RBI: బీ అలర్ట్.. రూ.500 నోట్లపై ఆర్బీఐ కీలక విషయం వెల్లడి..
- రూ.500 నోట్లపై ఆర్బీఐ కీలక విషయం వెల్లడి
- దేశంలో రూ.500 నోట్ల చలామణి భారీగా పెరుగుతోంది
- నకిలీ రూ.500 నోట్ల ముప్పు కూడా ఆందోళన కలిగిస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిజిటల్ చెల్లింపులు, UPI సేవలు వేగంగా విస్తరిస్తున్నప్పటికీ భారత మార్కెట్లో నగదు వినియోగం ఏమాత్రం తగ్గడం లేదని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. Reserve Bank of India (RBI) విడుదల చేసిన తాజా వార్షిక నివేదికలో దేశ కరెన్సీ చలామణిపై పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. ఈ నివేదిక ప్రకారం, దేశంలో రూ.500 నోట్ల చలామణి భారీగా పెరుగుతోంది. అయితే, అదే సమయంలో నకిలీ రూ.500 నోట్ల ముప్పు కూడా ఆందోళన కలిగిస్తోంది.
రూ.500 నోట్ల ఆధిపత్యం పెరుగుతోంది
Also Read
- Istamart CEO: ఇన్స్టామార్ట్ సీఈఓ రాజీనామా.. భారీగా పెరిగిన స్విగ్గీ షేర్లు..
- Johnson & Johnson: వేల కోట్ల సెటిల్మెంట్కి రెడీ అయిన ప్రపంచ దిగ్గజ కంపెనీ.. అక్షరాల రూ.52 వేల కోట్లు ఇవ్వడానికి డీల్!
- Speed Post New Rates: తపాలా శాఖ కీలక ప్రకటన.. స్పీడ్ పోస్ట్ సేవలకు కొత్త ధరలు.. లేఖలు, పార్శిల్స్ పై కొత్త నిబంధనలు
- Rule Changes from August 1: ఆగస్టు 1 నుంచి రానున్న కొత్త రూల్స్ ఇవే.. LPG ధరల నుంచి తత్కాల్ రైలు టికెట్ల వరకు
RBI అంచనాల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.500 నోట్ల సంఖ్య 11.2 శాతం మేర పెరగనుంది. 2026 మార్చి నాటికి చలామణిలో ఉన్న రూ.500 నోట్ల సంఖ్య 634,458 లక్షల నుంచి 705,482 లక్షలకు పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. మొత్తం కరెన్సీ విలువలో రూ.500 నోట్ల వాటా 86 శాతానికి పైగా ఉంది. ఇక చలామణిలో ఉన్న మొత్తం నోట్ల సంఖ్యలో రూ.500 నోట్ల వాటా 41.2 శాతం ఉండగా, తర్వాతి స్థానంలో రూ.10 నోట్లు 16.1 శాతం వాటాతో ఉన్నాయి.
నకిలీ రూ.500 నోట్లపై RBI ఆందోళన
ఈ భారీ చలామణి మధ్య నకిలీ రూ.500 నోట్ల సంఖ్య పెరగడం ప్రధాన ఆందోళనగా మారింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ వ్యవస్థలో పట్టుబడిన నకిలీ రూ.500 నోట్ల సంఖ్య 20 శాతానికి పైగా పెరిగినట్లు RBI వెల్లడించింది. దీంతో నగదు లావాదేవీలు చేసే సమయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర బ్యాంకు హెచ్చరించింది.
రూ.2,000 నోట్ల ఉపసంహరణ దాదాపు పూర్తి
మే 2023లో ప్రారంభమైన రూ.2,000 నోట్ల ఉపసంహరణ ప్రక్రియ ఇప్పుడు తుది దశకు చేరుకుంది. 2026 మార్చి 31 నాటికి చలామణిలో ఉన్న రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లలో 98.45 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి చేరినట్లు RBI తెలిపింది.
అసలు, నకిలీ రూ.500 నోట్లను ఎలా గుర్తించాలి?
RBI ప్రకారం, అసలైన రూ.500 నోట్లలో పలు భద్రతా లక్షణాలు ఉంటాయి. వాటిలో:
మహాత్మా గాంధీ చిత్రం
సెక్యూరిటీ థ్రెడ్
రంగు మారే సిరా
వాటర్మార్క్
ఉబ్బెత్తుగా ఉండే ప్రింటింగ్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉంటాయి. నోటు రంగు, కాగితం నాణ్యత లేదా ప్రింటింగ్లో ఏవైనా అనుమానాస్పద మార్పులు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలని RBI సూచిస్తోంది.
నాణేల వినియోగం కూడా పెరుగుతోంది
RBI నివేదిక ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశంలో నాణేల వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. మార్కెట్లో చలామణిలో ఉన్న నాణేల మొత్తం విలువ 11.4 శాతం పెరగగా, వాటి సంఖ్య 4.5 శాతం పెరిగింది. రూ.1, రూ.2, రూ.5 నాణేలు కలిపి మొత్తం నాణేల మార్కెట్లో దాదాపు 80.7 శాతం వాటా కలిగి ఉన్నాయని నివేదిక వెల్లడించింది.
తాజావార్తలు
-
Sanju Samson: కోహ్లీ సలహాలు నేను పట్టించుకోను.. సంచలన వ్యాఖ్యలు చేసిన సంజూ శాంసన్..
-
Kitchen Hacks : పిండి కలిపేటప్పుడు.. ఇవి కలిపితే.. చపాతీ పొంగి దూదిలా పొంగుతుంది..
-
Heavy Rain Alert: తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో 2 రోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..
-
Pakistan: భారత్లా పాకిస్తాన్లో విద్యార్థి ఉద్యమాలు సాధ్యం కావు.. ఎందుకంటే.?
-
Modi-IAS: తన రాజీనామా ఆమోదించండి.. ప్రధాని మోడీకి మాజీ ఐఏఎస్ వినతి
ట్రెండింగ్
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!