Farmers: రైతులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఆ సబ్సిడీకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. అంతర్జాతీయ విపణిలో రసాయన ఎరువుల ధరలు ఆకాశాన్నంటుతున్నా, ఆ భారం సామాన్య రైతుపై పడకుండా ఉండేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ను దృష్టిలో ఉంచుకుని ఫాస్ఫాటిక్ మరియు పొటాసిక్ (P&K) ఎరువుల కోసం సుమారు రూ. 41,543 కోట్ల భారీ రాయితీని మంజూరు చేసింది.
ఈ నిర్ణయం ద్వారా రైతులు సబ్సిడీ ధరలకే నాణ్యమైన ఎరువులను పొందే అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో పెట్టుబడి ఖర్చులను తగ్గించి, దిగుబడిని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిధులను కేటాయించింది. ఎరువుల లభ్యతలో ఎలాంటి కొరత లేకుండా చూడటమే కాకుండా.. విదేశీ మార్కెట్ ఒడిదుడుకుల నుంచి అన్నదాతను కాపాడటానికి ఈ భారీ సబ్సిడీ రక్షణ కవచంలా పనిచేస్తుందని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు. రైతు సంక్షేమంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు కూడా ప్రాధాన్యత ఇస్తూ, జైపూర్ మెట్రో ప్రాజెక్టు రెండో దశకు రూ. 13 వేల కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది.
Also Read
- Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
- September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
Also Read:Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!
మరోవైపు దేశ ఇంధన భద్రతను పటిష్టం చేసే దిశగా రాజస్థాన్లో ప్రతిష్టాత్మకమైన భారీ రిఫైనరీ ప్రాజెక్టును ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. హెచ్పీసీఎల్ రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్ (HRRL) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు వ్యయ సవరణలకు, ఈక్విటీ భాగస్వామ్య మార్పులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్ ఇప్పటికే ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రిఫైనింగ్ దేశంగా ఎదిగిందని.. ఈ కొత్త ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే దేశీయ సామర్థ్యం మరో 9 మిలియన్ మెట్రిక్ టన్నుల వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏటా 258 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురును శుద్ధి చేసే సామర్థ్యం మనకు ఉంది. ఈ రాజస్థాన్ రిఫైనరీ జూలై 2026 నాటికి వాణిజ్యపరంగా కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు ధృవీకరించారు. ఇది ఇంధన ఉత్పత్తికే పరిమితం కాకుండా.. పెట్రోకెమికల్ రంగంలో అనేక ఉపాధి అవకాశాలను సృష్టించనుంది. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి.. స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయడానికి ఈ రిఫైనరీ ఒక మైలురాయిగా నిలవనుంది. సమగ్ర గ్రామీణ అభివృద్ధి , పారిశ్రామిక వృద్ధిని సమన్వయం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపనున్నాయి.
తాజావార్తలు
-
High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
-
Fit India Ambassador: గౌతమ్ గంభీర్కు భావోద్వేగ క్షణం.. కుమార్తె ఆజీన్కు అరుదైన గౌరవం
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
Kiara Advani: ‘టాక్సిక్’ తర్వాత కియారా చేతికి బంపర్ ఆఫర్.. పదేళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్లో ఛాన్స్?
-
Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!