Dollar vs Rupee: రక్తకన్నీరు పెట్టుకుంటున్న రూపాయి.. తొలిసారిగా రూ.96 మార్క్ను దాటిన డాలర్ విలువ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dollar vs Rupee: అంతర్జాతీయ మార్కెట్లో భారత కరెన్సీ (రూపాయి) విలువ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ పతనాన్ని చవిచూసింది. శుక్రవారం ట్రేడింగ్లో యుఎస్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ సరికొత్త చారిత్రక కనిష్ట స్థాయి 96.07 కి పడిపోయింది. పశ్చిమ ఆసియా (మిడిల్ ఈస్ట్)లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు విపరీతంగా పెరగడంతో రూపాయి వరుసగా మూడో రోజు కూడా తన నష్టాల పరంపరను కొనసాగించింది.
ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్ ప్రారంభంలోనే డాలర్తో పోలిస్తే రూపాయి 95.86 వద్ద బలహీనంగా ఓపెన్ అయింది. ఆ తర్వాత మరింత క్షీణించి, మునుపటి ముగింపుతో పోలిస్తే 30 పైసలు నష్టపోయి 95.94 వద్దకు చేరింది. గురువారం కూడా రూపాయి రికార్డు స్థాయిలో 95.64 వద్ద ముగియగా.. ఇంట్రాడేలో 95.96 గరిష్ట కనిష్టాన్ని తాకిన సంగతి తెలిసిందే.
Also Read
- Stock Market: TCS దూకుడు మామూలుగా లేదుగా.. ఒక్క వారంలోనే రూ.72,000 కోట్ల లాభం!
- Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
రూపాయి పతనానికి ప్రధాన కారణాలు ఇవే..
ఫారెక్స్ ట్రేడర్ల విశ్లేషణ ప్రకారం.. మార్కెట్లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పూర్తిగా దెబ్బతినడానికి ప్రధానంగా మూడు ముఖ్య కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం భారతదేశ దిగుమతి భారాన్ని పెంచుతోంది. ప్రపంచంలోని ఆరు ప్రధాన కరెన్సీలతో పోలిస్తే యుఎస్ డాలర్ బలాన్ని కొలిచే ‘డాలర్ ఇండెక్స్’ 0.24 శాతం పెరిగి 99.05 వద్ద ట్రేడవుతోంది. మిడిల్ ఈస్ట్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ ఇంధన సరఫరాకు ఆటంకం కలుగుతుందనే ఆందోళనలు ఇన్వెస్టర్లలో వ్యక్తమవుతున్నాయి.
రూ. 107 దాటిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్
గ్లోబల్ ఆయిల్ బెంచ్మార్క్ అయిన ‘బ్రెంట్ క్రూడ్’ ఫ్యూచర్స్ మార్కెట్లో 1.30 శాతం పెరిగి బ్యారెల్కు $107.09 కి చేరుకుంది. భారతదేశం తన ముడి చమురు అవసరాలలో అత్యధిక భాగాన్ని దిగుమతుల ద్వారానే పొందుతుంది. కాబట్టి క్రూడ్ ధరలు పెరిగిన ప్రతిసారీ దేశంలో డాలర్లకు డిమాండ్ పెరిగి, రూపాయిపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. భూగోళ రాజకీయ అనిశ్చితి ప్రపంచ ఆర్థిక మార్కెట్లను మరింత ఆందోళనలోకి నెట్టేస్తోంది. ఇంధన డిమాండ్ను నియంత్రించడానికి, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (OMCs) పై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ధరల పెంపుతో సామాన్యుడి జేబుకు మరింత చిల్లు పడనుంది.
తాజావార్తలు
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
-
H-FAST Raids: కల్తీగాళ్ల గుండెల్లో రైళ్లు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో H-FAST భారీ దాడులు..
-
Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
-
Vallabhaneni Anil: టాలీవుడ్లో యూనియన్ వివాదానికి ఫుల్స్టాప్.. జానీ మాస్టర్పై నాన్ కోఆపరేషన్ ఎత్తివేత!
-
Discount On Mobile: తొలి సేల్లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో ‘లగ్జరీ’ ఫోన్.. రేపు అందుబాటులోకి..
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!