GST: జీఎస్టీకి ముందు.. బెంగళూరు నుంచి హైదరాబాద్కు వచ్చే వస్తువులు యూరప్ మీదుగా పంపాల్సి వచ్చేదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GST: జీఎస్టీ అమలుకు ముందు భారతదేశ పన్ను వ్యవస్థ ఎలా ఉండేదో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం వెలుగులోకి తెచ్చారు. గతంలో వ్యాపారాలు డజన్ల కొద్దీ పన్నులు చెల్లించి లెక్కలేనన్ని ఫారమ్లను పూరించాల్సి వచ్చేదన్నారు. పరిస్థితి చాలా కష్టంగా ఉండేదని తెలిపారు.. కంపెనీలు వస్తువులను విదేశాలకు పంపించి, తిరిగి మన దేశానికే దిగుమతి చేసుకునేవి అని వివరించారు. అయితే.. ప్రధాని మోడీ ఉదహరించిన సంఘటన ఫ్రెంచ్ వార్తాపత్రిక లెస్ ఎకోస్లో ప్రచురించబడింది. 2014 నివేదిక ప్రకారం.. భారతదేశంలో పనిచేస్తున్న ఒక ఫ్రెంచ్ టెక్నాలజీ కంపెనీ బెంగళూరు నుంచి తన వస్తువులను హైదరాబాద్కు పంపాలంటే ముందుగా యూరప్కి పంపేది. అక్కడి నుంచి హైదరాబాద్కి దిగుమతి చేసుకునేది. ఈ రెండు భారతీయ నగరాలు కేవలం 570 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ.. ఇతర దేశమైన యూరప్కి పంపడం ఆ కంపెనీకి సులభంగా, చౌకగా మారేది. ఎందుకు కంటే.. బెంగళూరు, హైదరాబాద్ మధ్య అనేక రాష్ట్ర సరిహద్దులు, టోల్ ప్లాజాలు, చెక్పోస్టుల వద్ద సమయం, ఖర్చులు వృథా అవుతున్నాయని గమనించిన కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read
- Domestic LPG Cylinder Price Hiked: గృహ వినియోగదారులకు షాక్.. పెరిగిన వంటగ్యాస్ ధరలు.. ఎంతంటే?
- Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
- Aadhaar Update: ఆధార్లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
- Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
నాడు పన్నులు, డాక్యుమెంట్ పనులు కంపెనీలకు చికాకు తెప్పించేవి. ప్రవేశ పన్ను, అమ్మకపు పన్ను, ఎక్సైజ్, సేవా పన్ను, వ్యాట్ వంటి అనేక పన్నులు ఉండేవి. ఈ పన్నుల వల్ల ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వస్తువులను రవాణా చేయడం చాలా కష్టంగా ఉండేది. పదులు సంఖ్యలో ఫారమ్లను పూరించాల్సి వచ్చేది. చెక్పోస్టులు, పన్ను వసూలు పాయింట్ల వద్ద రోడ్బ్లాక్స్ అయ్యేవి. ఇవి వ్యాపారులకు ప్రధాన సమస్యగా మారాయి. అంతే కాకుండా.. సమయంతోపాటు ఖర్చులనూ పెంచింది. ప్రస్తుతం జీఎస్టీ అమల్లోకి వచ్చిన తరువాత ఈ బాధలన్నీ తప్పాయని ప్రధాని మోడీ తన ప్రసంగంలో వివరించారు. “ఒక దేశం, ఒక పన్ను” అనే కల నెరవేరిందని.. దేశవ్యాప్తంగా పన్ను వ్యవస్థ ఇప్పుడు సరళంగా మారిందన్నారు. ఇది వ్యాపారాలకు ఉపశమనం కలిగిస్తోందని తెలిపారు. భారతదేశ వ్యాపార వ్యవస్థ గతంలో కంటే మరింత పారదర్శకంగా, సరళంగా మారిందని వివరించారు.
READ MORE: Iga Swiatek: Korea Open 2025 విజేతగా ‘ఇగా స్వియాటెక్’
తాజావార్తలు
-
Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
-
7 Seater Cars: మారుతి ఎర్టిగా నుంచి మహీంద్రా బొలెరో వరకు.. రూ.5.65 లక్షల నుంచి లభించే చౌకైన 7-సీటర్ కార్లు ఇవే
-
Samantha Ruth Prabhu : ‘మా ఇంటి బంగారం’ హీరోయిన్ సాయి పల్లవా ? ఆ ఛాన్స్ సామ్ ఎలా కొట్టేసిందంటే ?
-
Vivo V70 Lite: వివో V70 లైట్ విడుదల.. 6500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, 6.77 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే
-
Astrology: డబ్బు విషయంలో ఈ 3 రాశులవారు చాలా జాగ్రత్త.. ఖర్చు పెట్టే ముందు పదిసార్లు ఆలోచిస్తారట!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!