Dollar vs Rupee: రక్తకన్నీరు పెట్టుకుంటున్న రూపాయి.. తొలిసారిగా రూ.96 మార్క్ను దాటిన డాలర్ విలువ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dollar vs Rupee: అంతర్జాతీయ మార్కెట్లో భారత కరెన్సీ (రూపాయి) విలువ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ పతనాన్ని చవిచూసింది. శుక్రవారం ట్రేడింగ్లో యుఎస్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ సరికొత్త చారిత్రక కనిష్ట స్థాయి 96.07 కి పడిపోయింది. పశ్చిమ ఆసియా (మిడిల్ ఈస్ట్)లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు విపరీతంగా పెరగడంతో రూపాయి వరుసగా మూడో రోజు కూడా తన నష్టాల పరంపరను కొనసాగించింది.
ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్ ప్రారంభంలోనే డాలర్తో పోలిస్తే రూపాయి 95.86 వద్ద బలహీనంగా ఓపెన్ అయింది. ఆ తర్వాత మరింత క్షీణించి, మునుపటి ముగింపుతో పోలిస్తే 30 పైసలు నష్టపోయి 95.94 వద్దకు చేరింది. గురువారం కూడా రూపాయి రికార్డు స్థాయిలో 95.64 వద్ద ముగియగా.. ఇంట్రాడేలో 95.96 గరిష్ట కనిష్టాన్ని తాకిన సంగతి తెలిసిందే.
Also Read
- CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
- RBI Cancels 150 NFBC License: 150 ఎన్బిఎఫ్సి కంపెనీల ఆర్బీఐ కొరఢా.. లైసెన్సులు రద్దు
- Best Investment: నెలకు రూ.10 వేల పెట్టుబడి.. ఐదేళ్లకు కళ్లు చెదిరే లాభాలు.. చాట్ జీపీటీ చెప్పిన ప్లాన్ ఇదే..
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
రూపాయి పతనానికి ప్రధాన కారణాలు ఇవే..
ఫారెక్స్ ట్రేడర్ల విశ్లేషణ ప్రకారం.. మార్కెట్లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పూర్తిగా దెబ్బతినడానికి ప్రధానంగా మూడు ముఖ్య కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం భారతదేశ దిగుమతి భారాన్ని పెంచుతోంది. ప్రపంచంలోని ఆరు ప్రధాన కరెన్సీలతో పోలిస్తే యుఎస్ డాలర్ బలాన్ని కొలిచే ‘డాలర్ ఇండెక్స్’ 0.24 శాతం పెరిగి 99.05 వద్ద ట్రేడవుతోంది. మిడిల్ ఈస్ట్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ ఇంధన సరఫరాకు ఆటంకం కలుగుతుందనే ఆందోళనలు ఇన్వెస్టర్లలో వ్యక్తమవుతున్నాయి.
రూ. 107 దాటిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్
గ్లోబల్ ఆయిల్ బెంచ్మార్క్ అయిన ‘బ్రెంట్ క్రూడ్’ ఫ్యూచర్స్ మార్కెట్లో 1.30 శాతం పెరిగి బ్యారెల్కు $107.09 కి చేరుకుంది. భారతదేశం తన ముడి చమురు అవసరాలలో అత్యధిక భాగాన్ని దిగుమతుల ద్వారానే పొందుతుంది. కాబట్టి క్రూడ్ ధరలు పెరిగిన ప్రతిసారీ దేశంలో డాలర్లకు డిమాండ్ పెరిగి, రూపాయిపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. భూగోళ రాజకీయ అనిశ్చితి ప్రపంచ ఆర్థిక మార్కెట్లను మరింత ఆందోళనలోకి నెట్టేస్తోంది. ఇంధన డిమాండ్ను నియంత్రించడానికి, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (OMCs) పై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ధరల పెంపుతో సామాన్యుడి జేబుకు మరింత చిల్లు పడనుంది.
తాజావార్తలు
-
Dollar vs Rupee: రక్తకన్నీరు పెట్టుకుంటున్న రూపాయి.. తొలిసారిగా రూ.96 మార్క్ను దాటిన డాలర్ విలువ!
-
Durandhar 2 Review: ఓటీటీలోకి ‘ధురంధర్: ద రివెంజ్’.. ఎక్కడ? ఎప్పుడు? చూడాలంటే!
-
Peddi : వేట షురూ.. ‘రాంబుజ్జి’గా దివ్యేందు సంచలన ఎంట్రీ!
-
Bhojshala Case: “భోజ్శాల హిందువులదే”.. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
-
Monsoon 2026: గుడ్న్యూస్.. కేరళలోకి ఆరు రోజులు ముందుగానే మాన్సూన్ ఎంట్రీ! ఖరారు చేసిన ఐఎండీ..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!