SSY Account: ‘సుకన్య సమృద్ధి యోజన’ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మార్చి 31 చివరి తేదీ..
- సుకన్య సమృద్ధి యోజన ఖాతాదారులకు అలర్ట్..
- మార్చి 31వ తేదీలోగా ఖాతాల్లో డబ్బు జమ చేయాలి..
- సంవత్సరానికి మినిమం డిపాజిట్ అనేది ఉండాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమ ఆడపిల్లల భవిష్యత్తును బంగారుమయం చేయాలని, వారికి ఆర్థికంగా అండగా ఉండాలని ప్రతీ తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకోసమే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సుకన్య సమృద్ధి యోజన’పథకంలో చాలా మంది పెట్టుబడి పెడుతుంటారు. ఈ పథకంలో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటంతో పాటు.. దీర్ఘకాలంలో మంచి లాభాలు వస్తాయి. అయితేజజ ఈ ఖాతా విషయంలో ఒక ముఖ్యమైన నిబంధన ఉంది. దీనిని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు, కానీ ఇది మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు ప్రతి ఆర్థిక సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా ఖాతాలో కొంత మొత్తాన్ని జమ చేయాలి. ఒకవేళ ఈ ఆర్థిక సంవత్సరం గడువు లోపు మీరు కనీస మొత్తాన్ని డిపాజిట్ చేయకపోతే.. మీ ఖాతా నిలిచిపోయే అయ్యే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే.. మీరు మార్చి 31వ తేదీలోపు మీ ఖాతాలో డబ్బు జమ చేయాలి.
Also Read
- Nita Ambani: దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళగా నీతా అంబానీ.. ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో తొలి స్థానం
- Cyber Fraud: ఓటీపీ చెప్పకపోయినా డబ్బు పోతుందా? సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఇలా మోసం చేస్తున్నారు
- PhonePe ITR filing: కేవలం రూ.24తోనే ITR ఫైల్ చేయొచ్చు.. PhonePe, JioFinance కొత్త ట్యాక్స్ ఫైలింగ్ సేవలు ప్రారంభం
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
Also Read:Exams: ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షలు ఏవో తెలుసా.. మన ఇండియా నుంచి కూడా ఉన్నాయ్…
మార్చి 31లోపు ఎందుకు చేయాలి?
సుకన్య సమృద్ధి యోజన ఖాతాను యాక్టివ్గా ఉంచాలంటే.. ప్రతి ఏటా ఒక కనీస మొత్తాన్ని కట్టడం తప్పనిసరి. చాలామంది ఏడాది పొడవునా డబ్బులు కట్టడం మర్చిపోతుంటారు. అలా మర్చిపోయినా పర్వాలేదు, కానీ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు అంటే మార్చి 31 నాటికి ఆ మొత్తాన్ని డిపాజిట్ చేయడం చాలా ముఖ్యం.
ఒకవేళ మీరు ఆ తేదీలోపు కనీస మొత్తాన్ని జమ చేయకపోతే.. మీ ఖాతా నిలిపివేయబడుతుంది. దానిని తిరిగి యాక్టివేట్ చేయాలంటే మీరు జరిమానా (Penalty) చెల్లించాల్సి రావచ్చు. తద్వారా అనవసరమైన ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి.. మీరు కూడా ఈ పథకంలో ఖాతా కలిగి ఉంటే, ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కట్టాల్సిన కనీస మొత్తాన్ని వెంటనే చెల్లించండి. మార్చి 31 వరకు వేచి చూడకుండా.. వీలైనంత త్వరగా పూర్తి చేయడం ఉత్తమం.
తాజావార్తలు
-
Indian Railways Viral Train Puja: కదులుతున్న రైలులో పూజలు?.. రైల్వే శాఖ క్లారిటీ..
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Akshay Kumar: ఆ హీరోయిన్ నా మొదటి క్రష్.. క్లైమాక్స్ లేకుండానే సినిమా.. అక్షయ్ షాకింగ్ రివీల్
-
Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు.. రూ.152.95 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన!
-
South Indian Women-Led Films : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన లేడి ఓరియేంటేడ్ సౌత్ మూవీస్
ట్రెండింగ్
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?