Sensex Crash: కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ! దలాల్ స్ట్రీట్లో ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు లాస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sensex Crash: శుక్రవారం మధ్యాహ్నం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనానికి గురయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో సెన్సెక్స్, నిఫ్టీలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ రోజు మధ్యాహ్నం 12:33 గంటల సమయానికి సెన్సెక్స్ 1,011 పాయింట్లు నష్టపోయి 76,653 వద్ద ఉండగా, నిఫ్టీ 283 పాయింట్లు క్షీణించి 23,890 వద్ద ట్రేడవుతోంది.
మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు ఇవే..
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల వల్ల బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్కు $106 మార్కు వద్ద కొనసాగుతోంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ప్రధాన ఐటీ సంస్థలు బలహీనమైన గైడెన్స్ను ప్రకటించడంతో ఐటీ షేర్లు కుప్పకూలాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 5 శాతం పతనమై మార్కెట్ను భారీగా దెబ్బతీసింది. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (FIIలు) వరుసగా నాలుగో రోజు కూడా అమ్మకాలు కొనసాగించారు. గురువారం ఒక్కరోజే రూ.3,200 కోట్లకు పైగా విలువైన షేర్లను విక్రయించడం గమనార్హం. మార్కెట్ భయాందోళనలను సూచించే ‘ఇండియా విక్స్’ (India VIX) 4 శాతం పెరిగి 19.3 వద్దకు చేరింది. ఇది ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళనకు నిదర్శనం.
Also Read
- UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
- Gold-Silver Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24K, 22K, 18K రేట్లు ఎంతంటే?
- Bank Strike 2026: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. నేటి నుంచి వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్..
- Samsung Roasts Apple's First Foldable: యాపిల్ ఫోల్డబుల్పై శామ్సంగ్ ఘాటు సెటైర్లు..
లాభనష్టాల్లోని షేర్లు..
ఈ రోజు మార్కెట్లో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అత్యధికంగా 6 శాతం పడిపోయింది. హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, టీసీఎస్ షేర్లు 4-5 శాతం నష్టపోయాయి. వీటితో పాటు సన్ ఫార్మా, అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్యూఎల్ షేర్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. మార్కెట్ ప్రతికూలంగా ఉన్నప్పటికీ.. కోల్ ఇండియా, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, గ్రాసిమ్, ఎం అండ్ ఎం షేర్లు స్వల్ప లాభాలను సొంతం చేసుకున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా నామమాత్రపు మద్దతును అందించింది. మార్కెట్లో విక్రయాల ఒత్తిడి ఎంత బలంగా ఉందంటే.. దాదాపు 2,752 షేర్లు నష్టాల్లో ట్రేడవుతుండగా, కేవలం 965 షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీకి 23,800 స్థాయి వద్ద కీలక మద్దతు లభించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వరుసగా మూడు సెషన్లలోనే సెన్సెక్స్ 2,400 పాయింట్లకు పైగా, అంటే 3% పడిపోగా, ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ అయిన నిఫ్టీ 50 2.6% క్షీణించింది. ఏప్రిల్ 21న బీఎస్ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.469 లక్షల కోట్లుగా ఉండగా, మూడు రోజుల్లోనే పెట్టుబడిదారులు దాదాపు రూ.9 లక్షల కోట్లు నష్టపోయారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?