వరుసగా రెండు రోజులు తగ్గిన బంగారం ధరలు ఈరోజు మళ్లీ షాకిచ్చాయి. గత రెండ్రోజుల్లో ఎంత తగ్గిందో మళ్లీ ఇవాళ ఒక్కరోజే అంతకు పెరిగింది. హమ్మయ్య పుత్తడి ధరలు తగ్గాయి అని పసిడి ప్రియులు ఊపిరి పీల్చుకునే లోపే కనకం షాకిచ్చింది. నేడు తులం బంగారం ధర రూ. 3770 పెరిగింది. కిలో సిల్వర్ ధర రూ.5000 పెరిగింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం (99.9% స్వచ్ఛత) గ్రాముకు రూ.14,455, 22 క్యారెట్ల బంగారం (91.6% స్వచ్ఛత) గ్రాముకు రూ.13,250, 18 క్యారెట్ల బంగారం (75% స్వచ్ఛత) గ్రాముకు రూ.10,841 వద్ద అమ్ముడవుతున్నాయి.
హైదరాబాద్ లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 3770 పెరిగి రూ. 1,44,550 కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 3450 పెరిగి రూ.1,32,500 కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,700 వద్ద అమ్ముడవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,32,650 వద్ద ట్రేడ్ అవుతోంది.
హైదరాబాద్ లో కిలో సిల్వర్ ధర రూ. 2,50,000కి చేరింది. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 5000 పెరిగి రూ. 2,45,000 వద్ద సేల్ అవుతోంది.

