Vedanta: సంచలన నిర్ణయం తీసుకున్న వేదాంత.. ఇక నుంచి 5 కంపెనీలుగా.. ఒక్క షేరుకు 5 కంపెనీల్లో షేర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఐదు స్వతంత్ర విభాగాలుగా విభజించే ప్రక్రియలో కీలక ముందడుగు వేసింది. మే 1వ తేదీని విభజన ప్రక్రియకు సంబంధించి కీలకమైన తేదీగా బోర్డు ఖరారు చేసినట్లు కంపెనీ సోమవారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది. ఈ భారీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వేదాంత గ్రూపులోని అల్యూమినియం, పవర్, ఆయిల్, ఐరన్, స్టీల్ వ్యాపారాలు వేర్వేరుగా విడిపోయి స్వతంత్రంగా లిస్ట్ కానున్నాయి. సహజ వనరుల రంగంలో భారత్లో చోటుచేసుకుంటున్న అతిపెద్ద కార్పొరేట్ మార్పులలో ఇది ఒకటిగా నిలుస్తోంది.
ఈ విభజన ప్రణాళిక ప్రకారం.. వేదాంత లిమిటెడ్ వాటాదారులు తమ వద్ద ఉన్న ప్రతి ఒక్క షేరుకు బదులుగా కొత్తగా ఏర్పడే ఐదు సంస్థలలో ఒక్కో షేరును అదనంగా పొందుతారు. అంటే ఇన్వెస్టర్లు వేదాంత అల్యూమినియం మెటల్ లిమిటెడ్ (VAML), తల్వండి సాబో పవర్ లిమిటెడ్ (TSPL), మాల్కో ఎనర్జీ లిమిటెడ్ (MEL), వేదాంత ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్ (VISL) వంటి సంస్థలలో సమాన వాటాలను అందుకుంటారు. 5 సంస్థల్లో షేర్లను కలిగి ఉంటారు. వేదాంత లిమిటెడ్ మాత్రం బేస్ మెటల్స్ వ్యాపారాన్ని తన వద్దే ఉంచుకుంటుంది. ఈ ప్రక్రియలో భాగంగా భారత్ అల్యూమినియం కంపెనీ (బాల్కో)లో ఉన్న వాటాలను వేదాంత అల్యూమినియం మెటల్ లిమిటెడ్కు బదిలీ చేయనున్నారు.. తద్వారా అల్యూమినియం కార్యకలాపాలన్నీ ఒకే గొడుకు కిందకు రానున్నాయి.
Also Read
- Mukesh Ambani: గత 6 ఏళ్లుగా జీతం తీసుకోని ముఖేష్ అంబానీ.. అయినా సంపదలో రికార్డులు
- LIC Shares: ఎల్ఐసీ షేర్స్ లో భారీ పతనం.. రూ.820 నుండి రూ.414 కు పడిపోయిన షేర్స్.. అసలు కారణం ఇదే!
- RBI New Currency Notes: ఆర్బీఐ సంచలన ప్లాన్..? పాత కరెన్సీ నోట్లు బ్యాన్..!?
- Explainer: చనిపోయిన తర్వాత భారతీయుల ర*క్తాన్ని తాగుతున్నారు.. వెలుగులోకి భయంకర లెక్కలు!
Also Read:TFDA : తెలుగు చిత్రసీమలో సరికొత్త సంచలనం.. దర్శకుల కోసం చదలవాడ శ్రీనివాసరావు బంపర్ ఆఫర్
వ్యాపార విలువను వెలికితీయడం, నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడం , ఒక్కో విభాగం తన రంగానికి అనుగుణంగా స్వతంత్ర వృద్ధి వ్యూహాలను అనుసరించేలా చేయడం ఈ విభజన ప్రధాన ఉద్దేశం. అంతేకాకుండా, గ్రూపు నిర్మాణాన్ని సరళతరం చేయడం ద్వారా అప్పుల భారాన్ని తగ్గించుకోవాలని కంపెనీ భావిస్తోంది. వాస్తవానికి 2023లోనే ఈ ప్రతిపాదన వచ్చినప్పటికీ.. అప్పుల రికవరీ, ఇతర సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరిగింది. చివరకు డిసెంబర్ 2025లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) నుంచి ఆమోదం లభించడంతో ఈ డీమెర్జర్ మార్గం సుగమమైంది. ఈ మార్పు వల్ల అంతర్జాతీయ పెట్టుబడిదారులకు తమకు నచ్చిన నిర్దిష్ట విభాగాల్లో పెట్టుబడి పెట్టే అవకాశం లభిస్తుంది. ఇది దీర్ఘకాలంలో కంపెనీ మార్కెట్ విలువను పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం స్టాక్ మార్కెట్లోని ఇన్వెస్టర్లకు కొత్త అవకాశాలను సృష్టించడమే కాకుండా, మైనింగ్ రంగంలో వేదాంత పట్టును మరింత బలోపేతం చేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
పాకిస్తాన్ అణుకేంద్రంపై దాడికి సిద్ధమైన భారత్-ఇజ్రాయిల్.. ఇందిరా గాంధీ ఎందుకు వెనక్కి తగ్గింది?
-
Hero Flex Fuel Bike: హీరో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్ రిలీజ్ కు రెడీ.. పెట్రోల్, ఇథనాల్ రెండింటిపైనా పరుగులు!
-
Hyderabad: హైదరాబాద్ కుర్రాడి సంచలనం.. దేశంలోనే తొలి ‘స్టూడెంట్ బ్యాంక్’.. ఫోర్బ్స్ జాబితాలో చోటు!
-
Karnataka: కర్ణాటకపై రాహుల్గాంధీ వ్యూహం ఇదేనా? సిద్ధూకు లక్కీ ఛాన్స్!
-
Hardik Pandya: కీలక నిర్ణయం తీసుకున్న హార్దిక్ పాండ్య.. MI కి బై బై.. ఆగస్టులో ఆ జట్టులోకి ఎంట్రీ..?
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!