RBI: లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంకు మీ మొబైల్ ఫోన్ను లాక్ చేస్తుందా? షాకిస్తున్న ఆర్బిఐ కొత్త ప్రతిపాదన
- రుణ వసూళ్లకు సంబంధించిన నిబంధనల్లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదించిన కీలక మార్పులు
- EMI చెల్లిస్తే గంటలోపు ఫోన్ అన్లాక్
- ఈ నిబంధన ప్రతి రుణానికి వర్తించదని RBI స్పష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీరు రుణం తీసుకుని మొబైల్ ఫోన్ కొనుగోలు చేసి, EMIలను సకాలంలో చెల్లించకపోతే, భవిష్యత్తులో బ్యాంకులు మీ స్మార్ట్ఫోన్లోని కొన్ని సేవలను పరిమితం చేసే అవకాశం ఉంది. రుణ వసూళ్లకు సంబంధించిన నిబంధనల్లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదించిన కీలక మార్పులు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
అయితే, ఈ నిబంధన ప్రతి రుణానికి వర్తించదని RBI స్పష్టం చేసింది. మొబైల్ ఫోన్, టాబ్లెట్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ప్రత్యేకంగా “డివైస్ లోన్” ద్వారా కొనుగోలు చేసిన సందర్భాల్లో మాత్రమే ఈ నియమాలు అమల్లోకి రావచ్చు. వ్యక్తిగత రుణం, గృహ రుణం లేదా వాహన రుణం చెల్లించకపోయినా బ్యాంకులు వినియోగదారుల ఫోన్లను లాక్ చేయలేవు.
Also Read
- Robert Kiyosaki: $100 మిలియన్ల ఆస్తి.. కానీ బిలియన్ల అప్పు! ‘Rich Dad Poor Dad’ రచయిత రాబర్ట్ కియోసాకి అసలు కథ ఇదే
- EPFO కొత్త పథకం.. 6 నెలలే అందుబాటులో ఉండే ఈ కొత్త స్కీమ్తో ఎవరికి లబ్ధి..? పూర్తి వివరాలు..
- Rupee: సంక్షోభం సమయంలో ఆర్బీఐ మాస్టర్ ప్లాన్.. భారీగా పుంజుకున్న రూపాయి విలువ
- PayPal Layoffs: పేపాల్లో భారీ లేఆఫ్స్.. భారత్లో వందలాది మంది ఉద్యోగులకు పింక్ స్లిప్స్..
ఫోన్ సేవలను ఎప్పుడు పరిమితం చేయవచ్చు?
RBI ప్రతిపాదన ప్రకారం, డివైస్ లోన్ తీసుకున్న వినియోగదారుడు వరుసగా 90 రోజుల పాటు EMIలు చెల్లించకపోతే, బ్యాంకు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే, అలాంటి చర్యలకు ముందు వినియోగదారునికి తప్పనిసరిగా ముందస్తు నోటీసు ఇవ్వాలి. దీని అనంతరం, బ్యాంకులు ఫోన్లోని కొన్ని ఫీచర్లను తాత్కాలికంగా నిలిపివేయడం లేదా పరిమితం చేయడం చేయవచ్చు.
పూర్తిగా ఫోన్ బ్లాక్ కాదు
వినియోగదారులకు ఊరటనిచ్చే అంశంగా, ఫోన్ను పూర్తిగా నిలిపివేయరాదని RBI స్పష్టం చేసింది. కింది అత్యవసర సేవలు యథావిధిగా పనిచేస్తాయి:
ఇంటర్నెట్ కనెక్టివిటీ
ఇన్కమింగ్ కాల్స్
SOS / అత్యవసర సేవలు
ప్రభుత్వ అత్యవసర హెచ్చరికలు
అంటే, వినియోగదారుల కమ్యూనికేషన్ పూర్తిగా నిలిచిపోదు.
EMI చెల్లిస్తే గంటలోపు ఫోన్ అన్లాక్
వినియోగదారుడు బకాయి EMIని చెల్లించిన తర్వాత, బ్యాంకు ఒక గంటలోపు ఫోన్ సేవలను పునరుద్ధరించాల్సి ఉంటుంది. అలా చేయడంలో విఫలమైతే, బ్యాంకు గంటకు రూ.250 చొప్పున వినియోగదారునికి నష్టపరిహారం చెల్లించాల్సి రావచ్చు.
రికవరీ ఏజెంట్లపై కఠిన నియంత్రణ
రికవరీ ఏజెంట్ల ప్రవర్తనపై కూడా RBI కఠిన నిబంధనలను ప్రతిపాదించింది.
ఇకపై ఏజెంట్లు.. వినియోగదారులను బెదిరించడం, దూషణలు చేయడం, వ్యక్తిగత సమాచారం లేదా వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోవడం, అధికంగా కాల్స్ లేదా మెసేజ్లు పంపడం, వంటి చర్యలు చేయకూడదు. ఇవి నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడతాయి.
కాల్ రికార్డింగ్ తప్పనిసరి
కొత్త మార్గదర్శకాల ప్రకారం, రికవరీకి సంబంధించిన ప్రతి కాల్ వివరాలను బ్యాంకులు భద్రపరచాలి. ఎప్పుడు కాల్ చేశారు, ఎంతసేపు మాట్లాడారు, ఏమి చర్చించారు వంటి వివరాలన్నీ రికార్డ్ చేయాల్సి ఉంటుంది.
ఈ ప్రతిపాదిత నిబంధనలపై RBI మే 31 వరకు ప్రజలు, సంస్థల నుంచి అభిప్రాయాలు, సూచనలు కోరుతోంది. ఈ నిబంధనలు 2026 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశముందని సమాచారం.
తాజావార్తలు
-
Irumudi: 200 కోట్లు దాటినా తగ్గని ‘ఇరుముడి’ జోరు.. సెప్టెంబర్ లో మరింత జోరు ఉంటుందా ?
-
Ram Charan: మెగా ఫ్యామిలీ స్పెషల్ ఫోటో.. ముగ్గురు పిల్లలతో రామ్ చరణ్ – ఉపాసన జన్మాష్టమి వేడుకలు!
-
Rain Alert: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజుల పాటు వర్షాలు!
-
Shruti Haasan: AI డీప్ఫేక్లపై శృతి హాసన్కు హైకోర్టు రక్షణ.. కీలక ఆదేశాలు!
-
Redmi 17 5G: రెడ్ మీ 17 5G భారత్లో లాంచ్.. 7900mAh బ్యాటరీ.. 50MP కెమెరా!.. ధర, ఫీచర్లు ఇవే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!