ప్రపంచవ్యాప్తంగా బుల్లెట్ బండ్లకు పేరుగాంచిన రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి అడుగుపెట్టింది. పాతకాలపు క్లాసిక్ లుక్, ఆధునిక టెక్నాలజీ కలయికతో తన తొలి ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ ‘ఫ్లయింగ్ ఫ్లీ C6’ను భారత మార్కెట్లో విడుదల చేసింది. సాధారణంగా రాయల్ ఎన్ఫీల్డ్ అంటే బరువైన ఇంజన్ శబ్దం గుర్తుకువస్తుంది, కానీ ఈ కొత్త బైక్ నిశ్శబ్దంగా.. పర్యావరణానికి మేలు చేస్తూ దూసుకుపోతుంది. తక్కువ బరువు, అదిరిపోయే ఫీచర్లతో వచ్చిన ఈ బైక్ యువతను, ముఖ్యంగా సిటీలో ప్రయాణించే వారిని ఆకట్టుకునేలా రూపొందించబడింది.
ఈ బైక్ ప్రారంభ ధరను రూ. 2.79 లక్షలుగా నిర్ణయించారు. అయితే.. ‘బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్’ (BaaS) పద్ధతిలో తీసుకుంటే దీని ధర రూ. 1.99 లక్షలకే లభిస్తుంది. ఇందులో 3.91 kWh బ్యాటరీ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 154 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. కేవలం 65 నిమిషాల్లోనే బ్యాటరీ 20 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.
Also Read:Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..
ఫ్లయింగ్ ఫ్లీ C6 కేవలం 3.7 సెకన్లలోనే 60 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 115 కిలోమీటర్లు. ఇందులో గూగుల్ మ్యాప్స్ ఆధారిత నావిగేషన్, ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్, ప్రమాదాల నుంచి రక్షించే అధునాతన బ్రేకింగ్ సిస్టమ్ (ABS) ఉన్నాయి. రైడర్ తన ఇష్టానుసారం వేగాన్ని మార్చుకోవడానికి వివిధ రకాల ‘రైడ్ మోడ్స్’ కూడా ఇందులో ఉన్నాయి.
తేలికపాటి డిజైన్..
ఈ బైక్ ప్రత్యేకత ఏమిటంటే దీని బరువు. కేవలం 124 కిలోల బరువుతో, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ చరిత్రలోనే అత్యంత తేలికైన బైక్గా ఇది నిలిచింది. దీని సీటు గాలిలో తేలుతున్నట్లు కనిపిస్తుంది. ఇది బైక్కు సరికొత్త అందాన్ని తెచ్చిపెట్టింది. అల్యూమినియం బాడీతో తయారైన ఈ బైక్ చూడటానికి చాలా స్టైలిష్గా ఉంటుంది. సిటీ రోడ్లపై హాయిగా, సులభంగా ప్రయాణించాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్.
