దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ముగిసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు అమెరికా-ఇరాన్ ఒక ఒప్పందానికి రాబోతున్నాయని వార్తలు రావడంతో మార్కెట్కు మంచి జోష్ వచ్చింది. దీంతో మార్కెట్ భారీ లాభాలు దూసుకెళ్లింది. పెట్టుబడిదారుల జేబుల్లోకి లక్షల కోట్ల సంపద చేరింది. సెన్సెక్స్ 940 పాయింట్లు లాభపడి 77, 958 దగ్గర ముగియగా.. నిఫ్టీ 298 పాయింట్లు లాభపడి 24, 330 దగ్గర ముగిసింది.
నిఫ్టీలో అత్యధికంగా లాభపడిన వాటిలో ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, ట్రెంట్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్ ఉండగా.. నష్టపోయిన వాటిలో ఓఎన్జీసీ, ఎల్ అండ్ టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ ఉన్నాయి. పవర్, ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ రంగాలను మినహాయించి,.. ఆటో, మీడియా, ప్రైవేట్ బ్యాంక్, పీఎస్యూ బ్యాంక్, రియల్టీ, మెటల్, ఫార్మా రంగాల సూచీలు లాభాలతో ముగిశాయి. నిఫ్టీ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు దాదాపు 2 శాతం చొప్పున పెరిగాయి.
