Site icon NTV Telugu

Stock market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

Stock

Stock

దేశీయ స్టాక్ మార్కెట్‌ భారీ లాభాల్లో ముగిశాయి. గత వారం రికార్డుల్లో సృష్టించిన సూచీలు.. శుక్రవారం మాత్రం నిరాశ పరిచింది. నష్టాలతో ముగిసింది. ఇక సోమవారం ఫ్లాట్‌గా ట్రేడ్ అయిన సూచీలు.. అనంతరం క్రమక్రమం పుంజుకుంటూ భారీ లాభాల్లో దూసుకెళ్లింది. సెన్సెక్స్ 443 పాయింట్లు లాభపడి 79. 476 దగ్గర ముగియగా.. నిఫ్టీ 131 పాయింట్లు లాభపడి 24, 141 దగ్గర ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.39 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: AP: లద్దాఖ్ లో ఏపీకి చెందిన ముగ్గురు జవాన్ల మృతి..గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న పార్థివ దేహాలు

నిఫ్టీలో టెక్ మహీంద్రా, విప్రో, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లాభపడగా, ఎన్‌టీపీసీ, ఐషర్ మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎస్‌బీఐ, అపోలో హాస్పిటల్స్ నష్టపోయాయి.

ఇది కూడా చదవండి: Sudheer Babu: పాన్ ఇండియా లెవ‌ల్లో న‌వ ద‌ళ‌ప‌తి సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌..

పవర్, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ మినహా అన్ని రంగాల్లో ఐటీ ఇండెక్స్ దాదాపు 2 శాతం పెరిగి గ్రీన్‌లో ముగిశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఒక్కొక్కటి 1 శాతానికి పెరిగి సూచీలు తాజా రికార్డును సొంతం చేసుకున్నాయి.

Exit mobile version