Jio IPO: వేల కోట్లు కొల్లగొట్టడానికి రెడీ అయిన జియో.. ఐపీఓపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన ముఖేష్ అంబానీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jio IPO: రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశం (AGM) వేదికగా కంపెనీ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ సంచలన ప్రకటన చేసేశారు. జియో ప్లాట్ఫార్మ్స్ (Jio Platforms) ఐపీఓ (IPO)కి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపిందని ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన ‘డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్’ (DRHP)ను ఈ రోజే (శుక్రవారం) మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ (SEBI)కి సమర్పిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కీలక అడుగుతో దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐపీఓ రియాలిటీగా మారబోతోంది.
భారత మార్కెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఐపీఓ..
జియో ప్రతిపాదిత ఐపీఓ దేశంలోనే ఇప్పటివరకు రానటువంటి అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలవబోతోందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్ఎస్ఈ (NSE) ప్రతిపాదిత రూ.30,000 కోట్ల ఐపీఓ, హ్యుందాయ్ మోటార్ ఇండియాకు చెందిన రూ.27,870 కోట్ల ఐపీఓ రికార్డులను కూడా జియో అధిగమించనుందని టాక్. ఈ ప్రతిపాదన ప్రకారం రూ.10 ఫేస్ వాల్యూ కలిగిన సుమారు 27 కోట్ల కొత్త షేర్లను కంపెనీ జారీ చేయనుంది. తొలత ఆఫర్ ఫర్ సేల్ (OFS) మోడల్ను పరిశీలించినప్పటికీ, రిలయన్స్ చివరికి ‘ఫ్రెష్ ఇష్యూ’ వైపే మొగ్గు చూపింది. దీనివల్ల ఐపీఓ ద్వారా వచ్చే నిధులు నేరుగా జియో ఖాతాకే వెళ్తాయి. ఆ నిధులను వ్యాపార విస్తరణ, సరికొత్త టెక్నాలజీ, డిజిటల్ సేవల కోసం వినియోగిస్తారు. “ప్రపంచ స్థాయి సాంకేతిక కంపెనీలను నిర్మించడంలో భారత్ ఎంత సమర్థవంతమైనదో జియో లిస్టింగ్ ప్రపంచానికి చాటిచెబుతుంది” అని ముఖేష్ అంబానీ ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- Gold and Silver Prices Today: గోల్డ్, సిల్వర్ ధరలు ఢమాల్.. ఊహించని రీతిలో తగ్గినయ్
- Mutual Funds: ఆదాయం తక్కువగా ఉందని బాధపడుతున్నారా? ఈ పెట్టుబడితో ధనవంతులైపోవచ్చు..!
- Gold Imports: బంగారంపై 15% దిగుమతి సుంకం ప్రభావం.. 70% తగ్గిన దిగుమతులు
- EPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వడ్డీకి కేంద్రం ఆమోదం.. ఎంత శాతం? జమ ఎప్పుడంటే..?
లాభాల బాటలో జియో..
ఐపీఓ వస్తున్న తరుణంలో జియో ఆర్థిక ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో కంపెనీ ప్రదర్శన ఎలా ఉందంటే.. కంపెనీ ఆపరేటింగ్ రెవెన్యూ 13% పెరిగి రూ. 44,928 కోట్లకు చేరింది. ఇదే సమయంలో నెట్ ప్రాఫిట్ (నికర లాభం) 13% వృద్ధితో రూ.7,935 కోట్లుగా నమోదైంది. ARPU (సగటు ఆదాయం).. ప్లాన్ల ధరల పెంపుతో రూ.214కు పెరిగింది. ప్రతి కస్టమర్ నెలకు సగటున 42.3 GB డేటాను వాడుతున్నారు. ప్రస్తుతం జియోకు దేశవ్యాప్తంగా 50 కోట్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. దేశవ్యాప్తంగా 5G నెట్వర్క్, బ్రాడ్బ్యాండ్, క్లౌడ్ సేవలను జియో వేగంగా విస్తరిస్తోంది. 2020లోనే గూగుల్, మెటా, కెకెఆర్, సిల్వర్ లేక్, సౌదీ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వంటి ప్రపంచ దిగ్గజాలు జియోలో భారీ పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అందరి కళ్లు సెబీ ఇచ్చే అనుమతి, ఐపీఓ లాంచ్ టైమ్లైన్పైనే ఉన్నాయి.
- Tags
- Jio
- Jio Ipo
- Q4 profits
- ril agm
- SEBI
తాజావార్తలు
-
Jio IPO: వేల కోట్లు కొల్లగొట్టడానికి రెడీ అయిన జియో.. ఐపీఓపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన ముఖేష్ అంబానీ!
-
The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
-
JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
-
Nagadurga: సుకుమార్ – బన్నీ వాస్ బ్యానర్లలో క్రేజీ ప్రాజెక్ట్.. ప్రియదర్శి జోడీగా రంగంలోకి దిగిన ఫోక్ స్టార్!
-
Afghan: పాక్ గడ్డపై ఆఫ్ఘన్ డ్రోన్ల పంజా.. గురితప్పని దాడి, కుప్పకూలిన ఐసిస్ అడ్డాలు!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?