Elon Musk: ఎలాన్ మస్క్ కి ఎదురుదెబ్బ.. మాజీ ఉద్యోగికి రూ.5కోట్ల పరిహారం!
- అత్యంత కఠినంగా పనిచేయాలని మస్క్ ఆదేశం
- లేదంటే రాజీనామా చేయాలని హెచ్చరిక చేస్తూ.. మెయిల్
- స్పందించని సీనియర్ ఉద్యోగి
- అతడిని ఉద్యోగంలో నుంచి తొలగింపు
- తాజాగా మాజీ ఉద్యోగికి రూ.5 కోట్లు చెల్లించాలని తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ కు ఎదురుదెబ్బ తగిలింది. 2022లో సోషల్ మీడియా సంస్థ ట్విటర్ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. ఈ తర్వాత దాని పేరును ఎక్స్గా మార్చారు. అలాగే దాదాపు 80 శాతం మంది సిబ్బందిని తొలగించారు. ఆ సమయంలో వారికి పరిహారం చెల్లించారు. ఈ పరిహారం విషయంలో ఆ సంస్థ మాజీ ఉన్నతోద్యోగులు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తమకు పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించాల్సి ఉందని కోర్టులో దావా వేశారు. తమ బకాయిలను ఎగ్గొట్టడానికి మస్క్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సంస్థతో ఉన్న ఒప్పందం ప్రకారం.. ఒక ఏడాది వేతనంతో పాటు తమకిచ్చిన స్టాక్ అవార్డులకు విలువ కట్టి ఇవ్వాల్సి ఉందని పేర్కొన్న సంగతి తెలిసిందే.
READ MORE: Live Location: మహిళ హత్య కేసులో పోలీసులకు సాయపడిన ‘‘లైవ్ లొకేషన్’’.. ఏం జరిగిందంటే..
Also Read
- RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Sanjay Malhotra: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశానికి ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక
ఎలాన్ మస్క్ యొక్క “అత్యంత హార్డ్కోర్” వర్క్ కల్చర్ అల్టిమేటం జారీ చేశారు. ఇక నుంచి అత్యంత కఠినంగా పనిచేయాలని సూచించారు. లేదంటే రాజీనామా చేయాలన్నారు. 24 గంటల్లో తమ అంగీకారాన్ని వెల్లడించాలని తెలిపారు. ఓ సీనియర్ ఉద్యోగి మెయిల్ పై ప్రతి స్పందించ లేదు. దీంతో అతడిని ఉద్యోగంలో నుంచి తీసేశారు.. మస్క్. తొలగించిన ఆ ఉద్యోగి పేరు.. గ్యారీ రూనీ. గ్యారీ తనకు జరిగిన అన్యాయం పై ఐర్లాండ్ యొక్క వర్క్ప్లేస్ రిలేషన్స్ కమిషన్ ను ఆశ్రయించారు. తాజాగా తీర్పు వెలువరించిన డబ్ల్యూఆర్ సీ..అనుభవజ్ఞుడైన గ్యారీ రూనీని అన్యాయంగా తొలగించారని పేర్కొంది. మాజీ ఉద్యోగికి సుమారు $600,000 (5,03,77,800 రూపాయలు) చెల్లించాలని తెలిపింది.
READ MORE:BSA Gold Star 650: భారత మార్కెట్లోకి బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650.. ధర ఎంతంటే..?
న్యాయనిర్ణేత మైఖేల్ మాక్నామీ మస్క్ అల్టిమేటమ్ను విమర్శించారు. ఉద్యోగులు తమ ఉద్యోగ భవిష్యత్తులను పరిగణనలోకి తీసుకోవడానికి 24 గంటల గడువు పెట్టడం సరికాదని.. పేర్కొన్నారు. మెయిల్ కి అంగీకరించకుంటే ఉద్యోగంలో నుంచి తీసేయడం సరికాదన్నారు. సోర్స్-టు-పే డైరెక్టర్గా పనిచేసిన రూనీ.. ఇది మాల్వేర్ కావచ్చునని భయపడి ఇమెయిల్ను తెరవడం పట్ల తాను జాగ్రత్తగా ఉన్నానని పేర్కొన్నారు. ఇంకా తొమ్మిదేళ్ల సర్వీస్ ఉన్నా.. రాజీనామా చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అతడికి రూ.దాదాపు 5కోట్లు ఇవ్వాలని న్యాయనిర్ణేత మైఖేల్ కంపెనీకి ఆదేశాలు జారీ చేశారు.
తాజావార్తలు
-
Infinix Hot 70 Pro: ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో రిలీజ్.. డ్యూయల్ డిస్ప్లే, 144Hz స్క్రీన్, 6000mAh బ్యాటరీ
-
RAW NTR: ‘ఊరు–వాడ’ కార్యక్రమంపై ‘రా ఎన్టీఆర్’ కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
Potti Sriramulu’s Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
-
Bahadurguda: బహుద్దుర్ గుడాలో హైటెన్షన్..!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!