Farmers: రైతులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఆ సబ్సిడీకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. అంతర్జాతీయ విపణిలో రసాయన ఎరువుల ధరలు ఆకాశాన్నంటుతున్నా, ఆ భారం సామాన్య రైతుపై పడకుండా ఉండేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ను దృష్టిలో ఉంచుకుని ఫాస్ఫాటిక్ మరియు పొటాసిక్ (P&K) ఎరువుల కోసం సుమారు రూ. 41,543 కోట్ల భారీ రాయితీని మంజూరు చేసింది.
ఈ నిర్ణయం ద్వారా రైతులు సబ్సిడీ ధరలకే నాణ్యమైన ఎరువులను పొందే అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో పెట్టుబడి ఖర్చులను తగ్గించి, దిగుబడిని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిధులను కేటాయించింది. ఎరువుల లభ్యతలో ఎలాంటి కొరత లేకుండా చూడటమే కాకుండా.. విదేశీ మార్కెట్ ఒడిదుడుకుల నుంచి అన్నదాతను కాపాడటానికి ఈ భారీ సబ్సిడీ రక్షణ కవచంలా పనిచేస్తుందని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు. రైతు సంక్షేమంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు కూడా ప్రాధాన్యత ఇస్తూ, జైపూర్ మెట్రో ప్రాజెక్టు రెండో దశకు రూ. 13 వేల కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది.
Also Read
- Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
- Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
- SIP Investment: నెలకు రూ.20 వేల పెట్టుబడితో.. రూ.1 కోటి సంపాదించండి.. ఎలా అంటే..
- YouTube vs Instagram: డబ్బు సంపాదించాలంటే ఇన్స్టా బెస్ట్ ఆ? యూట్యూబ్ బెస్ట్ ఆ? ఈ లెక్కలు చూస్తే షాకవుతారు!
Also Read:Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!
మరోవైపు దేశ ఇంధన భద్రతను పటిష్టం చేసే దిశగా రాజస్థాన్లో ప్రతిష్టాత్మకమైన భారీ రిఫైనరీ ప్రాజెక్టును ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. హెచ్పీసీఎల్ రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్ (HRRL) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు వ్యయ సవరణలకు, ఈక్విటీ భాగస్వామ్య మార్పులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్ ఇప్పటికే ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రిఫైనింగ్ దేశంగా ఎదిగిందని.. ఈ కొత్త ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే దేశీయ సామర్థ్యం మరో 9 మిలియన్ మెట్రిక్ టన్నుల వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏటా 258 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురును శుద్ధి చేసే సామర్థ్యం మనకు ఉంది. ఈ రాజస్థాన్ రిఫైనరీ జూలై 2026 నాటికి వాణిజ్యపరంగా కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు ధృవీకరించారు. ఇది ఇంధన ఉత్పత్తికే పరిమితం కాకుండా.. పెట్రోకెమికల్ రంగంలో అనేక ఉపాధి అవకాశాలను సృష్టించనుంది. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి.. స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయడానికి ఈ రిఫైనరీ ఒక మైలురాయిగా నిలవనుంది. సమగ్ర గ్రామీణ అభివృద్ధి , పారిశ్రామిక వృద్ధిని సమన్వయం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపనున్నాయి.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!