Sensex Crash: కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ! దలాల్ స్ట్రీట్లో ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు లాస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sensex Crash: శుక్రవారం మధ్యాహ్నం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనానికి గురయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో సెన్సెక్స్, నిఫ్టీలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ రోజు మధ్యాహ్నం 12:33 గంటల సమయానికి సెన్సెక్స్ 1,011 పాయింట్లు నష్టపోయి 76,653 వద్ద ఉండగా, నిఫ్టీ 283 పాయింట్లు క్షీణించి 23,890 వద్ద ట్రేడవుతోంది.
మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు ఇవే..
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల వల్ల బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్కు $106 మార్కు వద్ద కొనసాగుతోంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ప్రధాన ఐటీ సంస్థలు బలహీనమైన గైడెన్స్ను ప్రకటించడంతో ఐటీ షేర్లు కుప్పకూలాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 5 శాతం పతనమై మార్కెట్ను భారీగా దెబ్బతీసింది. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (FIIలు) వరుసగా నాలుగో రోజు కూడా అమ్మకాలు కొనసాగించారు. గురువారం ఒక్కరోజే రూ.3,200 కోట్లకు పైగా విలువైన షేర్లను విక్రయించడం గమనార్హం. మార్కెట్ భయాందోళనలను సూచించే ‘ఇండియా విక్స్’ (India VIX) 4 శాతం పెరిగి 19.3 వద్దకు చేరింది. ఇది ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళనకు నిదర్శనం.
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
- Cupid Share: కండోమ్ కంపెనీకి కాసుల వర్షం.. రాబడి ఎంతో తెలుసా!
- Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు... క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
లాభనష్టాల్లోని షేర్లు..
ఈ రోజు మార్కెట్లో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అత్యధికంగా 6 శాతం పడిపోయింది. హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, టీసీఎస్ షేర్లు 4-5 శాతం నష్టపోయాయి. వీటితో పాటు సన్ ఫార్మా, అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్యూఎల్ షేర్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. మార్కెట్ ప్రతికూలంగా ఉన్నప్పటికీ.. కోల్ ఇండియా, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, గ్రాసిమ్, ఎం అండ్ ఎం షేర్లు స్వల్ప లాభాలను సొంతం చేసుకున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా నామమాత్రపు మద్దతును అందించింది. మార్కెట్లో విక్రయాల ఒత్తిడి ఎంత బలంగా ఉందంటే.. దాదాపు 2,752 షేర్లు నష్టాల్లో ట్రేడవుతుండగా, కేవలం 965 షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీకి 23,800 స్థాయి వద్ద కీలక మద్దతు లభించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వరుసగా మూడు సెషన్లలోనే సెన్సెక్స్ 2,400 పాయింట్లకు పైగా, అంటే 3% పడిపోగా, ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ అయిన నిఫ్టీ 50 2.6% క్షీణించింది. ఏప్రిల్ 21న బీఎస్ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.469 లక్షల కోట్లుగా ఉండగా, మూడు రోజుల్లోనే పెట్టుబడిదారులు దాదాపు రూ.9 లక్షల కోట్లు నష్టపోయారు.
తాజావార్తలు
-
Drug Syndicate : డ్రగ్స్ రాజధానిపై ‘ఈగల్ ఫోర్స్’ ఉక్కుపాదం.. రూ.6 కోట్ల ఆస్తులు జప్తు.!
-
Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్కు ఆయుర్వేద థెరపీ.. రేపు కేరళకు డిప్యూటీ సీఎం
-
Makkah: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్కు ముప్పు పొంచి ఉందా?
-
Tata Cars Price Hike: టాటా కార్లు కొనేవారికి ఇదే చివరి ఛాన్స్..! పెరగనున్న పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఈవీ కార్ల ధరలు
-
Tollywood Comeback: స్టార్ హీరోల ‘సాలిడ్ కంబ్యాక్’: రికార్డుల మోత మోగిస్తున్న 2026 టాలీవుడ్!
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!