Dollar vs Rupee: రక్తకన్నీరు పెట్టుకుంటున్న రూపాయి.. తొలిసారిగా రూ.96 మార్క్ను దాటిన డాలర్ విలువ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dollar vs Rupee: అంతర్జాతీయ మార్కెట్లో భారత కరెన్సీ (రూపాయి) విలువ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ పతనాన్ని చవిచూసింది. శుక్రవారం ట్రేడింగ్లో యుఎస్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ సరికొత్త చారిత్రక కనిష్ట స్థాయి 96.07 కి పడిపోయింది. పశ్చిమ ఆసియా (మిడిల్ ఈస్ట్)లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు విపరీతంగా పెరగడంతో రూపాయి వరుసగా మూడో రోజు కూడా తన నష్టాల పరంపరను కొనసాగించింది.
ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్ ప్రారంభంలోనే డాలర్తో పోలిస్తే రూపాయి 95.86 వద్ద బలహీనంగా ఓపెన్ అయింది. ఆ తర్వాత మరింత క్షీణించి, మునుపటి ముగింపుతో పోలిస్తే 30 పైసలు నష్టపోయి 95.94 వద్దకు చేరింది. గురువారం కూడా రూపాయి రికార్డు స్థాయిలో 95.64 వద్ద ముగియగా.. ఇంట్రాడేలో 95.96 గరిష్ట కనిష్టాన్ని తాకిన సంగతి తెలిసిందే.
Also Read
- Robert Kiyosaki: $100 మిలియన్ల ఆస్తి.. కానీ బిలియన్ల అప్పు! ‘Rich Dad Poor Dad’ రచయిత రాబర్ట్ కియోసాకి అసలు కథ ఇదే
- EPFO కొత్త పథకం.. 6 నెలలే అందుబాటులో ఉండే ఈ కొత్త స్కీమ్తో ఎవరికి లబ్ధి..? పూర్తి వివరాలు..
- Rupee: సంక్షోభం సమయంలో ఆర్బీఐ మాస్టర్ ప్లాన్.. భారీగా పుంజుకున్న రూపాయి విలువ
- PayPal Layoffs: పేపాల్లో భారీ లేఆఫ్స్.. భారత్లో వందలాది మంది ఉద్యోగులకు పింక్ స్లిప్స్..
రూపాయి పతనానికి ప్రధాన కారణాలు ఇవే..
ఫారెక్స్ ట్రేడర్ల విశ్లేషణ ప్రకారం.. మార్కెట్లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పూర్తిగా దెబ్బతినడానికి ప్రధానంగా మూడు ముఖ్య కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం భారతదేశ దిగుమతి భారాన్ని పెంచుతోంది. ప్రపంచంలోని ఆరు ప్రధాన కరెన్సీలతో పోలిస్తే యుఎస్ డాలర్ బలాన్ని కొలిచే ‘డాలర్ ఇండెక్స్’ 0.24 శాతం పెరిగి 99.05 వద్ద ట్రేడవుతోంది. మిడిల్ ఈస్ట్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ ఇంధన సరఫరాకు ఆటంకం కలుగుతుందనే ఆందోళనలు ఇన్వెస్టర్లలో వ్యక్తమవుతున్నాయి.
రూ. 107 దాటిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్
గ్లోబల్ ఆయిల్ బెంచ్మార్క్ అయిన ‘బ్రెంట్ క్రూడ్’ ఫ్యూచర్స్ మార్కెట్లో 1.30 శాతం పెరిగి బ్యారెల్కు $107.09 కి చేరుకుంది. భారతదేశం తన ముడి చమురు అవసరాలలో అత్యధిక భాగాన్ని దిగుమతుల ద్వారానే పొందుతుంది. కాబట్టి క్రూడ్ ధరలు పెరిగిన ప్రతిసారీ దేశంలో డాలర్లకు డిమాండ్ పెరిగి, రూపాయిపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. భూగోళ రాజకీయ అనిశ్చితి ప్రపంచ ఆర్థిక మార్కెట్లను మరింత ఆందోళనలోకి నెట్టేస్తోంది. ఇంధన డిమాండ్ను నియంత్రించడానికి, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (OMCs) పై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ధరల పెంపుతో సామాన్యుడి జేబుకు మరింత చిల్లు పడనుంది.
తాజావార్తలు
-
Kaaka : వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ ‘కాకా’ లేనట్టేనా..?
-
Kareena Kapoor: ఆ టైంలో హీరోయిన్ అవ్వాలనే పిచ్చితో అలా చేశాను.. కానీ ఇప్పుడు అది బిగ్ రిగ్రెట్!
-
Irumudi: 200 కోట్లు దాటినా తగ్గని ‘ఇరుముడి’ జోరు.. సెప్టెంబర్ లో మరింత జోరు ఉంటుందా ?
-
Ram Charan: మెగా ఫ్యామిలీ స్పెషల్ ఫోటో.. ముగ్గురు పిల్లలతో రామ్ చరణ్ – ఉపాసన జన్మాష్టమి వేడుకలు!
-
Rain Alert: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజుల పాటు వర్షాలు!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!