SpaceX IPO: రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా భారత టెక్కీలు! మస్క్ ‘స్పేస్ఎక్స్’ తెస్తున్న లక్ మామూలుగా లేదుగా..
- మస్క్ ‘స్పేస్ఎక్స్’ ఐపీఓ ధమాకా..
- వన్ ట్రిలియన్ డాలర్ల క్లబ్లోకి ఎలాన్..
- కోటీశ్వరులు కానున్న ముగ్గురు ఇండియన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SpaceX IPO: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ (SpaceX) అంతరిక్ష పరిశోధనా సంస్థ శుక్రవారం నాస్డాక్ (Nasdaq) స్టాక్ ఎక్స్ఛేంజ్లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. మార్కెట్లోకి అడుగుపెడుతూనే ఈ కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించాయి. ఐపీఓ ధర $135 (రూ. 11,200 పైచిలుకు) గా నిర్ణయించగా.. లిస్టింగ్ రోజున ఏకంగా 11 శాతం పెరిగి $150 వద్ద ట్రేడింగ్ స్టార్ట్ అయ్యాయి. ఈ చారిత్రాత్మక లిస్టింగ్తో స్పేస్ఎక్స్ మొత్తం మార్కెట్ విలువ ఏకంగా $2.2 ట్రిలియన్లకు (సుమారు రూ.183 లక్షల కోట్లు) చేరుకుంది. స్పేస్ఎక్స్ ఐపీఓ దెబ్బకు ఎలాన్ మస్క్ సంపద రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. ఈ విజయంతో మస్క్ ప్రపంచ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించారు. ఆయన నికర ఆస్తి విలువ 1 ట్రిలియన్ డాలర్లను (మొదటి పది లక్షల కోట్లు) దాటిన ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తిగా ఎలాన్ మస్క్ నిలిచి ప్రత్యేక చరిత్రను లిఖించారు.
మస్క్ సామ్రాజ్యంలో మనోళ్ల హవా..
ఈ ఐపీఓ కేవలం పెట్టుబడిదారులకే కాదు, మస్క్ స్థాపించిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘xAI’ లో కీలక పదవుల్లో ఉన్న ముగ్గురు భారతీయ సంతతి ఇంజినీర్ల జాతకాన్ని కూడా మార్చేయబోతోంది. వారే.. దేవేంద్ర చాప్లోట్, అమన్ మదన్, ఆదిత్య గుప్తా. ఈ ముగ్గురికి గతేడాది (ఏప్రిల్ 2026) మస్క్ కంపెనీ xAI లో అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగించింది. నిజ జీవిత వినియోగంలో AI మోడళ్లను నిర్మించడం, వాటికి శిక్షణ ఇవ్వడంలో వీరు అద్భుత పాత్ర పోషిస్తున్నారు. దేవేంద్ర చాప్లోట్ (IIT బొంబాయి పూర్వ విద్యార్థి). ప్రస్తుతం ఆయన xAI లో ప్రధాన ఏఐ మోడళ్ల బేసిక్ ట్రైనింగ్ విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు. అమన్ మదన్ ఏఐ మోడళ్లను రూపొందించడానికి అవసరమైన టెక్నికల్ టూల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఆదిత్య గుప్తా ఏఐ మోడళ్లను నిజ జీవిత ఉత్పత్తులుగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆదిత్యకి గతంలో గూగుల్ బార్డ్ (Google Bard), గూగుల్ అసిస్టెంట్ ప్రాజెక్టులలో పనిచేసిన అనుభవం ఉంది.
Also Read
- Speed Post New Rates: తపాలా శాఖ కీలక ప్రకటన.. స్పీడ్ పోస్ట్ సేవలకు కొత్త ధరలు.. లేఖలు, పార్శిల్స్ పై కొత్త నిబంధనలు
- Rule Changes from August 1: ఆగస్టు 1 నుంచి రానున్న కొత్త రూల్స్ ఇవే.. LPG ధరల నుంచి తత్కాల్ రైలు టికెట్ల వరకు
- Indane Xtralite Now: ఇండేన్ ఎక్స్ట్రాలైట్ నౌ ప్రారంభం.. తేలికైన LPG సిలిండర్, 4 గంటల్లో హోమ్ డెలివరీ.. బుకింగ్ ఇలా..
- CXMT: ఈ IPO కొన్నవాళ్లకు పండగే పండగ.. లిస్టింగ్తోనే లక్షల్లో లాభాలు!
ఎలాన్ మస్క్కు చెందిన కంపెనీలు తమ ఉద్యోగులకు జీతంతో పాటు భారీగా కంపెనీ షేర్లను అందిస్తాయి. ప్రస్తుతం ఈ ముగ్గురు భారతీయ ఇంజినీర్లు టాప్ పొజిషన్లలో ఉన్న నేపథ్యంలో, వారి వద్ద భారీ సంఖ్యలో షేర్లు ఉన్నాయి. ఇటీవలే స్పేస్ఎక్స్ సంస్థ మస్క్కు చెందిన మరో కంపెనీ xAI ని కొనుగోలు చేసింది (Acquisition). దీనితో xAI లో పనిచేస్తున్న ఈ ముగ్గురు ఇంజినీర్ల షేర్లు ఆటోమేటిక్గా ప్రపంచంలోనే మోస్ట్ డిమాండ్ ఉన్న ‘స్పేస్ఎక్స్’ షేర్లుగా మారిపోయాయి. భవిష్యత్తులో స్పేస్ఎక్స్ మార్కెట్ విలువ మరింత పెరిగితే, ఈ ముగ్గురు సీనియర్ ఇంజినీర్ల ఆస్తుల విలువ వందల కోట్ల రూపాయలకు చేరనుందని చెబుతున్నారు. అయితే లాభాల కోసం వీరు ఐపీఓ వరకే వేచి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్పేస్ఎక్స్ గతంలోనే ప్రైవేట్ డీల్స్ ద్వారా ఉద్యోగులు తమ షేర్లను అమ్ముకునే వెసులుబాటు కల్పించింది. ఏది ఏమైనా, మస్క్ రాకెట్ సక్సెస్లో మన భారతీయ బ్రెయిన్స్ ఉండటం ఇండియాకి గర్వకారణం అని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Prabhas-Fauji: ప్రభాస్ ఫ్యాన్స్కు పిచ్చెక్కించే న్యూస్.. ఈసారి పీక్స్లో..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
-
PM Modi: ప్రధాని మోడీకి మెటా క్షమాపణలు.. సాంకేతిక లోపమే కారణమని స్పష్టీకరణ
-
Chennai Love Story:’చెన్నై లవ్ స్టోరీ’ గ్రాండ్ సక్సెస్ మీట్.. కిరణ్ అబ్బవరం ఎమోషనల్, నాగచైతన్యకు ప్రత్యేక కృతజ్ఞతలు!
-
Uday Krishna Reddy: నేను ఎక్కడికీ పారిపోలేదు.. ఆరోపణలు అన్నీ అవాస్తవం.. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా!
ట్రెండింగ్
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!