Delhi: విషాదం.. హాస్టల్లో ఇద్దరు పీజీ విద్యార్థుల మృతి
- దేశ రాజధాని ఢిల్లీలో విషాదం
- హాస్టల్లో ఇద్దరు పీజీ విద్యార్థుల మృతి
- ప్రమాదమా? హత్యా? అన్న కోణంలో దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పీజీ విద్యార్థులు మృతిచెందడం తీవ్ర కలకలం రేపుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదమా? హత్యా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తు్న్నారు.
ఢిల్లీలోని రోహిణి అనే ప్రాంతంలోని ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ దగ్గర పీజీ భవనం ఉంది. ఆ భవనం నాలుగో అంతస్తు నుంచి పడి ఇద్దరు పీజీ విద్యార్థులు దుర్మరణం చెందారు. మరణించిన వారిలో ఒకరు రాజస్థాన్లోని భరత్పూర్ వాసిగా.. మరొకరు ఢిల్లీలోని పాలెం కాలనీకి చెందిన నివాసిగా గుర్తించారు. ఇద్దరూ కూడా బీబీఏ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులు ఈషాన్, హర్ష్ వర్మగా కనుగొన్నారు.
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
పోలీసుల సమాచారం ప్రకారం.. మృతులిద్దరూ నాలుగో అంతస్తులోని కిటికీ దగ్గర కూర్చుని ఉన్నారని.. మంచం మీద కూర్చుని మాట్లాడుకుంటున్నట్లు అధికారి తెలిపారు. అయితే పెద్ద శబ్ధంతో పాటు అరుపులు వినిపించినట్లుగా సహచర విద్యార్థులు తెలిపినట్లు పేర్కొన్నారు. అనంతరం ఇద్దరు విద్యార్థులు రక్తపు మడుగులో ఉన్నట్లు సహచరులు గుర్తించారన్నారు. పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనాస్థలికి వచ్చి పరిశీలించినట్లు అధికారి తెలిపారు. వెంటనే ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఒకరు చనిపోయారని.. ఇంకొకరు చికిత్స పొందుతూ చనిపోయినట్లు అధికారి తెలిపారు. అయితే ప్రమాదవశాత్తు చనిపోయారా? లేదంటే ఏదైనా గొడవ కారణంగా చనిపోయారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా హాస్టల్లో ఉన్న మిగతా విద్యార్థులందరినీ విచారిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు విద్యార్థుల మరణవార్తను కుటుంబ సభ్యులకు చేరవేసినట్లు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందిస్తామని చెప్పారు. ఒకేసారి ఇద్దరు చనిపోవడం బాధాకరమని పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఒకేసారి ఇద్దరు విద్యార్థులు చనిపోవడంతో సహచర విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!