Sensex Crash: కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ! దలాల్ స్ట్రీట్లో ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు లాస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sensex Crash: శుక్రవారం మధ్యాహ్నం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనానికి గురయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో సెన్సెక్స్, నిఫ్టీలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ రోజు మధ్యాహ్నం 12:33 గంటల సమయానికి సెన్సెక్స్ 1,011 పాయింట్లు నష్టపోయి 76,653 వద్ద ఉండగా, నిఫ్టీ 283 పాయింట్లు క్షీణించి 23,890 వద్ద ట్రేడవుతోంది.
మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు ఇవే..
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల వల్ల బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్కు $106 మార్కు వద్ద కొనసాగుతోంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ప్రధాన ఐటీ సంస్థలు బలహీనమైన గైడెన్స్ను ప్రకటించడంతో ఐటీ షేర్లు కుప్పకూలాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 5 శాతం పతనమై మార్కెట్ను భారీగా దెబ్బతీసింది. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (FIIలు) వరుసగా నాలుగో రోజు కూడా అమ్మకాలు కొనసాగించారు. గురువారం ఒక్కరోజే రూ.3,200 కోట్లకు పైగా విలువైన షేర్లను విక్రయించడం గమనార్హం. మార్కెట్ భయాందోళనలను సూచించే ‘ఇండియా విక్స్’ (India VIX) 4 శాతం పెరిగి 19.3 వద్దకు చేరింది. ఇది ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళనకు నిదర్శనం.
Also Read
- Cyber Fraud: ఓటీపీ చెప్పకపోయినా డబ్బు పోతుందా? సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఇలా మోసం చేస్తున్నారు
- PhonePe ITR filing: కేవలం రూ.24తోనే ITR ఫైల్ చేయొచ్చు.. PhonePe, JioFinance కొత్త ట్యాక్స్ ఫైలింగ్ సేవలు ప్రారంభం
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- NPPA: సామాన్యుడికి భారీ ఉపశమనం.. రక్తపోటు నుంచి మధుమేహం వరకు.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం
లాభనష్టాల్లోని షేర్లు..
ఈ రోజు మార్కెట్లో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అత్యధికంగా 6 శాతం పడిపోయింది. హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, టీసీఎస్ షేర్లు 4-5 శాతం నష్టపోయాయి. వీటితో పాటు సన్ ఫార్మా, అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్యూఎల్ షేర్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. మార్కెట్ ప్రతికూలంగా ఉన్నప్పటికీ.. కోల్ ఇండియా, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, గ్రాసిమ్, ఎం అండ్ ఎం షేర్లు స్వల్ప లాభాలను సొంతం చేసుకున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా నామమాత్రపు మద్దతును అందించింది. మార్కెట్లో విక్రయాల ఒత్తిడి ఎంత బలంగా ఉందంటే.. దాదాపు 2,752 షేర్లు నష్టాల్లో ట్రేడవుతుండగా, కేవలం 965 షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీకి 23,800 స్థాయి వద్ద కీలక మద్దతు లభించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వరుసగా మూడు సెషన్లలోనే సెన్సెక్స్ 2,400 పాయింట్లకు పైగా, అంటే 3% పడిపోగా, ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ అయిన నిఫ్టీ 50 2.6% క్షీణించింది. ఏప్రిల్ 21న బీఎస్ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.469 లక్షల కోట్లుగా ఉండగా, మూడు రోజుల్లోనే పెట్టుబడిదారులు దాదాపు రూ.9 లక్షల కోట్లు నష్టపోయారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: “అందుకే జట్టు నుంచి వైభవ్ సూర్యవంశీని తీసేశాం”.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
-
Astrology: శ్రావణ మాసానికి ముందే శని వక్రగతి.. ఈ 5 రాశుల వారికి సంవత్సరాంతం వరకు ధన యోగం!
-
FIFA World Cup 2026: ఆకాశాన్నంటిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ టిక్కెట్ల ధరలు.. 32 ఏళ్లలో 10 రెట్లు పెరిగినయ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Censor Issues : జననాయగన్కు సెన్సార్ బోర్డ్ లైన్ క్లియర్.. ఇక టాక్సిక్ పరిస్థితి ఏంటి?
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!