటుంబ సభ్యులకు చేరవేసినట్లు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందిస్తామని చెప్పారు. ఒకేసారి ఇద్దరు చనిపోవడం బాధాకరమని పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఒకేసారి ఇద్దరు విద్యార్థులు చనిపోవడంతో సహచర విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.
తాజావార్తలు
-
IND vs AFG: ముల్లన్పూర్లో భారత్ మర్చిపోలేని మ్యాజిక్.. ఆఫ్ఘన్పై 300 పరుగుల తేడాతో విజయం!
-
‘OG India Tour’: తమన్ ‘OG ఇండియా టూర్’.. ఈ శనివారం నుంచే హైదరాబాద్లో లైవ్ కన్సర్ట్ షురూ!
-
Iran-US War: 100 రోజులు పూర్తి చేసుకున్న యుద్ధం.. హార్ముజ్ తెరుచుకోకపోతే తీవ్ర సంక్షోభమే!
-
West Bengal: బెంగాల్ ‘‘పుష్ప’’ అరెస్ట్.. అభిషేక్ సన్నిహితుడి ఆటకట్టు..
-
Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!